ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన

అంతిమతీర్పు- అమరావతి.25.8.2019


ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం దిల్లీలో పర్యటించనున్నారు. 


సోమవారం ఉదయం 8 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం హస్తినకు బయలుదేరనున్నారు. 


దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘ సమావేశంలో ఆయన పాల్గొంటారు. 


అమిత్ షాతో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీకానున్నట్లు సమాచారం. 


సీఎం...దేశ రాజధాని పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నట్లు వైకాపా వర్గాలు చెబుతున్నాయి.