ఇడిమేపల్లి భూవివాదానికి సంబంధించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలీసులకు పంపిన వాంగ్మూలం

*ఇడిమేపల్లి భూవివాదానికి సంబంధించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలీసులకు పంపిన వాంగ్మూలం*


ఈ క్రింది వాంగ్మూలము క్రైమ్ నంబర్ 212/2019, వెంకటాచలం పోలీసుస్టేషన్ లో రిజిస్టర్ కాబడిన కేసుకు సంబంధించి ఇవ్వబడినది.


వెంకటాచలం మండలం ఇడిమేపల్లి సర్వే నంబర్ 58/3లోని ఎ 2.41 సెంట్ల భూమి గురించి ఏలూరు రంగారెడ్డి గారు చట్టబద్ధం కాని వివాదం లేవదీశారు. ఈ భూమి వారికి వంశపారపర్యంగా అనుభవంలో ఉన్నదని చెప్పుచున్నారు. కానీ అది ఎంతమాత్రం నిజం కాదు. ఇడిమేపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 58/3 లోని ఎ 4.82 సెంట్ల విస్తీర్ణం గల పొలం శ్రీమతి అర్వభూమి రాగమ్మ ఉరఫ్ మీనమ్మ గారికి చెందియుండినది. ఆమె సదరు సర్వే నంబరులోని ఎ 4.82 సెంట్ల భూమిని ఓఎస్ నంబర్ 147/1925 దావాకు సంబంధించిన ఈపీ నంబరు 489/1932లో గౌరవ నెల్లూరు డిస్ట్రిక్ట్ మున్సిఫ్ కోర్టు డిక్రీ ద్వారా పొందియుండినారు. లేట్ పామూరు పిచ్చిరెడ్డి గారి కుమారులైన పామూరు వెంకురెడ్డి గారు, పామూరు వెంకటసుబ్బారెడ్డి గారు మరియు సదరు పిచ్చిరెడ్డి గారి ఏకైక కుమార్తె రంగమ్మ గారి భర్త అయిన నెల్లూరు రంగారెడ్డి గారు తదితరులకు చెందిన ఆస్తిని నెల్లూరు డిస్ట్రిక్ట్ మున్సిఫ్ కోర్టు వారి ద్వారా మీనమ్మ గారు సేల్ సర్టిఫికెటు పొందివున్నారు.. ఆ సమయంలో పామూరు వెంకురెడ్డి, పామూరు వెంకటసుబ్బారెడ్డి మైనర్లు అయినందున నెల్లూరు రంగారెడ్డి గారు వారి గార్డియన్ గా వ్యవహరించినారు. నెల్లూరు రంగారెడ్డి గారు వీరితో పాటు రామచంద్రారెడ్డి మరియు రామిరెడ్డి గార్లకు కూడా గార్డియన్ గా వ్యవహరించారు. కోర్టు డిక్రీ ద్వారా ఎ 50.29 సెంట్ల భూమిని 1933 సెప్టెంబర్ 4వ తేదీన అర్వభూమి రాగమ్మ అలియాస్ మీనమ్మ గారు పొందారు. అట్లు రాగమ్మ అలిసాయస్ మీనమ్మ గారు పొందిన భూమిలో సర్వే నంబర్ 58/3కి సంబంధించిన మొత్తం విస్తీర్ణం ఎ 4.82 సెంట్ల పొలము కూడా ఉన్నది. పై విధంగా సర్వే నంబర్ 58/3లోని మొత్తం పొలం శ్రీమతి అర్వభూమి రాగమ్మ అలియాస్ మీనమ్మ గారు కోర్టు ద్వారా సంపూర్ణ హక్కులు పొంది అనుభవించుకునుచుండినారు. ఇందు వెంట పై విషయానికి సంబంధించినటువంటి గౌరవ కోర్టు వారి ఉత్తర్వులను (డాక్యుమెంట్ నంబర్ 1)జతపరుస్తున్నాం. అర్వభూమి రాగమ్మ అలియాస్ మీనమ్మ గారికి చెందినటువంటి ఈ భూముల వివరాలను 1935లో రెవెన్యూ శాఖ వారు రెవెన్యూ హోల్డింగ్ (ఆర్.హెచ్)లో కూడా నమోదు చేసియున్నారు. దీనికి సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన కాపీని జతపరుస్తున్నాను. (డాక్యుమెంట్ నంబర్ 2)


