ఏపీ సచివాలయం వద్ద ఉద్రిక్తత

ఏపీ సచివాలయం వద్ద ఉద్రిక్తత
అమరావతి: సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ ఈడీ సాంబశివరావును సబ్‌ కాంట్రాక్టర్లు, సామాగ్రి పంపిణీదారులు, ఉద్యోగులు అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు గతంలో ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ కాంట్రాక్టర్‌గా ఉంది. రూ.23 కోట్ల బకాయిలు చెల్లించకుండా ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ ఈడీ సాంబశివరావు వేధిస్తున్నారని ఆందోళనకు దిగారు. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రెండున్నరేళ్లుగా బకాయిలు చెల్లించడంలేదని సబ్‌ కాంట్రాక్టర్లు, సామాగ్రి పంపిణీదారులు, ఉద్యోగులు అంటున్నారు. హైదరాబాద్‌లోని ఆఫీస్‌కు వెళ్తే పోలీసులతో బయటికి గెంటిస్తున్నారని, సగం బిల్లుల చెల్లింపునకు ఒప్పుకోవాలని బలవంతంగా రాయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బాధతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారని, సీఎం జగన్‌ కల్పించుకుని బకాయిలు చెల్లించేలా చేయాలని సబ్‌ కాంట్రాక్టర్లు, సామాగ్రి పంపిణీదారులు, ఉద్యోగులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాక చెల్లిస్తామని ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ఈడీ సాంబశివరావు అంటున్నారు ఇరిగేషన్‌ అధికారులతో మాట్లాడుతున్నామని, బిల్లులు పాస్‌ కాగానే ఎండీ శ్రీధర్‌తో మాట్లాడి బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. 73 మందికి బకాయిలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. కంపెనీ ఇబ్బందుల్లో ఉండటం వల్ల చెల్లించలేకపోయామని తెలిపారు. ఉద్యోగుల బకాయిలు, పీఎఫ్‌లు కూడా చెల్లిస్తామని సాంబశివరావు స్పష్టం చేశారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image