*సచివాలయాలను తనిఖీ చేసిన యం.పి.డి.ఓ* వింజమూరు, జూలై 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని పలు సచివాలయాలను శనివారం నాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి ఎస్.కనకదుర్గా భవానీ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఉన్న 1 వ సచివాలయంలో ప్రభుత్వ సం క్షేమ పధకాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరును పరిశీలించారు. సచివాలయాలకు వచ్చే ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం సత్వరమే సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని సచివాలయ ఉద్యోగులకు సూచించారు. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో వాలంటీర్లు వారి వారి ప్రాంతాలలోని ప్రజలను అప్రమత్తం చేసే దిశగా నిత్యం వైరస్ నియంత్రణకు గానూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా యం.పి.డి.ఓ వెంట ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి శ్రీనివాసులురెడ్డి, సచివాలయ ఉద్యోగులు ఖలీల్, ప్రవీణ, సిబ్బంది ఉన్నారు.