        దరిమిలా సర్వే నంబర్ 58/3లోని ఎ 4.82 సెంట్ల భూమిలోని ఎ 2.41 సెంట్ల భూమిని తన మేనల్లుడైన కట్టంరెడ్డి జయరామిరెడ్డి గారికి 1961 మార్చి 14వ తేదీన రిజిస్టర్ సెటిల్మెంట్ డీడ్ బేరింగ్ నంబరు 624/1961 ద్వారా చెందజేసియున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జతపరుస్తున్నాం..(డాక్యుమెంట్ నంబర్ 3). సదరు భూమిని కట్టంరెడ్డి జయరామిరెడ్డి గారు ఆర్టీ ట్రాన్స్ ఫర్ బేరింగ్ ఫైల్ నంబర్ 1245/1965 ద్వారా 1965లో బల్లేల కోటారెడ్డి గారికి చెందజేసియున్నారు. దీనికి సంబంధించి టెన్ 1 కాపీని జతపరుస్తున్నాం(డాక్యుమెంట్ నంబర్ 4)


        తర్వాత పై భూమిని 1983వ సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన బల్లేల కోటారెడ్డి  గారి నుంచి నేను బేరింగ్ నంబర్ 1271/1983 ద్వారా విక్రయం చేసుకున్నాను. దీనికి సంబంధించిన విక్రయ పత్రం జతపరుస్తున్నాను.(డాక్యుమెంట్ నంబర్ 5) అప్పటి నుంచి ఈ పొలం నా హక్కు అనుభవంలో కొనసాగుచుండియున్నది. ఈ భూమికి సంబంధించి రెవెన్యూ శాఖ వారు పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్ కూడా జారీ చేసియున్నారు. వీటి జెరాక్స్ కాపీలను కూడా జతపరుస్తున్నాను.(డాక్యుమెంట్ నంబర్ 6 మరియు 7).


       తర్వాత ఈ భూమిని మేనేజ్ చేయుటకు మరియు విక్రయించుటకు శ్రీమతి కట్టంరెడ్డి రాణి సంయుక్త గారికి 2008 జూలై 21వ తేదీన డాక్యుమెంట్ నంబర్ 17/2008 ద్వారా విక్రయించు హక్కు కూడా కల్పించియున్నది. ఈ పవార్ ఆఫ్ అటార్నీకి 2017 మార్చి 8వ తేదీన రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా సవరణ కూడా చేసియున్నాం. వీటికి సంబంధించి కాపీలను జతపరుస్తున్నాను.(డాక్యుమెంట్ నంబర్ 8 మరియు 9)


ఈ ఆస్తి అప్పుడు సర్వే నంబర్ 58/3లో ఉండినది.నేను కొనుగోలు చేసినప్పుడు ఈ ఆస్తికి హద్దులు ఉండినవి. ఆ హద్దులలోని విస్తీర్ణం ఎ 2.41 సెంట్లుగా ఉండినది. ఈ ఆస్తి హద్దులు కలిగి నా సంపూర్ణ హక్కు అనుభవంలో ఉన్నప్పటికినీ సబ్ డివిజన్ కలిగియుండుట మంచిదని తలచి సబ్ డివిజన్ చేయమని కోరుతూ రెవెన్యూ శాఖ వారికి దరఖాస్తు పెట్టాను. దీనికి సంబంధించిన అర్జీ, మీసేవ చలానా కాపీలను జతపరుస్తున్నాను. (డాక్యుమెంట్ నంబర్ 10 మరియు 11). రెవెన్యూ శాఖ వారు సర్వే చేసిన అనంతరం సబ్ డివిజన్ చేసి నా పొలమునకు సర్వే నంబర్ 58/3-2గా సబ్ డివైడ్ చేసినారు. (సబ్ డివిజన్ మ్యాప్ డాక్యుమెంట్ నంబర్ 12). ఈ సబ్ డివిజన్ ను ధ్రువీకరిస్తూ 2017 మే 8వ తేదీన తహసీల్దార్ వెంకటాచలం గారి లెటర్ ఆర్.సీ 178/2017 ద్వారా గూడూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తెలియజేసివున్నారు. దీనికి సంబంధించిన కాపీని జతపరుస్తున్నాను.(డాక్యుమెంట్ నంబర్ 13)


