హౌస్ అరెస్ట్ లో ఉన్న దేవినేని ఉమా మీడియా సమావేశం*

*అంబేడ్కర్ స్ఫూర్తికి ప్రభుత్వ ధోరణి గొడ్డలిపెట్టు*


*ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసారు*


*పోటీ శిబిరాలతో జగన్ చేతగాని తనం*


*పోలీసులు, లాఠీలతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని అడ్డుకోలేరు*


*ఆత్మకూరు బాధితులకు న్యాయం జరిగేదాకా తెదేపా ఉద్యమం ఆగదు*


*హౌస్ అరెస్ట్ లో ఉన్న దేవినేని ఉమా మీడియా సమావేశం*


_విజయవాడ రూరల్ (గొల్లపూడి):- ఏపీ మాజీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమాను మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో హౌస్ అరెస్ట్ చేసారు. తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు చలో ఆత్మకూరు కార్యక్రమానికి ఉమా వెళ్లకుండా పోలీసులు గృహ నిర్భంధం చేసారు. ఈ విషయం తెలిసి గురువారం ఉదయం గొల్లపూడి ఆయన అద్దెకు ఉంటున్న గృహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తండోపతండాలుగా వచ్చారు. దేవినేని ఉమా అరెస్ట్ ను నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేసారు. ఈ సందర్భంగా దేవినేని మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ధోరణి అంబేడ్కర్ స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అని, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హక్కుల్ని జగన్ ప్రభుత్వం కాలరాస్తుందని ధ్వజమెత్తారు. వందరోజుల ముఖ్యమంత్రి జగన్ చేతగాని ప్రభుత్వంలో పుట్టిపెరిగిన ఊళ్ళను ఒదిలేసి వందరోజులుగా పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న తెదేపా కార్యకర్తలకు, అభిమానులకు అండగా చలో ఆత్మకూరు కార్యక్రమం తలపెట్టినందున ప్రభుత్వం నాయకుల గృహనిర్భంధాలకు పాల్పడిందని ఆరోపిరంచారు. బాధితులకు న్యాయం చేయకుండా పోటీ శిబిరాలతో, శాంతి భద్రతలను ప్రభుత్వమే అల్లకల్లోలం చేస్తుందని ఆరోపించారు. పోలీసులు, లాఠీలతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని అడ్డుకోలేరని, ఆత్మకూరు బాధితులకు న్యాయం జరిగేదాకా తెదేపా ఉద్యమం ఆగదని దేవినేని ఉమా స్పష్టం చేసారు. పోరాటాలు, అక్రమ అరెస్టులు తెదేపాకు కొత్త కాదని, తనకు తెలియనివి కాదని ఉమా వివరించారు._


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image