టి.డి.పి నేతల తో చంద్రబాబు భేటీ

గుంటూరు పార్టీ కార్యాలయంలో టిడిపి నేతలతో భేటి అయిన చంద్రబాబు
టిడిపి నేతలపై అక్రమ కేసులు బనాయించడాన్ని ఖండించిన చంద్రబాబు. 


ఈ రోజు టిడిపి ఎమ్మెల్యే కరణం బలరామ్ పై తప్పుడు కేసు పెట్టారు: చంద్రబాబు
నిన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసులు పెట్టారు
మొన్న కూన రవికుమార్ పై అక్రమ కేసులు బనాయించారు. ఆముదాల వలసలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు.
పాత కేసులు తవ్వడం వైసిపి వేధింపులకు పరాకాష్ట. నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేస్తున్నారు.
గతంతో గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ దోపిడిపై పోరాడితే, ఇప్పుడు కేసులు పెడతారా..?
వందలాది మంది కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. నోరునొక్కి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రశ్నించే హక్కు కాలరాయాలని చూస్తున్నారు.
రాష్ట్రాన్ని అగ్నిగుండంలా చేయాలని చూస్తున్నారు. ఇటువంటి నీచ రాజకీయాలు గతంలో చూడలేదు.
ఇళ్లు తగులపెడుతున్నారు, భూములు సాగు చేసుకోనివ్వడం లేదు. బోర్లు ధ్వంసం చేస్తున్నారు. చీనీ చెట్లను నరికేస్తున్నారు. ఇంత అరాచక పాలన నా జీవితంలో చూడలేదు.
వైసిపి నేతలు ఇప్పటికైనా అరాచకాలను మానుకోవాలి. 
డిజిపిని టిడిపి ప్రతినిధి బృందం స్వయంగా కలిసి వినతి ఇచ్చింది
జిల్లాల ఎస్పీలకు ఇప్పటికే అనేకమార్లు వినతులు ఇచ్చాం. అయినా గ్రామాల్లో వైసిపి అరాచకాలు తగ్గలేదు. 
మొత్తం పోలీసు వ్యవస్థనే నిస్సహాయంగా మార్చారు. పోలీసులే నిస్సహాయంగా మారితే ఇక రక్షణ ఎవరు..?


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image