*చంద్రపడియలో దారి మళ్ళిన రైతుల రాయితీ ఎరువులు* అక్రమార్కులకు ఆసరాగా అధికారులు...రంగప్రవేశం చేసిన రాజకీయ దళారులు... వింజమూరు, ఆగష్టు 25 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ప్రభుత్వం రైతులకు సరఫరా చేసే రాయితీ ఎరువులను అక్రమార్కులు దిగమింగేందుకు చేసిన యత్నాలను గ్రామస్థులు చిత్రీకరించిన ఘటన మంగళవారం నాడు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడియ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు అందించిన సమాచారం మేరకు పూర్తి వివరాలా ఉన్నాయి. మంగళవారం చంద్రపడియ ప్రధాన రహదారి చెంతనే ఉన్న శ్రీ రజనీ ఫెర్టిలైజర్స్ దుకాణం వెనుక భాగాన ఉన్న గోడౌన్ నందు రైతు భరోసా రధం ద్వారా ఎరువులను దిగుమతి చేస్తున్న నేపధ్యంలో అటుగా వెళుతున్న స్థానికులు అనుమానంతో పసిగట్టి తమ సెల్ ఫోన్లు ద్వారా ఎరువుల దిగుమతులను చిత్రీకరించారు. అనంతరం వారు వ్యవసాయాధికారులకు సమాచారం అందించగా వారు సరిగ్గా స్పందించకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితులలో తహసిల్ధారు సుధాకర్ రావుకు చరవాణి ద్వారా తెలిపారు. అదే సమయంలో తహసిల్ధారు మరియు ఇరిగేషన్ శాఖ అధికారులు చంద్రపడియ ఫ్యాక్టరీలో ఇటీవల జరిగిన సంఘటనపై పరిశీలనలో ఉన్నారు. గ్రామస్థులు అందించిన సమాచారంతో తహసిల్ధారు శ్రీ రజినీ ఫెర్టిలైజర్స్ దుకాణం వద్దకు వస్తున్న సమయంలో అప్పటి వరకూ అక్కడే ఉన్న రైతు భరోసా రధాన్ని అక్కడి నుండి ఆఘమేఘాల మీద తరలించారు. అదే క్రమంలో ఆత్మకూరు నుండి వింజమూరు వైపు వస్తున్న మరో రైతు భరోసా రధం వాహనాన్ని నిలుపుదల చేసి చంద్రపడియ ఫ్యాక్టరీ వద్ద విధి నిర్వహణలో ఉన్న ఒక ఏ.ఆర్ కానిస్టేబుల్ సహాయంతో వింజమూరు పోలీస్ స్టేషన్ కు తరలించాలని, తనకు వీడియో కాన్ ఫరెన్స్ ఉందంటూ స్థానిక వి.ఆర్.ఓ కు తెలిపి అతనిని అక్కడే ఉంచి తహసిల్ధారు యధావిధిగా తన కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఆదే అదునుగా చూసుకున్నరో ఏమో కానీ రైతు భరోసా వాహనాన్ని తరలించినట్లు సమాచారం. అయితే ఈ ఏ.ఓ తాను ముందుగానే అక్కడికి వస్తున్నట్లు సంబంధిత ఎరువుల దుకాణం యజమానికి సమాచారం అందించి మార్గమధ్యంలోనే మెక్కారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఘటనపై జిల్లా స్థాయి వ్యవసాయ, రెవిన్యూ యంత్రాంగం లోతుగా దర్యాప్తు జరిపించిన పక్షంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రానున్నాయని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image