ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి


మహాబూబాబాద్ , 11 సెప్టెంబర్  2019


ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని అందుకోసం వైద్యులు, ప్రజలు వైద్య సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ పై మహబూబాబాద్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టర్ శివ లింగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, జెడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, ఎంపీ మలోతు కవిత, ఎమ్మేల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణకు వైద్య ఆరోగ్య శాఖ అంకితభావంతో పని చేయాలన్నారు.
 జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో కు మురికి కూపాలను శుభ్రం చేయాలని తెలిపారు. ఇప్పటి పరిస్థితుల్లో రెండు చాలెంజ్ లు ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో ప్రబలిన
విష జ్వరాల ను నివారించుటకు చర్యలు తీసుకోవడంతో పాటు, విష జ్వరాలతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. అందుకుగాను, పంచాయతీ రాజ్, మున్సిపల్,, వైద్య ఆరోగ్య, విద్యాశాఖ సమన్వయంతో జిల్లాలో విష జ్వరాలు ప్రబలకుండా ప్రజల్లో అవగాహన కల్పించుటకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను సూచించారు. వైరల్ జ్వరాలు డెంగ్యూ, మలేరియా కాదని ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి అవగాహన కల్పించాలన్నారు.  సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించుటకు విస్తృత ప్రచారం చేయాలని, అందుకుగాను గోడ ప్రతులు పోస్టర్ లతోపాటు, వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించి విష జ్వరాలు ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తృత హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ముందస్తుగా రోగాన్ని పసికట్టి త్వరగా చికిత్స ఇవ్వడంతోపాటు గ్రామాల నుండి ప్రజలకు జిల్లా ఆస్పత్రికి రాకుండా చేయవచ్చన్నారు. ఆస్పత్రికి ప్రజలు విశ్వాసంతో వస్తారని, వారి విశ్వాసాన్ని వమ్ము  కలిగించకుండా అంకితభావంతో వైద్యులు వైద్యసేవలు అందించాలన్నారు. సీజనల్ వ్యాధుల వల్ల జిల్లా ఆస్పత్రిలో అధిక రోగులు వస్తున్నందున, అవసరం అయితే తాత్కాలికంగా కొన్ని బెడ్స్ ఏర్పాటు చేసి చికిత్స అందించాలన్నారు.
ప్రస్తుత వాతావరణ మార్పులతో వ్యాధులు ఎక్కువగా ప్రభలుతున్నాయి. వీటి నివారణకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.


జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని, మెరుగు పరచాలని ఆసుపత్రి సూపర్డెంట్ ను మంత్రి ఆదేశించారు. ఆసుపత్రికి పేషెంట్స్ వస్తే ఇంటి వాతావరణం మరిపించేలా ఉండాలన్నారు. ఆసుపత్రులను వైష్ణవాలయం గా తీర్చిదిద్దాలన్నారు. ప్రభుత్వ వైద్యులు చిత్తశుద్ధితో రోగులకు వైద్య చికిత్స అందించాలన్నారు. ఆసుపత్రులు రోగాలు నయం చేసే కేంద్రంగా ఉండాలన్నారు.
ప్రభుత్వాసుపత్రిలో గర్భిణులకు సాధారణ ప్రసవం జరిగేలా డాక్టర్లు కృషి చేయాలన్నారు. సిజేరియన్ వల్ల జరిగే ఆరోగ్య సమస్యల  గురించి గర్భిణులకు వివరించి వారిలో చైతన్యం కల్పించాలన్నారు.
 అన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 53 ఆస్పత్రుల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామన్నారు.
గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా పాఠశాలల్లో, ఆసుపత్రుల్లో, వసతిగృహాల్లో నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రత పాటించాలన్నారు.



రాష్ట్ర, పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యంగా ఉంటామని, పారిశుధ్యం తో ముఖ్యంగా వైరల్ జ్వరాలు రాకుండా ఉంటాయన్నారు. ఆసుపత్రికి వస్తున్న ప్రతి ఒక్కరికి సేవాభావంతో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.


