విజయవాడలో మరో ప్రెస్ క్లబ్ కి శ్రీకారం చుట్టబోతున్న ఏపీ ఎస్ ఎస్

*విజయవాడలో మరో ప్రెస్ క్లబ్ కి శ్రీకారం చుట్ట బోతున్న ఏపీ ఎస్ ఎస్


 *విజయవాడ* 


ఏపీ ఎస్ ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది..


 ఈ కార్యక్రమంలో పలువురు ఎడిటర్లు పాల్గొన్నారు ..


ఏపీ ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసాద్ బాబు మాట్లాడుతూ I&PR లో జరిగిన అవినీతి కుంభకోణంపై 2004 నుంచి 2019 ఆగస్టు 31 వరకు ఏ పత్రికలకి ఎంత ఎంత యాడ్స్ ఏ ప్రాతిపదికన ఇచ్చారు తెలిపే విధంగా ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని కమిషనర్ కి ఇవ్వాలని ప్రతిపాదించారు ...



అదే విధంగా విజయవాడలో ఉన్న ఒక ప్రెస్ క్లబ్ కి సభ్యులందరూ హాజరు అవడం లేదని అందుకే మన స్థాయిలో మరో  *రాజధాని ప్రెస్ క్లబ్* గా ఏర్పాటు చేద్దామని సమావేశం తీర్మానించింది..


 అదే విధంగా జిల్లాలో మిగిలిపోయిన సభ్యత్వాలను వెంటనే విజయవాడ చేరే విధంగా అప్లికేషన్లు తీసుకురావాలని ఎడిటర్ లను కోరడమైనది ...


రాబోయే మార్చి వరకి కొత్త అక్రిడేషన్ లేనట్లు సమాచారం కాబట్టి ఎడిటర్లు అందరూ మంచి నడవడిక కలిగిన విలేకరులను తమ పత్రికలను చేర్చుకోవాలని కమిటీ అభిప్రాయపడింది ...


ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే ప్రసాద్ బాబు ,నందిగామ కోటేశ్వరరావు ,కోశాధికారి వి. రవిశేఖర్, సభ్యులు చిమటా శ్రీనివాసరావు ,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు....


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image