ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి


మహాబూబాబాద్ , 11 సెప్టెంబర్  2019


ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని అందుకోసం వైద్యులు, ప్రజలు వైద్య సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ పై మహబూబాబాద్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టర్ శివ లింగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, జెడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, ఎంపీ మలోతు కవిత, ఎమ్మేల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణకు వైద్య ఆరోగ్య శాఖ అంకితభావంతో పని చేయాలన్నారు.
 జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో కు మురికి కూపాలను శుభ్రం చేయాలని తెలిపారు. ఇప్పటి పరిస్థితుల్లో రెండు చాలెంజ్ లు ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో ప్రబలిన
విష జ్వరాల ను నివారించుటకు చర్యలు తీసుకోవడంతో పాటు, విష జ్వరాలతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. అందుకుగాను, పంచాయతీ రాజ్, మున్సిపల్,, వైద్య ఆరోగ్య, విద్యాశాఖ సమన్వయంతో జిల్లాలో విష జ్వరాలు ప్రబలకుండా ప్రజల్లో అవగాహన కల్పించుటకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను సూచించారు. వైరల్ జ్వరాలు డెంగ్యూ, మలేరియా కాదని ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి అవగాహన కల్పించాలన్నారు.  సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించుటకు విస్తృత ప్రచారం చేయాలని, అందుకుగాను గోడ ప్రతులు పోస్టర్ లతోపాటు, వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించి విష జ్వరాలు ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తృత హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ముందస్తుగా రోగాన్ని పసికట్టి త్వరగా చికిత్స ఇవ్వడంతోపాటు గ్రామాల నుండి ప్రజలకు జిల్లా ఆస్పత్రికి రాకుండా చేయవచ్చన్నారు. ఆస్పత్రికి ప్రజలు విశ్వాసంతో వస్తారని, వారి విశ్వాసాన్ని వమ్ము  కలిగించకుండా అంకితభావంతో వైద్యులు వైద్యసేవలు అందించాలన్నారు. సీజనల్ వ్యాధుల వల్ల జిల్లా ఆస్పత్రిలో అధిక రోగులు వస్తున్నందున, అవసరం అయితే తాత్కాలికంగా కొన్ని బెడ్స్ ఏర్పాటు చేసి చికిత్స అందించాలన్నారు.
ప్రస్తుత వాతావరణ మార్పులతో వ్యాధులు ఎక్కువగా ప్రభలుతున్నాయి. వీటి నివారణకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.


జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని, మెరుగు పరచాలని ఆసుపత్రి సూపర్డెంట్ ను మంత్రి ఆదేశించారు. ఆసుపత్రికి పేషెంట్స్ వస్తే ఇంటి వాతావరణం మరిపించేలా ఉండాలన్నారు. ఆసుపత్రులను వైష్ణవాలయం గా తీర్చిదిద్దాలన్నారు. ప్రభుత్వ వైద్యులు చిత్తశుద్ధితో రోగులకు వైద్య చికిత్స అందించాలన్నారు. ఆసుపత్రులు రోగాలు నయం చేసే కేంద్రంగా ఉండాలన్నారు.
ప్రభుత్వాసుపత్రిలో గర్భిణులకు సాధారణ ప్రసవం జరిగేలా డాక్టర్లు కృషి చేయాలన్నారు. సిజేరియన్ వల్ల జరిగే ఆరోగ్య సమస్యల  గురించి గర్భిణులకు వివరించి వారిలో చైతన్యం కల్పించాలన్నారు.
 అన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 53 ఆస్పత్రుల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామన్నారు.
గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా పాఠశాలల్లో, ఆసుపత్రుల్లో, వసతిగృహాల్లో నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రత పాటించాలన్నారు.



రాష్ట్ర, పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యంగా ఉంటామని, పారిశుధ్యం తో ముఖ్యంగా వైరల్ జ్వరాలు రాకుండా ఉంటాయన్నారు. ఆసుపత్రికి వస్తున్న ప్రతి ఒక్కరికి సేవాభావంతో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.