సదరు భూమిలోని ఎ 2.28 సెంట్ల విస్తీర్ణమును 2017 ఏప్రిల్ 6వ తేదీన మెస్సర్స్ శ్రీ సాయి ట్రేడర్స్ వారికి కట్టంరెడ్డి రాణీ సంయుక్త గారు జీపీఏ ద్వారా బేరింగ్ నంబర్ 1095/2017 ద్వారా విక్రయించారు. దీనికి సంబంధించిన జెరాక్స్ కాపీని కూడా జతపరుస్తున్నాను. (డాక్యుమెంట్ నంబర్ 14)


ఆ ఆస్తిని కొనుగోలు చేసిన పిదప శ్రీ సాయి ట్రేడర్స్ వారు కాంపౌండ్ వాలు నిర్మించి సదరు స్థలంలో ఓ భవనాన్ని నిర్మించి ఆ ఆస్తిని అనుభవించుకునుచున్నారు.


పైన పేర్కొన్న విధంగా 1933వ సంవత్సరంలోనే సర్వే నంబర్ 58/3లోని ఎ 4.82 సెంట్లు హక్కు పామూరు వెంకురెడ్డి, పామూరు వెంకటసుబ్బారెడ్డి, నెల్లూరు రంగారెడ్డి తదితరులు కోల్పోయినారు. అట్లు వారు కోల్పోయిన ఆస్తిని కూడా వారు తమదిగా చెలామణి చేస్తూ పంపకములు చేసుకునియున్నారని ఈ మధ్య తెలియుచున్నది. ఆ పంపకములు చట్టరీత్యా చెల్లవు. లేని పొలమును ఉన్నట్లు చూపించి పారీకత్తులు సృష్టించుకునియున్నారు. వారు తప్పు చేసి నేను అబద్ధపు రికార్డులు సష్టించానని నాపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. దురుద్దేశపూర్వకముగా నన్ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని దుష్ర్పచారం చేస్తున్నారు. దాని ఫలితమే ఈ అబద్ధపు రిపోర్టు. పై విషయము గురించి ఏలూరు రంగారెడ్డి, పామూరు రఘునాధరెడ్డి ఓఎస్ నంబర్ 211/2018 ద్వారా నెల్లూరు మూడో అదనపు జిల్లా కోర్టులో డిక్లరేటరీ సూట్ వేసియున్నారు. దీనికి సంబంధించిన దావా కాపీని జతపరుస్తున్నాను.(డాక్యుమెంట్ నంబర్ 15). సదరు సూట్ పెండింగ్ లో ఉన్నది. ఆ కోర్టులో ఈ ఆస్తి మీద హక్కు తనది నిర్ధారణ చేయమని సివిల్ కేసు వేసి అది పెండింగ్ లో ఉండగానే ఎవరు హక్కుదారులో సివిల్ కోర్టులో తేలకుండానే, సివిల్ సూటు విషయాన్ని ప్రస్తావించకుండా ఏలూరు రంగారెడ్డి గారు నాపై అబద్ధపు కేసు సష్టించి సంఘంలో నా పేరు ప్రతిష్టలు తగ్గించాలని కొందరి ప్రోత్సాహంతో రాజకీయంగా కుట్ర చేయుచున్నారు. నా దగ్గర ఆస్తిని కొనుగోలు చేసిన శ్రీ సాయి ట్రేడర్స్ వారు కూడా జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో ఓఎస్ నంబర్ 351/2019గా దావా వేసియున్నారు. ఈ దావా కాపీని కూడా జతపరుస్తున్నాను.(డాక్యుమెంట్ నంబర్ 16). సివిల్ కోర్టులో ఆస్తి వివాదం జరుగుచున్నప్పటికీ కూడా ఆ విషయమును గురించి ఎలాంటి ప్రస్తావన కూడా చేయకుండా ఈ అబద్ధపు క్రిమినల్ కేసును నాపై వేసియున్నారు.


సర్వే నంబరు 58/3 ఇడిమేపల్లి గ్రామంలోని నా హక్కు అనుభవంలో ఉన్న ఎ 2.41 సెంట్లను సర్వే చేసి సబ్ డివిజన్ చేయవలసినది అని నేను కోరుతూ రెవెన్యూ శాఖ అధికారులకు అర్జీ పెట్టినాను. దరిమిలా ఆ శాఖ వారు సర్వే చేసినారు. విస్తీర్ణం ఎ 2.41 సెంట్లను నిర్ధారించి నా అనుభవంలో ఉన్న పొలము సర్వే నంబరును 58/3-2గా సబ్ డివైడ్ చేసినారు. సబ్ డివిజన్ చేసినట్లుగా వెంకటాచలం మండలం తహసీల్దార్ గారు గూడూరు సబ్ రిజిస్ట్రార్ గారికి తెలియజేస్తూ ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి కూడా నకలు పంపించివున్నారు. అందుకుని అది సబ్ డివిజన్ అయినదని నేను నమ్ముటలో ఎలాంటి చట్టబద్ధమైన అవరోధం లేదు. కానీ ఈ సబ్ డివిజన్ నేను కుట్ర పూరితంగా రికార్డులు తారుమారు చేసి సష్టించినానని నా మీద నిరుపయోగ, నిరాధారమైన దుష్ప్రచారం చేయుట చాలా దుర్మార్గం. ఇది రాజకీయ ప్రేరేపిత కుట్ర. అందుకుని సెక్షన్ 120బీ ఐపీసీ ఏ మాత్రం వర్తించదు. నేను ఏ విధమైనటువంటి ఫోర్జరీ చేయలేదు. కనుక 468, 471వ సెక్షన్లు నేను చట్టపరంగా చేయించిన సబ్ డివిజన్ కు వర్తించవు. నా పొలమును నేను సబ్ డివిజన్ చేయించుటకు 468, 471 ఐపీసీ సెక్షన్లు ఏ మాత్రం వర్తించవు. ఎందుకనగా అది చట్టపరమైన చర్య. సబ్ డివిజన్ చేయుటలో ఏమైనా తప్పుఒప్పులుంటే సంబంధిత రైతు రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేయాల్సిందే కానీ ఈ విధంగా చట్టాన్ని దుర్వినియోగం చేయుట తగదు.


                నా పొలంలో నేను ప్రవేశించుట, నా దగ్గర కొనుగోలు చేసిన వారు ప్రవేశించుట ఏ మాత్రం చట్టవ్యతిరేకం కాదు. అందుకని సెక్షన్ 447, 427 ఐపీసీ నాకు కానీ, నా దగ్గర పొలం కొనుగోలు చేసిన వారికి కానీ వర్తించదు. నేను ఇతరుల ఆస్తిని దొంగతనంగా తీసుకుని పోలేదు. కనుక సెక్షన్ 379 ఐపీసీ కింద చేసిన నేరారోపణ నిరాధారం. పైపెచ్చు ఈ వివాదంలో ఉన్న భూమి మీద హక్కు ఎవరిదో తేల్చమని వై.రంగారెడ్డి గారు నెల్లూరు మూడవ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ఓఎస్ నంబర్ 211/2018 దావా వేసియున్నారు. కనుక పాత సర్వే నంబరు 58/3 ప్రస్తుత సర్వే నంబరు 58/3-2 వివాదగ్రస్తమైవున్నది. కోర్టులో వ్యాజ్యములో ఉన్నది. ఈ వ్యాజ్యము తేలక ముందు కానీ ఏ విధమైన క్రిమినల్ కేసు వేయడం చట్టరీత్యా కుదరదు. పోలీసు వారు టైటిట్ ను నిర్ణయించలేరు. కనుక ఈ ఫిర్యాదు కుట్రపూరితంగా నా పేరు ప్రఖ్యాతులను దెబ్బతీయుటకు చేసిన దుర్మార్గపు ప్రయత్నం. నా దగ్గర ఈ పొలమును కొనుగోలు చేసిన వారు ఎ 2.28 సెంట్ల చుట్టూత ప్రహరీ నిర్మించి, అందులో బిల్డింగ్ కట్టుచున్ననూ నోరు మెదపక ఎందుకున్నారు. కనుకనే ఈ ఫిర్యాదు నిరాధారమైనది మరియు కుట్రపూరితమైనది. అందుకుని ఈ సివిల్ వ్యవహారములో పోలీసు వారు ఎలాంటి జోక్యం చేయకుండా ఫిర్యాదును కొట్టివేయుదురని ఆశిస్తున్నాను..


     (సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి)


Popular posts
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు :శ్రీమతి పద్మశ్రీ సుంకర, ఏ పిసిసి సమన్వయ కమిటీ సభ్యులు
Image
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image
ఏప్రిల్ 14 వరకు ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు