రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ విన్నర్స్ కు కలెక్టర్ అభినందనలు

రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ విన్నర్స్ కు కలెక్టర్ అభినందనలు... కాకినాడ.   రాష్ట్రస్థాయి అక్రిడేషన్ జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్లో విన్నర్స్ గా నిలిచిన తూర్పుగోదావరి జిల్లా జట్టును జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి , జాయింట్ కలెక్టర్ రాజకుమారి అభినందించారు .  గత       నెల 29 , 30, 31 తేదీలలో గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి అక్రిడేషన్ జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ లో 13 జిల్లాల నుండి 15   జట్లు పోటీపడగా చిత్తూరు జిల్లా పై తూర్పు గోదావరి జిల్లా విన్నర్స్ గా నిలిచి  ట్రోపి తో పా టు 50 వేలు  నగదు బహుమతి అందుకున్నారు . సోమవారం స్పందన హాల్లో విన్నర్స్ గా నిలిచిన జిల్లా జట్టు మేనేజర్  వి నవీన్ రాజ్, సభ్యులు కృష్ణంరాజు, రంగరాయ మెడికల్ కాలేజ్ పి డి, కోచ్ స్పర్జన్ రాజు, వంశీ, డిప్యూటీ డైరెక్టర్ ఫ్రాన్సిస్ తో కలిసి ట్రోపి ని కలెక్టర్ మురళీధర్ రెడ్డి కి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో జర్నలిస్టులు మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో లో మరిన్ని పథకాలు సాధించి రాష్ట్రస్థాయిలో జిల్లా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలన్నారు. దీనికి కావలసిన ప్రోత్సాహకాన్ని నా నుండి సంపూర్ణ మద్దతు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో లో ఏ పి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా ప్రచార కార్యదర్శి కర్రి ధర్మరాజు, మంతెన వాసు, తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.