*రాజగృహంపై దాడికి ప్రజా సంఘాల నిరసన* వింజమూరు, జూలై 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): డా.బి.ఆర్.అంబేద్కర్ రాజగృహం పై జరిగిన దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్, ప్రజాసంఘాల ఆద్వర్యంలో వింజమూరు మండలంలోని అరుంధతివాడలో శనివారం జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పిసీసి సభ్యులు మద్దూరి రాజగోపాల్ రెడ్డి .పందిటి అంబేద్కర్ మాదిగ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గంగపట్ల వెంగయ్య వారు మాట్లాడుతూ భారతరాజ్యంగ నిర్మాత ఇంటిపై జరిగిన దాడి అమానుషం అని అన్నారు ఈ దేశానికి దశా దిశా నిర్దేశించిన మహానాయకుడు అంబేడ్కర్ అని, ఆయన ఇంటికే రక్షణ లేకుండా పోతే సామాన్య ప్రజలకు రక్షణ ఎలా కల్పిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు . అలాగే డా. అంబేద్కర్ గారి వారసులందరికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎవరైతే దాడి చేశారొ వారిపై రాజద్రోహం కేసు నమోదు వేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రొడ్డా పేతురు, గంగపట్ల మురళి , వర్ల తిరుమలేష్, టౌన్ అధ్యక్షుడు మల్లెల తిరుమలేష్ , గంగపట్ల అజయ్, గంగపట్ల జ్ఞాన కుమార్, శివకుమార్, జి శ్రీను, రాకేష్, పి.వెంగళరావు, పి.కొండలరావు, వెంకటకృష్ణ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image