మహబూబాబాద్ మున్సిపాలిటీ లో పరిశుభ్రత బాగాలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ పరిశుభ్రత మెరుగుపడాలని అన్నారు. వారం రోజుల్లోగా ఇక్కడ నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రంగా చేయాలని అన్నారు.అన్ని గ్రామాల పారిశుధ్యం, పచ్చదనం, పరిశుభ్రత... సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమానికి రూప కల్పన చేశారని చెప్పారు.
అన్ని గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా నిర్వహించుకోవాలి మంత్రి అన్నారు.
జిల్లాలోని అన్ని పీహెచ్సీలలో డాక్టర్లు ఉన్నారని, మందులు కూడా అందుబాటులో ఉన్నాయని, గిరిజన ప్రాంతంలో జ్వరం ప్రబలకుండా అరికట్టడం తో పాటు, రోగులను అందర్నీ చికిత్స అందించి కాపాడుకోవాలన్నారు
మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి లాగా హైజినిక్ గా ఉంచాలని ఆదేశించారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ అంకితభావంతో సేవలు అందించాలన్నారు.
ఎంజీఎం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశాం. అక్కడ వైద్యుల హాజరుకు బయోమెట్రక్ విధానం ప్రవేశ పెట్టాలని ఆదేశించామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ శివ లింగయ్య మాట్లాడుతూ జిల్లాలోని 19 పీహెచ్సీలలో డాక్టర్లు ఉన్నారని తెలిపారు. ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని మండల ప్రత్యేక అధికారి గా నియమించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పకడ్బందీగా అమలు జరిగేలా తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత పాటించడం జరుగుతున్నదని, జిల్లాలోని పది పీహెచ్సీలకు కాయకల్ప అవార్డులు వచ్చాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు ఏపీ డే మిక్స్ ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత సంవత్సరం 127 డెంగ్యూ కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 4 కేసులు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఏజెన్సీ లోని ఇరవై ఆరు వందల గృహాలకు కాలు రాకుండా స్ప్రే చేయించడం జరిగిందన్నారు. వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి, మంచినీటి samples సేకరించి చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 81 శాతం సాధారణ ప్రసవాలు జరిగాయని కలెక్టర్ వివరించారు. ప్రతి పీహెచ్సీలో ఏఎన్ఎం ల ద్వారా మహిళ గర్భం దాల్చిన అప్పటినుండి ప్రసవం అయ్యే వరకు మొత్తం వివరాలు సేకరించి పర్యవేక్షిస్తున్న ట్లు కలెక్టర్ తెలిపారు.


డోర్నకల్ శాసనసభ్యులు రెడ్డి నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ ప్రాంతంలో 50 శాతం గిరిజనులు, పేదరికం అందువల్ల మలేరియా, డెంగ్యూ వంటి రోగాలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉందన్నారు. సరేనా పరిశుభ్రత, సానిటేషన్ లేనందువల్ల జ్వరాలు ప్రబలుతున్నాయి అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా జిల్లాను స్పెషల్ కేస్ గా గుర్తించి అధికంగా నిధులు కేటాయించి నట్లయితే ఆసుపత్రి అభివృద్ధి చేసుకోవడం తో పాటు మెరుగైన వైద్యం అందించవచ్చు అన్నారు.
మహబూబాబాద్ శాసనసభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిని వంద పడకల నుండి 300 పడకల కు మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా జిల్లాకు మెడికల్ కాలేజీ  ఏర్పాటు చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది, పరికరాలతో కొరత ఉందని, వెంటనే కొలతలు తీర్చుటకు తీసుకోవాలన్నారు. గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేయకుండా సిజేరియన్ చేస్తున్నారని, అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం rotavirus వ్యాక్సిన్ను పలువురు చిన్నారులకు మంత్రులు ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు లు వేసి ప్రారంభించారు.


ఈ:సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస రావు, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీ రామ్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భీమ్ సాగర్, ప్రభుత్వ వైద్యులు, అన్ని శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


––––––––


Popular posts
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు :శ్రీమతి పద్మశ్రీ సుంకర, ఏ పిసిసి సమన్వయ కమిటీ సభ్యులు
Image
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image
ఏప్రిల్ 14 వరకు ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు