పెయిడ్ ఆర్టీస్ట్ లతో డ్రామాలు ఆడుతున్నారు :వై.సి.పి నేతలు

వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
గుంటూరు.
సెప్టెంబర్ 11.


*శ్రీ కాసు మహేష్ రెడ్డి, గురజాల ఎమ్మెల్యే కామెంట్స్* 


గుంటూరు జిల్లా నడిబొడ్డులో చంద్రబాబు పెయిడ్ ఆర్టీస్ట్ లతో డ్రామాలు ఆడుతున్నారు


సిఎంగా వుండి చంద్రబాబు పల్నాడును ఏమాత్రం అభివృద్ధి చేయలేదు


పల్నాడు గురించి చంద్రబాబు కు ఏం తెలుసు?


వైఎస్ఆర్, కాసు బ్రహ్నానందరెడ్డి హయాంలో పల్నాడు అభివృద్ధి జరిగింది


వైఎస్ జగన్ సిఎం అయిన మూడు నెలలో పల్నాడులో మెడికల్ కాలేజ్ మంజూరు చేశారు


ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పి, అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేక పోతున్నారు


చివరికి అసెంబ్లీ ఫర్నీచర్ కూడా తీసుకు వెళ్ళిన చరిత్ర తెలుగుదేశంది


పల్మాడుపై బహిరంగ చర్చకు రండి


వైఎస్ఆర్ సిపి నేతలు అందరం ఆత్మకూరు కు బయలుదేరతాం


తెలుగుదేశం బాదితులతో ఆందోళన చేపడతాం


పల్నాడులో నేడు రైతులు పంటలు పండిస్తున్నారు


రెండో పంటకు కూడా నీరివ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది


ఇచ్చిన వాగ్ధానాల్లో మొదటి సంవత్సరంలోనే అన్ని అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్


ఓర్వలేక చంద్రబాబు రాజకీయాలకు పాల్పడుతున్నారు


ఆత్మకూరు పోతాం.. నిజాలు బయట పెడతాం
-------
*శ్రీ నంబూరు శంకరరావు, పెదకూరపాడు ఎమ్మెల్యే కామెంట్స్*


గతంలో పల్నాడులో బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్ళే పరిస్థితి లేకుండా చేశారు


పార్టీలకు అతీతంగా నేడు వైఎస్ జగన్ పాలనలో సంక్షేమం అందరికీ అందిస్తున్నాం


దీనిని తట్టుకోలేక చంద్రబాబు దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు


ఫ్యాక్షన్ గ్రామాల్లో శాంతి నెలకొల్పుతున్నాం



-------------



శ్రీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎంపీ కామెంట్స్*


అరవై నెలల టిడిపి పాలన, మూడు నెలల వైసిపి పాలనను పల్నాడు చూసింది.


నేడు 300 పడకల ఆసుపత్రి, అనుబంధ గా వైద్య కళాశాల మంజూరయ్యింది.


సాగర్ ద్వారా పల్నాడు ప్రాంతానికి సాగు నీరందిస్తున్నాం.


గురవాచారి అనే వ్యక్తి యరపతినేని అక్రమాలను అడ్డుకున్నారు.


పోలీసులతో ఆయనను వేధించారు.


తొట్టిపాలెంలో మైనారిటీలను వేదించారు.


అంబటి రాంబాబుపై దాడి, పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టించింది ఈ టిడిపి ప్రభుత్వం కాదా?


అప్పుడు చంద్రబాబు కు ఈ అక్రమాలు గుర్థుకు రాలేదా?


చంద్రబాబు కు చిత్తశుద్ధి వుంటే పల్నాడు లోని అన్ని గ్రామాలు తిరుగుదాం


చంద్రబాబు కు ఈ మేరకు సవాల్ విసురుతతున్నాం.
--------
శ్రీ ముస్తాఫా, ఎమ్మెల్యే


గతంలో పల్నాడు కు వెడుతున్న మాపై కనీవినీ ఎరగని విధంగా దాడి చేయించారు.


జెడ్పీటిసి ఎన్నిక సందర్భంగా భయోత్పాతం సృష్టించిన చరిత్ర తెలుగుదేశంది.


చంద్రబాబు తన పాలనలో పల్నాడులో అరాచకాకు పాల్పడ్డారు.


వైఎస్ జగన్ పాలన చూసి చంద్రబాబు కళ్ళు తెరవాలి.
-----------
*శ్రీ విడతల రజని, చిలకలూరిపేట ఎమ్మెల్యే*


చంద్రబాబు చలో ఆత్మకూరు కు అర్ధం లేదు.


ప్రతిపక్షంలో వున్నప్పుడు తమను ఎన్నో ఇబ్బందులు పెట్టారు.


ఇప్పుడు తెలుగుదేశం మనుషులతో
పునరావాస కేంద్రాలు పెడతామని చెబుతున్నారు.


చిలకలూరిపేట నియోజకవర్గం మొత్తం మీద 500 మందిపై రౌడీ షీట్లు పెట్టారు


ఎడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరిపేట మండలాల్లో భయభ్రాంతులకు గురి చేశారు.


మేమంతా ఆత్మకూరు వస్తాం... చంద్రబాబుకు దమ్ముంటే చర్చకు రావాలి
---------
*శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే*


చంద్రబాబు దిగజారి రాజకీయాలు చేస్తున్నారు.


వైఎస్ జగన్ ఈ రాష్ట్రంలో పేదలకు, రైతులకు అండగా పాలన సాగిస్తున్నారు.


పల్నాడులో ఎక్కడా అశాంతి లేదు. 


చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు అసత్యం.


దమ్ముంటే నిరూపణకు చంద్రబాబు ముందుకు రావాలి


మీ ఆరోపణలు నిజమని నిరూపిస్తే 
నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను


చంద్రబాబు నువ్వు చెప్పింది తప్పు అని తేలితే ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి.


పల్నాడు ను రాజకీయ స్వార్ధం కోసం వాడుకుంటున్నావు.


పల్నాడులో ఏడుగురిని దారుణంగా నరికి చంపించిన చరిత్ర తెలుగుదేశం ది.


ఆత్మకూరు గ్రామంపై దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు.


లేని అశాంతిని కల్పించవద్దు.


ప్రశాంతంగా వున్న పల్నాడును మళ్ళీ రగిలించాలని చూడవద్దు.


పల్నాడు ప్రజల మనోభావాలను దెబ్బతీయవద్దు.


ఎవరో జ్యోతీషుడు చెప్పిన మాటలు విని చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడు.
----------


*శ్రీ అంబటి రాంబాబు, సత్తెనపల్లి ఎమ్మెల్యే*


పల్నాడులో సుబ్బారావు అనే రైతుకు చెంది‌న 18 ఎకరాల భూమిని‌ కోడెల శివప్రసాదరావు, ఆయన అనుచరులు ఆక్రమించారు


ఇదే సుబ్బారావు అప్పుడు తెలుగుదేశం కార్యకర్త


కోడెల విజయానికి కూడా పని చేశారు


అయినా కూడా ఆయన భూమిని వదిలిపెట్టలేదు.


పోలీసులతో బెదరించారు.


సుబ్బారావు కు చెందిన కోళ్ళఫారం నుంచి కోళ్ళను, పొటేళ్ళను కూడా బలవంతంగా లాక్కువెళ్ళిన ఘనత టిడిపి నాయకులది


ఈ అరాచకంకు భయపడి సుబ్బారావు తన ఊరు వదిలిపెట్టాల్సి వచ్చింది.


ఇప్పుడు ఇదే సుబ్బారావు ధైర్యంగా తనకు చేసిన అన్యాయం ను బయటపెడుతున్నాడు


చంద్రబాబు దీనిని వినేందుకు సిద్దంగా వున్నాడా?
-----


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image