*"వెంకయ్య స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే కాకాణి."* తేది:24-08-2020 *నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం, గొలగమూడి గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది.* *ఆలయ కార్యనిర్వహణాధికారి బాలసుబ్రహ్మణ్యం ఐ.ఏ.యస్.(రిటైర్డ్) గారు, కమిటీ సభ్యులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు బహుకరించిన మీదట ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.* *ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ... స్వామి వారి ఆరాధనోత్సవాలలో భాగంగా స్థానిక శాసనసభ్యుడు ప్రతి యేటా స్వామివారికి పట్టు వస్త్రాలు బహుకరించడం ఆనవాయితీగా వస్తోందని, తనకు ఇప్పటికి ఏడుసార్లు వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించే భాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, కరోనా నేపథ్యంలో ఆరాధనోత్సవాలు రద్దు చేసినా, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కొనసాగించి, తనకు అవకాశం కల్పించిన ఆలయ కార్యనిర్వహణాధికారి గారికి, ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.* *కరోనా నేపథ్యంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లేందుకు వెంకయ్య స్వామి ఆశీస్సులు సదా ఉండాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం తపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వెంకయ్య స్వామి దీవెనలు ఎల్లప్పుడూ కలగజేయాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలియజేశారు.* *ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యదర్శి కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి గారు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు మందల వెంకట శేషయ్య గారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కట్టంరెడ్డి విజయ మోహన్ రెడ్డి గారు, పలువురు అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.*


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image