మహబూబాబాద్ మున్సిపాలిటీ లో పరిశుభ్రత బాగాలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ పరిశుభ్రత మెరుగుపడాలని అన్నారు. వారం రోజుల్లోగా ఇక్కడ నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రంగా చేయాలని అన్నారు.అన్ని గ్రామాల పారిశుధ్యం, పచ్చదనం, పరిశుభ్రత... సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమానికి రూప కల్పన చేశారని చెప్పారు.
అన్ని గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా నిర్వహించుకోవాలి మంత్రి అన్నారు.
జిల్లాలోని అన్ని పీహెచ్సీలలో డాక్టర్లు ఉన్నారని, మందులు కూడా అందుబాటులో ఉన్నాయని, గిరిజన ప్రాంతంలో జ్వరం ప్రబలకుండా అరికట్టడం తో పాటు, రోగులను అందర్నీ చికిత్స అందించి కాపాడుకోవాలన్నారు
మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి లాగా హైజినిక్ గా ఉంచాలని ఆదేశించారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ అంకితభావంతో సేవలు అందించాలన్నారు.
ఎంజీఎం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశాం. అక్కడ వైద్యుల హాజరుకు బయోమెట్రక్ విధానం ప్రవేశ పెట్టాలని ఆదేశించామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ శివ లింగయ్య మాట్లాడుతూ జిల్లాలోని 19 పీహెచ్సీలలో డాక్టర్లు ఉన్నారని తెలిపారు. ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని మండల ప్రత్యేక అధికారి గా నియమించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పకడ్బందీగా అమలు జరిగేలా తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత పాటించడం జరుగుతున్నదని, జిల్లాలోని పది పీహెచ్సీలకు కాయకల్ప అవార్డులు వచ్చాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు ఏపీ డే మిక్స్ ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత సంవత్సరం 127 డెంగ్యూ కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 4 కేసులు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఏజెన్సీ లోని ఇరవై ఆరు వందల గృహాలకు కాలు రాకుండా స్ప్రే చేయించడం జరిగిందన్నారు. వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి, మంచినీటి samples సేకరించి చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 81 శాతం సాధారణ ప్రసవాలు జరిగాయని కలెక్టర్ వివరించారు. ప్రతి పీహెచ్సీలో ఏఎన్ఎం ల ద్వారా మహిళ గర్భం దాల్చిన అప్పటినుండి ప్రసవం అయ్యే వరకు మొత్తం వివరాలు సేకరించి పర్యవేక్షిస్తున్న ట్లు కలెక్టర్ తెలిపారు.


డోర్నకల్ శాసనసభ్యులు రెడ్డి నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ ప్రాంతంలో 50 శాతం గిరిజనులు, పేదరికం అందువల్ల మలేరియా, డెంగ్యూ వంటి రోగాలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉందన్నారు. సరేనా పరిశుభ్రత, సానిటేషన్ లేనందువల్ల జ్వరాలు ప్రబలుతున్నాయి అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా జిల్లాను స్పెషల్ కేస్ గా గుర్తించి అధికంగా నిధులు కేటాయించి నట్లయితే ఆసుపత్రి అభివృద్ధి చేసుకోవడం తో పాటు మెరుగైన వైద్యం అందించవచ్చు అన్నారు.
మహబూబాబాద్ శాసనసభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిని వంద పడకల నుండి 300 పడకల కు మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా జిల్లాకు మెడికల్ కాలేజీ  ఏర్పాటు చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది, పరికరాలతో కొరత ఉందని, వెంటనే కొలతలు తీర్చుటకు తీసుకోవాలన్నారు. గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేయకుండా సిజేరియన్ చేస్తున్నారని, అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం rotavirus వ్యాక్సిన్ను పలువురు చిన్నారులకు మంత్రులు ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు లు వేసి ప్రారంభించారు.


ఈ:సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస రావు, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీ రామ్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భీమ్ సాగర్, ప్రభుత్వ వైద్యులు, అన్ని శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


––––––––


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image