ఆరో తేదీకి సన్నబియ్యం పంపిణీ వాయిదా

 *జిల్లాకు అవసరమైన బియ్యం 13,243 మెట్రిక్‌ టన్నులు
*ఇప్పటివరకు వచ్చింది 6,200 టన్నులే                                                                                                                                 శ్రీకాకుళం జిల్లాలో తెల్ల రేషన్‌కార్డుదారులకు నేటి నుంచి చేపట్టనున్న నాణ్యమైన బియ్యం పంపిణీ వాయిదా పడింది. జిల్లాకు రావాల్సినంత బియ్యం రాకపోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. జిల్లాలో సెప్టెంబర్‌ నెలకు 8,14,264 కార్డులకు సంబంధించి 22,76,523 మందికి బియ్యం అందించాల్సి ఉంది. వీరందరికీ బియ్యం అందించాలంటే 13,243 మెట్రిక్‌ టన్నులు అవసరమని అధికారులు గుర్తించారు. శనివారం నాటికి 6,200 మెట్రిక్‌ టన్నుల బియ్యం మాత్రమే వచ్చాయి. నాణ్యమైన బియ్యం అందించేందుకు తూర్పుగోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం రప్పిస్తున్నారు. మిల్లర్లతో చర్చల్లో జాప్యం, పెద్దఎత్తున ధాన్యం మర ఆడించాల్సి రావడంతో కొంత ఆలస్యమైంది. బియ్యాన్ని నాలుగు రకాల సంచుల్లో నింపి జిల్లాకు పంపుతున్నారు. 5, 10, 15, 20 కేజీలకు విడివిడిగా ప్యాకెట్ల రూపంలో జిల్లాకు పంపిస్తున్నారు. ఐదు కేజీల ప్యాకెట్లు 1,15,491 అవసరమని అధికారులు గుర్తించారు. ఇప్పటివరకూ 47,852 ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి. పది కేజీల ప్యాకెట్లు 2,38,697 అవసరం కాగా, ప్రస్తుతం జిల్లాకు 89,215 చేరాయి. 15 కేజీల ప్యాకెట్లు 2,70,555 పంపిణీ చేయాల్సి ఉండగా 1,16,004 ప్యాకెట్లు వచ్చాయి. అదేవిధంగా 20 కేజీల ప్యాకెట్లు 3,04,385 అందించాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,66,912 ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి. తూర్పుగోదావరి బియ్యం ఆలస్యంగా వస్తుండడంతో పాటు జిల్లాలోని బియ్యం నిల్వ కేంద్రాల (ఎంఎల్‌ఎస్‌)కు, అక్కడ నుంచి రేషన్‌ దుకాణాలకు వెళ్లడంలోనూ కొంత జాప్యమవుతోంది. జిల్లాలో 2015 రేషన్‌ దుకాణాలుండగా, ఇప్పటివరకు 530 దుకాణాలకు మాత్రమే బియ్యం చేరాయి.                                                                                                                                  పంపిణీపై చివరి వరకూ ఉత్కంఠ : నాణ్యమైన బియ్యం పంపిణీలో చివరి వరకూ ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో వీటి బాధ్యతను చూస్తున్న తహశీల్దార్లకు శుక్రవారం రాత్రి వరకూ సమాచారం ఇవ్వలేదు. దీంతో గ్రామాల్లో బియ్యం పంపిణీకి మండలానికి 150 నుంచి 200 వరకూ ఆటోలు, ఇతర లగేజీ వాహనాల యజమానులతో మాట్లాడి సిద్ధం చేశారు. శనివారం ఉదయం పంపిణీ వాయిదా పడిందని తెలియడంతో, యజమానులకు వాహనాలు వద్దని చెప్పాల్సి వచ్చింది.
6న పంపిణీ : నాణ్యమైన బియ్యం పంపిణీ ఈనెల ఆరో తేదీన జిల్లాలో ప్రారంభం కానుంది. ఆ రోజు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం  శంకుస్థాపనకు రానున్నారు. అప్పటికి పూర్తిస్థాయిలో నాణ్యమైన బియ్యం వచ్చే అవకాశం ఉండడంతో, అదే రోజు పంపిణీ చేయొచ్చన్న ప్రచారం సాగుతోంది.
బియ్యం రప్పించేందుకు చర్యలు : నాణ్యమైన బియ్యం పంపిణీ ఈనెల ఆరో తేదీన ప్రారంభం కానుంది. జిల్లా అవసరాల మేరకు బియ్యం రప్పించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో బియ్యం వచ్చేస్తాయి. జిల్లాకు వచ్చిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు రేషన్‌ డిపోలకు పంపిస్తున్నాం.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image