ఏపిపిటిడిఏఈఏ రాష్ట్ర నూతన కమిటీ ఆవిర్భావం * సమస్యల పరిష్కారం కోరుతూ కమిషనర్ కృష్ణబాబుతో భేటీ విజయవాడ, : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పెండింగ్లో ఉన్న పదోన్నతులు, మెర్సీ పిటీషన్, ప్రభుత్వ సర్వీస్ రూల్స్ను త్వరితగతిన అమలుపరచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కమిషనర్ టి.కృష్ణబాబుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అభ్యుదయ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపిపిటిడిఏఈఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కా సాయిబాబు విజ్ఞప్తి చేశారు. ఏపిపిటిడి రాష్ట్ర నూతన కమిటీ సభ్యులతో కలిసి విజయవాడ ఆర్టీసీ హౌస్లో ఆర్టీసీ ఎండీ కృష్ణబాబును సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కమిటీ సభ్యులను కమిషనర్ కృష్ణబాబుకు పరిచయం చేయడంతో పాటు సంస్థ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా జక్కా సాయిబాబు మాట్లాడుతూ ఏపిపిటిడిఏఈఏ రాష్ట్ర నూతన కమిటీలో డైరెక్టర్గా సీనియర్ జర్నలిస్ట్ కూర్మా ప్రసాద్బాబు, చైర్మన్గా బత్తుల వెంకటేశ్వర్లు, అధ్యక్షులుగా చంద్రగిరి ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్గా షేక్ మొహమ్మద్ రఫీ, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నాగ యాదవ్, అడిషనల్ జనరల్ సెక్రటరీగా ఎం.కిరణ్కుమార్, ప్రచార కార్యదర్శిగా పి.సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా అలహరి ఏడుకొండలు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా భూక్య సురేష్నాయక్, డిప్యూటీ చీఫ్ అడ్వైజర్లుగా కె.వి.సుబ్బారావు, చెన్నాప్రగడ ప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్ సాగర్బాబు, కె.ఎస్.కుమార్, వినుకొండ రాజారావు, విజయవాడ రీజియన్ చైర్మన్ కొంకిమళ్ళ శంకర్, చీఫ్ లీగల్ అడ్వైజర్లుగా జి.కేశవరావు, నాగిశెట్టి రవిప్రసాద్ లతో పాటు మరో 20 మందితో నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ ఏ.కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంజనీరింగ్ పి.కృష్ణమోహన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్ కె.బ్రహ్మానందరెడ్డి, ఫైనాన్స్ అడ్వైజర్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్, చీప్ పర్సనల్ మేనేజర్లకు పరిచయం చేశారు.
Popular posts
ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులు:
• Valluru Prasad Kumar
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
• Valluru Prasad Kumar
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
• Valluru Prasad Kumar
జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధికి సహకరించండి.. * కమిషనర్ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు నెల్లూరు: పాత్రికేయులకు నెల్లూరులో ప్రభుత్వం కేటాయించిన జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అడహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్కుమార్ బుధవారం మున్సిపల్ కమిషనర్ కె.దినేష్కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్ విభాగం తరఫున అభివృద్ధి చేయాలని కోరారు. జర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
• Valluru Prasad Kumar
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
• Valluru Prasad Kumar
Publisher Information
Contact
anthimateerpudaily@gmail.com
9704871289
H No. 11-24-4, Vinnakota vaari chowk, Bhavanarayana vaari st.
Vijayawada - 520001. Andhra Pradesh.
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn