*టి.ఎన్.యస్.ఎఫ్ సారధిగా 'ప్రణవ్ ' నియామకం హర్షణీయం* బొల్లినేని.సురేంద్ర... వింజమూరు, జూన్ 25 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): రాష్ట్ర తెలుగు నాడు స్టూడెండ్స్ ఫెడరేషన్ (టి.ఎస్.యస్.ఎఫ్) అధ్యక్షులుగా ప్రణవ్ గోపాల్ నియామకం హర్షణీయమని ఉదయగిరి నియోజకవర్గ తెలుగుయువత ప్రతినిధి బొల్లినేని.సురేంద్ర అన్నారు. గురువారం నాడు వింజమూరుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో సుభిక్ష పరిపాలన ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యపడుతుందన్నారు. రాజకీయ పరిణతి కలిగి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభ్యున్నతికి నిరంతరం పాటుపడే ఏకైక వ్యక్తి నారా.చంద్రబాబు నాయుడు మాత్రమేనని కొనియాడారు. ఇటీవల మహానాడును ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన టి.డి.పి అధినేత చంద్రబాబు రానున్న రోజులలో పార్టీలో యువతకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర టి.ఎన్.యస్.ఎఫ్ అధ్యక్షుడుగా ప్రణవ్ గోపాల్ కు పట్టం కట్టారన్నారు. ప్రణవ్ గతంలో విశాఖ జిల్లా టి.ఎన్.యస్.ఎఫ్ శాఖ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేసి పార్టీ అభివృద్ధికి ఎనలేని సేవలందించారన్నారు. విధ్యార్ధి సమస్యల సాధనలో విశాఖలో పోరాట పటిమను చాటిన ఘనతను ప్రణవ్ గోపాల్ దక్కించుకున్నారని సురేంద్ర కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుయువతను బలోపేతం చేసే శక్తి సామర్ధ్యాలు ప్రణవ్ మెదడులో మెండుగా ఉన్నాయన్నారు. ప్రణవ్ గోపాల్ నేతృత్వంలో ఉదయగిరి నియోజకవర్గంలో టి.ఎస్.యస్.ఎఫ్, సి.బి.యన్ ఆర్మీ విభాగాలను మరింత బలోపేతం చేయనున్నామన్నారు. గ్రామ స్థాయి నుండి ప్రజా సమస్యలపై రాజీలేని నిరంతర పోరాటం సాగిస్తామన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ఎలుగెత్తి చాటుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఓట్లు వేయాలని ప్రజల ముందుగు వెళ్ళి అడిగే హక్కు ఒక్క టి.డి.పి నేతలకే ఉందని బొల్లినేని.సురేంద్ర స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమార్గాలను ఆయుధాలుగా మలిచి గ్రామ స్థాయి నుండి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు శక్తి వంచన లేకుండా పాటుపడతామన్నారు. వై.సి.పి ప్రభుత్వ కక్ష్యపూరిత విధానాలను ప్రజలందరూ క్షుణ్ణంగా గమనిస్తున్నారన్నారు. ఉదయగిరి కోటపై తిరిగి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడటం తధ్యమని సురేంద్ర జోస్యం పలికారు. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న మాజీ యం.యల్.ఏ బొల్లినేని.వెంకటరామారావు, యువనేతలు బొల్లినేని.ధనూష్ శ్రీనివాస్, కార్తీక్ ల నేతృత్వంలో ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో నూతనోత్సాహమును నింపనున్నామన్నారు. ఈ సమావేశంలో నందమూరి.బాలక్రిష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు ఎస్.కే.షరీఫ్, టి.డి.పి అధికార ప్రతినిధి పెరుమాళ్ళు పాల్గొన్నారు.
Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
• Valluru Prasad Kumar
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
• Valluru Prasad Kumar
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
• Valluru Prasad Kumar
జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధికి సహకరించండి.. * కమిషనర్ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు నెల్లూరు: పాత్రికేయులకు నెల్లూరులో ప్రభుత్వం కేటాయించిన జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అడహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్కుమార్ బుధవారం మున్సిపల్ కమిషనర్ కె.దినేష్కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్ విభాగం తరఫున అభివృద్ధి చేయాలని కోరారు. జర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
• Valluru Prasad Kumar
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
• Valluru Prasad Kumar
Publisher Information
Contact
anthimateerpudaily@gmail.com
9704871289
H No. 11-24-4, Vinnakota vaari chowk, Bhavanarayana vaari st.
Vijayawada - 520001. Andhra Pradesh.
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn