ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం

18–09–2019,
అమరావతి.


*ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం*
*ఆరోగ్యం రంగంపై నిపుణుల కమిటీ సిఫార్సు*
*ఆమేరకు జీతాలు పెంచాలన్న కమిటీ, అంగీకరించిన ముఖ్యమంత్రి*
*ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులకు ఆదేశం*
*ఆరోగ్యరంగంలో సిఫార్సులపై తుది నివేదిక సమర్పించిన కమిటీ*
*100కుపై సిఫార్సులు చేసిన కమిటీ*
*సిఫార్సులపై నిపుణులతో విస్తృతంగా చర్చించిన ముఖ్యమంత్రి*
*సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు* 
*హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపు, నవంబర్‌ 1 నుంచి ప్రారంభం*
*డిసెంబర్‌ 21 నుంచి ఆరోగ్యకార్డుల జారీ ప్రారంభం*
*ఆరోగ్యశ్రీ జాబితాలోకి అదనంగా వ్యాధులు*
*జనవరి 1 నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలు *
*ప.గో.లో  2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ పైలట్‌ ప్రాజక్ట్‌ అమలు*
*మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ పైలట్‌ప్రాజెక్టు కింద అమలు*
*వేయి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు,  ఏప్రిల్‌ 1, 2020 నుంచి జిల్లాల వారీగా అమలు*
*లోటుపాట్లు గుర్తించి పూర్తిస్థాయి అమలుకు కార్యాచరణ ప్రణాళిక*
*ఏప్రిల్‌ 1 నుంచి ఆరోగ్యశ్రీ జిల్లాల వారీగా అమలు ప్రారంభం*
*ఆపరేషన్‌ చేయించుకున్నవారికి కోలుకునేంత వరకూ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేల చొప్పున సహాయం*
*దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న పెన్షన్‌ను  విస్తరించడంపై సమావేశంలో చర్చ*
*తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారికి నెలకు రూ.10వేల పెన్షన్‌ను ఇప్పటికే అమలు చేస్తున్న ప్రభుత్వం*
*ఇతర దీర్ఘకాలిక వ్యాధులను ఒక కేటగిరీ కిందకు తీసుకు వచ్చి వారికీ నెలకు రూ. 5వేలు ఇవ్వాలన్న సీఎం*
*దీనిపై మార్గదర్శకాలు తయారుచేయాలని సీఎం ఆదేశం*


అమరావతి: 
ఆరోగ్య రంగంలో సంస్కరణలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌కు నివేదిక సమర్పించిన నిపుణుల కమిటీ
నివేదికలోని అంశాలపై నిపుణులు కమిటీ, అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన సీఎం
ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధానికి కమిటీ సిఫార్సు, ప్రభుత్వ వైద్యులు జీతాలు పెంచాలన్న కమిటీ
ప్రతిపాదనలు తయారుచేయాలని సీఎం ఆదేశం
కొత్తగా వైద్యుల భర్తీకోసం నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న సీఎం
మన విద్యావ్యవస్థల్లో సమూల మార్పులు రావాలి: సీఎం
ఇంజినీరింగ్‌ అయినా, మెడిసిన్‌ అయినా వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ కచ్చితంగా ఉండాలి: సీఎం
ఏ వృత్తివిద్యా కోర్సు తీసుకున్నా.. చివరి ఏడాది వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌తో ఉండాలి: సీఎం
అప్రెంటిస్‌ అన్నది పాఠ్యప్రణాళికలో ఒక భాగం కావాలి: సీఎం
మన విద్యావ్యవస్థలో ఈ లోపం ఉంది: సీఎం
చదువుకున్నదాన్ని ఏవిధంగా అమల్లో పెట్టాలన్నదానిపై పాఠ్యప్రణాళికలో ఉండాలి: సీఎం
దీనిపై సరైన సూచనలు చేయాలని నిపుణుల కమిటీకి సీఎం సూచన: ప్రభుత్వాసుపత్రుల దశ,దిశ మారుస్తాం :సీఎం
ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరతలేకుండా, సదుపాయాలు కల్పించగలిగితేనే వ్యవస్థ బతుకుతుంది: సీఎం
రోగులు ఆస్పత్రికి రాగానే వారికి నమ్మకం కలిగించేలా ఉండాలి: సీఎం
బెడ్లు, దిండ్లు, బెడ్‌షీట్లు, బాత్‌రూమ్స్, ఫ్లోరింగ్, గోడలు వీటన్నింటినీ కూడామార్చాలి: సీఎం
ఫ్యాన్లు, లైట్లు అన్నీకూడా సరిగ్గా పనిచేయాలి: సీఎం
అవసరమైన చోట ఏసీలు ఏర్పాట  చేయాలి : సీఎం
ఈ మార్పులు చేయగలిగితేనే ప్రభుత్వ ఆస్పత్రులమీద ప్రజల దృక్పథం మారుతుంది: సీఎం


