ఎల్ఐసీలో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌క్రియ నిలిపివేయాలి * ఇన్సూరెన్స్ కార్పోరేష‌న్ ఎంప్లాయీస్ యూనియ‌న్ నిర‌స‌న‌‌ విజ‌య‌వాడ‌(భ‌వానీపురం): భార‌తీయ జీవిత బీమా సంస్థ (‌ఎల్ఐసీ)లో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌క్రియ నిలిపివేయాల‌ని, ప్ర‌భుత్వ వాటాల‌ను విక్ర‌యించేందుకు కేంద్రం చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను విర‌మించుకోవాల‌ని ఇన్సూరెన్స్ కార్పోరేష‌న్ ఎంప్లాయీస్ యూనియ‌న్ మ‌చిలీప‌ట్నం డివిజ‌న్ జాయింట్ సెక్ర‌ట‌రీ డాక్ట‌ర్ సీహెచ్ క‌ళాధ‌ర్ డిమాండ్ చేశారు. ఎల్ఐసీలో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌క్రియ నిలిపివేయాలి డిమాండ్ చేస్తూ భ‌వానీపురంలోని ఎల్ఐసీ కార్యాల‌యాల వ‌ద్ద మంగ‌ళ‌వారం ఇన్సూరెన్స్ కార్పోరేష‌న్ ఎంప్లాయీస్ యూనియ‌న్ (ఐసీఈయు) ఆధ్వ‌ర్యంలో మ‌ధ్యాహ్న భోజ‌న విరామ స‌మ‌యంలో ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించి త‌మ న్యాయ‌మైన డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా క‌ళాధ‌ర్ మాట్లాడుతూ ప్ర‌పంచంలోనే అత్య‌ధిక క్లైమ్‌ల‌ను ప‌రిష్క‌రించే జీవిత బీమా సంస్థ‌గా రికార్డు సృష్టించింద‌న్నారు.1956లో కేవ‌లం రూ.5 కోట్ల ప్ర‌భుత్వ పెట్టుబ‌డితో ప్రారంభ‌మైన సంస్థ నేడు రూ.32ల‌క్ష‌ల కోట్ల ఆస్థులు క‌లిగి, రూ.22ల‌క్ష‌ల కోట్ల మూల‌ధ‌నంతో ముందుకు సాగుతుంద‌న్నారు. అదేవిధంగా ప్ర‌జ‌ల నుంచి సేక‌రించిన సొమ్మును తిరిగి దేశ మౌలిక స‌దుపాయాలు, అభివృద్ధి కోసం పెట్టుబ‌డులుగా పెడుతూ భ‌ద్ర‌త క‌ల్గిస్తుంద‌ని పేర్కొన్నారు. ఈ పెట్టుబ‌డులును అధికంగా రైల్వే, విద్యుత్తు, నీటి ప్రాజెక్టుల‌కు పెట్టుబ‌డులుగా పెడుతుంద‌ని తెలిపారు. దేశ‌వ్యాప్తంగా 49 కోట్ల మంది పాల‌సీదారుల‌తో పాటు 1.06ల‌క్ష‌లు ఉద్యోగుల‌ను క‌ల్గి అత్యంత త‌క్కువ ‌ఖ‌ర్చుతో (3.3శాతం) నిర్వ‌హించ‌బ‌డే అతిపెద్ద సంస్థ‌ను నేడు కేంద్రం ప్రైవేటుప‌రం చేయాల‌ని చూడ‌డం బాధాక‌ర‌మని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణం ఎల్ఐసీలో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌క్రియను కేంద్రం వెంట‌నే నిలిపివేయాల‌ని.. లేనిప‌క్షంలో ప్ర‌త్య‌క్ష ఆందోళ‌న చేప‌డ‌తామ‌ని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేష‌న్ ఏఐఐఈఏ) ఇప్ప‌టికే పిలుపునిచ్చింద‌ని క‌ళాధ‌ర్ తెలిపారు. నిర‌స‌న కార్య‌క్ర‌మంలో ఐసీఈయు కృష్ణా జిల్లా ఉపాధ్య‌క్షుడు ఎన్‌.ఎం.కె.ప్ర‌సాద్‌, అసిస్టెంట్ ట్రెజ‌ర‌ర్ జె.మ‌ధుసూధ‌న‌రావు, బ్రాంచ్ అధ్య‌క్ష‌, కార్య‌దర్శులు జె.హెప్సీబా, ఆర్‌.వి.శ్రీనివాస్‌,గుర్రం శ్రీనివాస్‌, అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image