వైసీపీ ప్రభుత్వం బాధితులనే దోషులుగా చిత్రీకరిస్తోంది : ,డొక్కా

తేది. 13-09-2019


విలేకరుల సమావేశం వివరాలు


 వైసీపీ ప్రభుత్వం బాధితులనే దోషులుగా చిత్రీకరిస్తోంది 


- వైసీపీ నాయకులు ఎవరిపేరు చెబితే వారిపై కేసులు పెడతారా?


        -  డొక్కా   మాణిక్యవర ప్రసాద్‌


  వైసీపీ దురాగతాలకు బలైన తెలుగుదేశం కారకర్యలకు న్యాయం చేయాలని,  ప్రభుత్వ బాధితులను ఆదుకోవాలని టీడీపీ పోరాటం చేస్తుంటే, వారికి వ్యతిరేకంగా కక్షసాధింపు ధోరణితో రివర్స్‌లో కేసులు పెడుతూ, బాధితుల్నే దోషుల్ని చేస్తూ వారినే పోలీస్‌స్టేషన్లకు తరలించడం ఈ ప్రభుత్వంలోనే జరుగుతోందని టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం విజయవాడలో డీజీపీని కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికతో బాధితుల్ని, నష్టపోయిన వారిని దోషులుగా చిత్రీకరిస్తూ, దాడిచేసిన వారిని, టీడీపీ కార్యకర్తల ఆస్తులు, పొలాలు ధ్వంసం చేసిన వారినేమో బాధితులుగా చిత్రీకరించే కుట్రకు తెరలేపిందని డొక్కా వాపోయారు.  ఈ తరహాచర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రం మంచిదికాదన్న ఆయన, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వమే రెచ్చగొట్టేలా, అధికారులు అత్యుత్సాహంతో దుందుడుకు చర్యలకు పాల్పడటం సరికాదని హితవుపలికారు. ఉభయపక్షాలను సమావేశపరిచి, శాంతిభద్రతలను కాపాడాల్సినవారే దాడులుచేసే వారికి కొమ్ముకాయడం ఏమాత్రం భావ్యం కాదన్నారు. ఆత్మకూరు సంఘటనల తర్వాత శాంతిభద్రతలు రక్షించేలా చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, వరుసగా దుర్ఘటనలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం విచారకరమని మాణిక్యవర ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. మాపార్టీ అధినేతను కలవడానికి వెళ్తున్న టీడీపీ శాసనసభాపక్ష నేత అచ్చెన్నాయుడిని బలవంతంగా నిర్బంధించడం ఏమిటని, ఒక్కడే ఆయన కారులో వెళ్తుంటే అడ్డుకొని, ఉండవల్లిలో కేసునమోదైతే, పాతకేసులంటూ టెక్కలి పోలీసులు అరెస్ట్‌కు యత్నించడం ఎంతవరకు సమంజసమని డొక్కా ప్రశ్నించారు. సోషల్‌మీడియాలో కూడా మహిళలని కూడా చూడకుండా అసభ్యంగా, అభ్యంతరకరంగా  వైసీపీవాళ్లు చేస్తున్న వ్యాఖ్యలను, పోలీసులు ఎందుకు నిరోధించలేకపోతున్నారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ గారిని, ఆయన కుటుంబసభ్యులను దూషిస్తూ, సోషల్‌మీడియాలో  జరిగిన అసభ్య ప్రచారాన్ని ఈ సందర్భంగా డొక్కా ప్రస్తావించారు. టీడీపీవాళ్లు, బాధితులు ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు, వైసీపీ వారిచ్చే ఫిర్యాదులపై మాత్రం మితిమీరిన అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న విషయాలను కూడా డీజీపీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.


 ఆడబిడ్డలపై అసభ్య ప్రచారం చేస్తున్నవారిపై చర్యలేవి : పోతుల సునీత


రాష్ట్రంలో ఒక్క ఆత్మకూరు గ్రామంలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేస్తున్న దాడులను నిలువరించడానికి టీడీపీ అధినేత 'ఛలో ఆత్మకూరు' కి పిలుపునిచ్చారని  తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత తెలిపారు. ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం వ్యవహరించిన తీరు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందన్న ఆమె, వైసీపీ సర్కారు వచ్చిన తొలిరోజు నుంచీ, ప్రజావేదిక కూల్చివేత సహా, అనేక అనాలోచిత చర్యలకు పాల్పడిందన్నారు. ప్రభుత్వ చర్యలవల్ల రాష్ట్రంలోని మహిళలందరూ, ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఉత్సాహంగా ఉండే స్త్రీలపై అసభ్య ప్రచారం జరుగుతోందని పోతుల సునీత ఆవేదన వ్యక్తం చేశారు. సాటి మహిళను గౌరవించడం చేతగానివారికి ప్రభుత్వం వత్తాసు పలకడం, దూషణలు చేస్తున్న వారిని వెనకేసుకురావడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో హోం మంత్రిగా మహిళే ఉన్నప్పటికీ, నవ్యాంధ్రలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందన్న సునీత, రాష్ట్రవ్యాప్తంగా ఆడబిడ్డలపై జరుగుతున్న దురాగతాలపై తెలుగుదేశం పార్టీ తరుపున డీజీపీని కలిసి తెలియచేయడం జరిగిందన్నారు.


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image