మెడికల్‌కాలేజీల తరహాలో నర్సింగ్‌ కాలేజీలపైన కూడా పర్యవేక్షణ ఉండాలి:
నర్సింగ్‌విద్యను పటిష్టం చేయాలి: సీఎం
ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో తప్పనిసరిగా నర్సింగ్‌కాలేజీలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం: సీఎం
ఆశావర్కర్లకు శిక్షణ ఇవ్వాలి, దీనికోసం పాఠ్యప్రణాళిక సిద్ధం చేయాలి: సీఎం


108, 104 తదితర సేవల్లో వాడుతున్న వాహనాల నిర్వహణకు సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలన్న సీఎం
నాడు – నేడు కింద ఆస్పత్రుల్లో చేపట్టనున్న కార్యక్రమాలపై సీఎం సమీక్ష
సదుపాయాలు కల్పించడమే కాదు, వాటిని నిర్వహించడంపైన కూడా సరైన విధానాలు తీసుకురావాలని ఆదేశం
పెస్ట్‌ కంట్రోల్, శానిటేషన్, స్టోరేజీ సిస్టంలపై ఉత్తమ విధానాలు అనుసరించాలని సీఎం ఆదేశం
నిర్వహణకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయాలన్న సీఎం


గత ప్రభుత్వంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో లోపాలను బయటపెట్టిన కమిటీ, వీటిపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం
డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలున్న మందులనే కొనుగోలు చేయాలన్న సీఎం


హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపు, నవంబర్‌ 1 నుంచి ప్రారంభం
డిసెంబర్‌ 21 నుంచి ఆరోగ్యకార్డుల జారీ ప్రారంభం
ఆరోగ్యశ్రీ జాబితాలోకి అదనంగా వ్యాధులు
జనవరి 1 నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలు 
ప.గో.లో 2వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ పైలట్‌ ప్రాజక్ట్‌ అమలు
మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ పైలట్‌ప్రాజెక్టు కింద అమలు
వేయి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు ఏప్రిల్‌ 1, 2020 నుంచి జిల్లాల వారీగా అమలు
లోటుపాట్లు గుర్తించి పూర్తిస్థాయి అమలుకు కార్యాచరణ ప్రణాళిక
ఏప్రిల్‌ 1 నుంచి ఆరోగ్యశ్రీ జిల్లాల వారీగా అమలు ప్రారంభం
ఆరోగ్యశ్రీకి బిల్లులు చెల్లించుండా గత ప్రభుత్వం తాత్సారం చేసిందని సమావేశంలో ప్రస్తావన
మొత్తంగా దాదాపు వేయికోట్లు పెడింగ్‌లో పెట్టారంటూ లెక్కలు చెప్పిన అధికారులు
నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ప్రమాణాలపై తనిఖీల అంశాన్ని సమీక్షించిన ముఖ్యమంత్రి


ఆపరేషన్‌ చేయించుకున్నవారికి కోలుకునేంత వరకూ విశ్రాంతి సమయంలో రూ.5వేల చొప్పున అలవెన్స్‌
దీర్ఘకాలిక వ్యాదులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న పెన్షన్‌ను  విస్తరించడంపై సమావేశంలో చర్చ
ఇతర దీర్ఘకాలిక వ్యాధులను ఒక కేటగిరీ కిందకు తీసుకు వచ్చి వారికీ నెలకు రూ. 5వేలు పెన్షన్‌ ఇవ్వాలన్న సీఎం
దీనిపై మార్గదర్శకాలు తయారుచేయాలని సీఎం ఆదేశం


*నివేదికలోని అంశాలను గౌరవ ముఖ్యమంత్రికి వివరించిన డాక్టర్‌ సుజాతారావు*
దాదాపు 100కుపైగా సిఫార్సులు చేశాం: డాక్టర్‌ సుజాతారావు
ఆరోగ్య రంగంలో ప్రభుత్వం దృక్పథం మారాలి: 
దీర్ఘకాలిక వ్యాధులపై దృషిపెట్టాలి:
ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజలు పెద్దగా రావడంలేదు:
జాతీయస్థాయితో పోలిస్తే చాలా తక్కవ మంది ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారు:
ఆరోగ్యరంగంలో బడ్జెట్‌ చాలావరకు జీతాలకే సరిపోతుంది:
పెద్దసంఖ్యలో ఉన్న సిబ్బంది సేవలను సమర్థవంతగా వాడుకోవాలి:
ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, పరికరాలను కల్పించాలి:
మందుల కొనుగోలు, వ్యాధినిర్దారణ పరీక్షలు ప్రజలకు భారంగా మారాయి:
ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో స్పష్టత, బాధ్యత రెండూ లేవు:
సరైన సమీక్ష, పర్యవేక్షణఉండడంలేదు:
రోజువారీ పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి:


ఒకరు చేసే పనిని ఇంకొకరు చేస్తున్నారు, డూప్లికేషన్‌ అధికంగా ఉంది:
ఆస్పత్రుల్లో పరికరాలన్నీ పాతబడ్డాయి :
ఇది నాది అన్న భావన ఉండడంలేదు :
పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి:


వ్యాధి నిరోధకతపై దృష్టిపెట్టాలి:
30శాతం మంది హృద్రోగ, క్యాన్సర్‌లాంటి వ్యాధుల అంశాలతో బాధపడుతున్నారు:
మూడు దశల్లో ప్రాథమిక వైద్యం అందించాలి:
ప్రతి 5వేలమందికి ఒక సబ్‌ సెంటర్‌ఉండాలి:
ప్రతి 30 వేల మంది జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి:
ప్రతివేయి మందికి జనాభాకు విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేయాలి:
చిన్న చిన్న వాటికి అక్కడికక్కడే చికిత్స అందించాలి:
రాష్ట్రంలో 18 ఏళ్లలోపు ఉన్న వారు సుమారు కోటిమంది ఉన్నారు:
వారి ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టిపెట్టాలి:
యూత్‌ క్లబ్బుల తరహాలో క్లబ్బులను ఏర్పాటుచేసి ఆరోగ్యంపైన అవగాహన కల్పించాలి:
సబ్‌సెంటర్లలో సరైన సౌకర్యాలు లేవు, వాటిని కల్పించాల్సి ఉంది:
ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కనీస సిబ్బందిని 9 నుంచి 13కు పెంచాలి:
ప్రతి పీహెచ్‌సీలో ముగ్గురు వైద్యులు ఉండాలి:
ఒక కౌన్సెలర్‌ లేదా సోషల్‌ వర్కర్‌ ఉండాలి:
దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి వైద్యం కొనసాగించేలా చూడాల్సిన బాధ్యతను వీరికి అప్పగించాలి:
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 24 గంటలు నడిచేలా చూసుకోవాలి:
2 బెడ్‌ ఐసీయూ సదుపాయం ఉండాలి:
ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం విధించాలి:
వారి బేసిక్‌ శాలరీని పెంచాలి:
ప్రభుత్వ డాక్టరుచేత ప్రైవేటు హాస్పటిల్‌లో ఆరోగ్య శ్రీ కేసు చేయిస్తే సీరియస్‌గా తీసుకుని, ఆ ఆస్పత్రిని జాబితా నుంచి తప్పించాలి:
ప్రతి లక్ష జనాభాకు కమ్యూనిటీ హాస్పటిల్‌:
కచ్చితంగా ఫ్యామిలీ మెడిసిన్‌లో ఎండీ చేసిన వారి పర్యవేక్షణలో ఆస్పత్రి
సామాజిక ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు చేయడానికి సదుపాయాలు:
ఆప్తమాలజీ, ఈఎన్‌టీ కేర్‌ స్పెషలిస్టులు ఉండాలి:
అన్ని మెడికల్‌ కాలేజీల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉండాలి:
టీచింగ్, నాన్‌ టీచింగ్‌ కేటగిరీలను వేర్వేరుగా చేయాలి:
హెచ్‌ఆర్‌ బాధ్యతలనుంచి వైద్యులను తప్పించాలి:
ఏడాదికి రెండు వారాలు హెచ్‌ఆర్‌లో శిక్షణ ఇవ్వాలి
ఖాళీలను భర్తీ చేయాలి:
నర్సింగ్‌ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలి
మరిన్ని కాలేజీలను ఏర్పాటు చేయాలి:
రాష్ట్రంలో నర్సింగ్‌ విద్య పటిష్టంగా లేదు:
నర్స్‌ ప్రాక్టీషినర్స్‌కు ప్రత్యేక కేడర్‌ ఏర్పాటు చేయాలి:
నర్సింగ్‌కు దేశవ్యాప్తంగా, విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది:
ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలను, వసతులను పెంచాలి:
జిల్లా ఆస్పత్రుల స్థాయిని 500 బెడ్లకు పెంచాలి:
బోధనాసుపత్రుల్లో 2వేల బెడ్లవరకూ పెంచాలి:
30 మహిళా ఆరోగ్య కేంద్రాలను 500 బెడ్లతో ఏర్పాటు చేయాలి:
ప్రసవాలకోసం, మహిళల ఆరోగ్యం కోసం ఈ కేంద్రాలను వినియోగించవచ్చు:
డ్రగ్‌ రెగ్యులేటరీ కమిటీ ఉండాలి, దాన్ని బలోపేతం చేయాలి:
కనీసం 150 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉండాలి:
ప్రతి మందుల దుకాణంలో అమ్ముతున్న మందుల కంప్యూటరీ కరణ ఉండాలి:
ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అందుకున్న రోగికి ఏ సేవలు అందాయన్నదానిపై ఒక రశీదు ఇవ్వాలి:
ఎంత విలువైన వైద్యం ఉచితంగా అందిందన్న దానిపై ఆ రశీదులో పేర్కొనాలి: 
వైద్యం మీద ప్రజల ప్రస్తుతం 62శాతం ఖర్చు చేస్తున్నారు దాన్ని 2025 నాటికి 30 శాతానికి తగ్గించాలి:


సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సహా ఉపముఖ్యమంత్రి 
ఆళ్ల నాని, డాక్టర్‌ సుజాతారావు సహా నిపుణుల కమిటీలో సభ్యులు, సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.


Popular posts
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు :శ్రీమతి పద్మశ్రీ సుంకర, ఏ పిసిసి సమన్వయ కమిటీ సభ్యులు
Image
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image
ఏప్రిల్ 14 వరకు ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు