సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే:బల్దియా మేయర్ గుండా ప్రకాశరావు

సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే:బల్దియా మేయర్ గుండా ప్రకాశరావు
◆ఇగ్నైట్ ఫెస్ట్-2019 కార్యక్రమంలో పాల్గొన్న మేయర్..
GWMC,12 సెప్టెంబర్ 2019:
   సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే అని బల్దియా మేయర్ గుండా ప్రకాశరావు అన్నారు.తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల(బాయ్స్),యాకుబ్ పుర,వరంగల్ వారి అద్వర్యం  లో (రీజనల్ స్థాయిలో) నిర్వహిస్తున్న IGNITE FEST-2019 కార్యక్రమానికి మేయర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ,కష్టించే తత్వాన్ని అలవరచుకోవాలని తద్వారా ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవచ్చునన్నారు.కడు పేదరికం నుండి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి పదవి సాధించిచేలా  ఎదిగిన కాకి మాధవరావు ఉదంతాన్ని మేయర్ గుర్తుచేశారు.స్వామి వివేకానందుడు చెప్పినట్లు సర్వ శక్తులు మన లొనే ఇమిడి ఉంటాయని వాటిని బయటకు తీసి సద్వినియోగం చేసుకోవాలని మేయర్ అన్నారు.అబ్దుల్ కలాం స్ఫూర్తిగా కలలు కనాలని వాటిని సాధించాలన్నారు.
  ఈ కార్యక్రమంలో రీజినల్ కో-ఆర్డినెటర్ డి.యస్.వెంకన్న,కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస రెడ్డి,వైస్-ప్రిన్సిపాల్ మధు,డిప్యూటీ సెక్రెటరీశ్రీనివాస రెడ్డి, టి. డబుల్యూ. ఆర్.యస్.ఫ్రీడమ్ స్కూల్ ప్రిన్సిపాల్ విమల,ఇగ్నైట్ ఫెస్ట్ కో-ఆర్డినటర్ శ్రీనివాస రాయ్,సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సంగీత్ సాగర్,సి.ఓ.ఈ. వైస్-ప్రిన్సిపాల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image