విజ‌య‌వాడ గేట్‌వే హోట‌ల్‌లో త‌మిళ‌నాడు రుచులు సిద్ధం

it
* చెట్టినాడ్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం 
, విజ‌య‌వాడ‌: భోజ‌న‌ప్రియుల కోరిక మేర‌కు నోరూరించే త‌మిళ‌నాడు సంప్ర‌దాయ వంట‌కాల‌ను ప‌రిచ‌యం చేస్తూ డిన్న‌ర్ బ‌ఫే మీల్స్‌ను సోమ‌వారం నుంచి అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు విజ‌య‌వాడ మ‌హాత్మాగాంధీరోడ్డులోని హోట‌ల్ గేట్‌వే ఫుడ్ అండ్ బేవరేజ్ మేనేజర్ ఎస్.వి. రమణమూర్తి,    
సేల్స్ అసిస్టెంట్ కూరాకుల గోపి చెప్పారు. ఈ సంద‌ర్భంగా శుక్రవారం హోట‌ల్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో త‌మిళ‌నాడు వంట రుచుల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా గోపి మాట్లాడుతూ చెట్టినాడ్ ఫుడ్ ఫెస్టివ‌ల్ పేరిట ఏర్పాటు చేసిన డిన్న‌ర్ బ‌ఫే మీల్స్‌ను శుక్రవారం నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వ‌ర‌కు ప్ర‌తిరోజూ రాత్రి 7:30 నుండి 11 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తామ‌న్నారు. ప‌జా దోశ‌, మ‌సాల మిల‌గాయ్ బ‌జ్జీ, ప‌చ్చాయ్ ప‌ట్నీ వ‌డ‌, నెరికా ర‌సం, ముల‌గ ర‌సం, న‌వ‌త‌నియా సారు వంట రుచుల‌తో పాటు చికెన్ చెట్టినాడ్‌, చికెన్ నీల్‌గిరి కుర్మా, చికెన్ ప‌ల్లిపాయ‌లమ్‌, క‌దంబ మసాల వంటి నాన్‌వెజ్ ర‌కాలు, క్యాలీఫ్ల‌వ‌ర్ చెట్టినాడ్‌, సొర‌కాయ్ కుట్టు, ప‌కోడా కార త‌దిత‌ర వెజ్ కూర‌లు, ఐస్‌క్రీమ్‌లు, మిఠాయిలు వంటి చెన్నై సంప్ర‌దాయ రుచులు డిన్న‌ర్‌లో వండివారుస్తామ‌న్నారు. ఆయా ఆహార‌ప‌దార్థాల‌న్నీ హోట‌ల్‌లోని ఎగ్జిక్యూటివ్ చీఫ్ చెఫ్ శ్రీధర్, చెఫ్ జయ్ కుమార్, బ్రహ్మజీ ఆధ్వ‌ర్యంలో రూపొందిస్తామ‌న్నారు. న‌గ‌ర‌వాసులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image