శ్రీ సిటీలో బాల్ కార్పొరేషన్ పరిశ్రమచే విద్యార్థులకు ఎక్స్ పోజర్ విజిట్

అంతిమ తీర్పు. నెల్లూరు జిల్లా. శ్రీసిటీ 14. 9. 2019


శ్రీసిటీ బాల్ కార్పొరేషన్ పరిశ్రమచే విద్యార్థులకు ఎక్స్‌పోజర్ విజిట్


- పరిశ్రమ సందర్శించిన ఇరుగుళం జెడ్‌పి హైస్కూల్‌ టెన్త్ విద్యార్థులు 



శ్రీసిటీ ఫౌండేషన్ చొరవతో శ్రీసిటీలోని బాల్ కార్పొరేషన్ పరిశ్రమ యాజమాన్యం శుక్రవారం మధ్యాహ్నం ఇరుగుళంలోని జెడ్‌పి హైస్కూల్‌కు చెందిన పదవ తరగతి విద్యార్థులకు ఎక్స్‌పోజర్ విజిట్ నిర్వహించింది. 


ఇందులో భాగంగా విద్యార్థులను పరిశ్రమలోని తయారీ ప్లాంట్ కు తీసుకెళ్లి, అక్కడ ఉత్పత్తి చేసే అల్యూమినియం శీతల పానీయాల డబ్బాల తయారీ గురించి వివరించారు. డబ్బాల తయారీ అనంతరం వాటిని ఫోర్క్ లిఫ్ట్ వాహనాల ద్వారా తరలించడం, పాలెట్లలో నింపడం, ఆపై కస్టమర్ సంస్థలకు డెలివరీ చేయడం వంటి వివిధ స్థాయిల గురించి వారికి అవగాహన కల్పించారు. హైస్కూల్ సైన్స్ టీచర్లతో కలిసి విద్యార్థులు ఈ సందర్శన సాగించారు. 


కంపెనీ హెచ్ఆర్ హెడ్ రత్నావెల్ రాజన్ ఈ తయారీ ప్రక్రియ గురించి వివరించారు. డబ్బాల తయారీకి అల్యూమినియం ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియ చేశారు.  ప్లాస్టిక్ వంటి ఇతర పదార్థాలతో పోలిస్తే అల్యూమినియం పర్యావరణానికి ఎంతో మంచిదన్న అంశాన్ని హైలైట్ చేశారు. కంపెనీకి చెందిన మరో అధికారి 'కెరీర్ మార్గాన్ని ఎలా ఎంచుకోవాలి' అనే అంశంపై విద్యార్థులకు ఈ సందర్భంగా ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం పరిశ్రమ ఆవరణలో క్విజ్ కార్యక్రమం నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. పరిశ్రమను నేరుగా సందర్శించడం, పలు అంశాలు తెలుసుకోవడం తమకెంతో ఆనందంగా వుందంటూ విద్యార్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 


కాగా,  బాల్ కార్పొరేషన్ పరిశ్రమ యాజమాన్యం గత సంవత్సరం కూడా ఇదే తరహాలో మండలంలోని మాదనపాలెం జెడ్‌పి హైస్కూల్‌ 10 వ తరగతి విద్యార్థుల కోసం ఇలాంటి సందర్శన కార్యక్రమం నిర్వహించింది.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image