13జిల్లాలలో వైసిపి ప్రభుత్వ బాధితులతో చంద్రబాబు భేటి. 

13జిల్లాలలో వైసిపి ప్రభుత్వ బాధితులతో చంద్రబాబు భేటి. 
తమపై దాడులను, దౌర్జన్యాలను ఏకరువు పెట్టిన బాధితులు
ఆదిమూర్తి, ఆవులప్ప: ''18ఎకరాల్లో 5,400 దానిమ్మ చెట్లను నరికేశారు. వైసిపి వచ్చింది కాబట్టి ఆ భూములు లాక్కుంటామని బెదిరిస్తున్నారు. 
భూములు నాశనం చేస్తే పార్టీలోకి వస్తారని దౌర్జన్యాలకు పాల్పడ్డారు. పార్టీ మారితే మా భూములు మాకుంటాయట, లేకపోతే ధ్వంసం చేస్తారట..50ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములు లాక్కుంటున్నారు'' అని వాపోయారు.
కిలారి మారుతి, దారపనేని మంగమ్మ( మైల సముద్రం, కొత్తచెరువు మండలం, పుట్టపర్తి నియోజకవర్గం): ''మూగవాడని కూడా దయలేకుండా తల పగులకొట్టారు. 14కుట్లు పడ్డాయి. అడ్డంపడితే ముసల్దానిని  అనికూడా చూడకుండా దారుణంగా కొట్టారు. ఇన్నాళ్లు పోలీసులు పట్టించుకోలేదు, ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నామని తెలిసి స్టేషన్ కు రమ్మని ఫోన్లు చేస్తున్నారు అధికారులు'' అంటూ కన్నీరు పెట్టుకున్నారు.
చెల్లబోయిన విజయలక్ష్మి, నాగమల్లేశ్వరి(విశ్వేశ్వరయ్యపురం, తూర్పుగోదావరి జిల్లా): ''25ఏళ్లుగా మా స్వాధీనంలో ఉన్న భూమిని లాక్కున్నారు. కాపు కార్పోరేషన్ ఛైర్మన్ పదవి అడ్డం పెట్టుకుని జక్కంపూడి రాజా బెదిరిస్తున్నారు. 1994లో కొనుక్కున్న ఎకరం 70సెంట్ల  భూమిని కబ్జా చేశారు. 
ఈనెల 6న తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో మీకు ఫిర్యాదు చేశామనే అక్కసుతో ఆ స్థలంలోని కొబ్బరి చెట్లను నరికేశారు. మగాళ్లను అక్రమకేసులలో ఇరికించి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి జైలకు పంపారు. మహిళలను రోడ్డుకీడ్చారు. పేదల ఉసురు పోసుకుంటున్నారు'' అని కన్నీరు పెట్టుకున్నారు.


చంద్రబాబు: శరీరంపై గాయాలు చేస్తే కొన్నాళ్లకు మానుబడతాయి. అదే ఆర్ధిక మూలాలను దెబ్బతీస్తే కోలుకోవాలంటే కొన్ని తరాలు పడతుంది. 
వీళ్లా పెయిడ్ ఆర్టిస్టులు..? ఈ బాధితులా అద్దె మనుషులు..? లేక మీరా అద్దె మైకులు..? 
బాధితులను పట్టుకుని ఈవిధంగా అనేందుకు నోరెలా వచ్చింది..? 
చాలా దుర్మార్గమైన కార్యక్రమం. వైసిపి దుర్మార్గాలను సహించే ప్రసక్తేలేదు. బాదిత కుటుంబాలకు అండగా ఉంటాం.