వైసిపి నేతలపై ధ్వజమెత్తిన యనమల రామకృష్ణుడు

ప్రజాస్వామ్యాన్ని, పార్టీలను లేకుండా చేయడమే సీఎం జగన్ దురాలోచన
వైసిపి నేతలపై ధ్వజమెత్తిన యనమల రామకృష్ణుడు
''ఛలో ఆత్మకూరు'' నిరసనల్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు: యనమల
 నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని టిడిపి నేతలు, శ్రేణులు ప్రదర్శించాయి. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా చూపాలి, రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి. 
ప్రజాస్వామ్యాన్ని, పార్టీలను లేకుండా చేయాలన్నదే సీఎం జగన్ దురాలోచన.
తన పాలనను ప్రజలు ప్రశంసిస్తున్నారని జగన్ చెప్పడం హాస్యాస్పదం. 6నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటా అనిచెప్పి ఇంతకన్నా చెడ్డ సీఎం లేడని పేరొందారు.
అప్పుడు హిట్లర్ ను గోబెల్స్ ముంచేశాడు. ఇప్పుడు జగన్ ను సాక్షి మీడియా ముంచేస్తుంది. జీవనోపాధి కోల్పోయి లక్షలాది జనం రోడ్డున పడ్డారు. ఇసుక కొరతతో నిర్మాణ పనులన్నీ స్థంభించిపోయాయి. గోదావరి, కృష్ణా వరద బాధితులను ఆదుకునే చర్యలు లేవు. లక్షలాది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలను చావుదెబ్బతీశారు.  ఇన్ని నిర్వాకాలు చేసినందుకా ప్రజలు జగన్ ను ప్రశంసించేది..?
అమరావతి అభివృద్దికి నిధులు లేవని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం. విదేశీ పర్యటనల్లో కూడా ఏపి ప్రతిష్ట పెంచే చర్యలు చేపట్టకుండా, పెట్టుబడులు అడ్డుకునేలా వ్యాఖ్యలు చేయడం గర్హనీయం. అమరావతికి నిధులు లేవు అనడం వైసిపి ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేసింది. అమరావతిని అభివృద్ది చేయమని ఆర్ధికమంత్రే చెప్పడం వైసిపి తిరోగమనం. 
అభివృద్ది వికేంద్రీకరణ చేస్తామని చెప్పడం కొత్తదేమీ కాదు. టిడిపి పాలనలో జరిగింది అభివృద్ది వికేంద్రీకరణే. కరవు సీమ అనంతపురానికి నీళ్లు ఇచ్చామన్నా, కియా పరిశ్రమ తెచ్చామన్నా, ప్రకాశంలో పరిశ్రమలు తెచ్చామన్నా, విశాఖలో ఐటి హబ్ అభివృద్ది చేశామన్నా, అన్నీ టిడిపి అభివృద్ది వికేంద్రీకరణలో భాగాలే..
అమరావతిని అభివృద్ది చేయలేమని బుగ్గన చేతులెత్తేశారు. సింగపూర్ వెళ్లి ఏపి ప్రతిష్ట దెబ్బతీసే వ్యాఖ్యలు గర్హనీయం. వరల్డ్ బ్యాంకు, ఏసియన్ బ్యాంకు రుణాలు పోగొట్టింది మీరుకాదా..? ఇప్పుడు అమరావతికి నిధులు లేవని చేతులెత్తేస్తారా..? ఇంతకన్నా దివాలాకోరుతనం ఏముంటుంది..? 
టిడిపి ప్రభుత్వం అటు అమరావతిని, ఇటు 13జిల్లాల అభివృద్దిని సమ ప్రాధాన్యతతో అభివృద్ది చేసినప్పుడు వైసిపి ప్రభుత్వం ఎందుకని చేయలేక పోతోంది..? అభివృద్దిని గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపులకే వైసిపి నేతలు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే గత 110రోజుల్లో ఈ దుష్పలితాలు.
చంద్రబాబు నిర్బంధంపై డిజిపి సవాంగ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఉద్రిక్తతలు పెరుగుతాయని మాజీ సీఎం ఇంటి గేట్లకు తాళ్లు కట్టామని సమర్ధిస్తున్నారా..? మాజీ సీఎంను 45ని. కారులోనే నిర్బంధించామని డిజిపి చెబుతున్నారా..? ప్రశాంతంగా, శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలను పోలీసు బలగాలతో అణిచేయాలని చూశారు. 
సెక్షన్ 144, సెక్షన్ 30 లేనిచోట్ల టిడిపి నేతలను ఎలా నిర్బంధిస్తారు..?  నోటిసులు ఇవ్వకుండా హవుస్ అరెస్ట్ లు ఎలా చేస్తారు..? రోజు కూలీకి వెళ్లే కూలీలను ఆటోల్లో నుంచి దింపి ఇళ్లకు పంపేయడం ఏమిటి..? పెళ్లికి వచ్చిన వాళ్లను కూడా పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం ఏమిటి..? 
ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘనలు కాదా..? మానవ హక్కులను ఉల్లంఘించింది వైసిపి ప్రభుత్వమే కాదా...? మాజీ సీఎం చంద్రబాబును 12గం అక్రమ నిర్బంధంలో ఉంచడం, అదేమని ప్రశ్నిస్తే రాత్రి 7.30గం కు ఇంటికి నోటీసు అంటించడం, టిడిపి నేతల అక్రమ అరెస్ట్ లు అన్నీ మానవ హక్కుల ఉల్లంఘనలే..
వీటన్నింటికి వైసిపి ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాలి.
ప్రజాస్వామ్య వాదులు, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఒక్కతాటిపైకి రావాలి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉంది. మేధావులు, అభ్యుదయ వాదులంతా ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి.
యనమల రామకృష్ణుడు
శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image