ఇరిగేషన్‌ శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష

అమరావతి


*ఇరిగేషన్‌ శాఖపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*


*వరద వచ్చినప్పుడే ఒడిసిపట్టాలి: ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌*
*30 రోజుల్లో కృష్ణా వరదజలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులు నిండాలి*
*సముద్రంలోకి నీళ్లు వెళ్లకముందే శరవేగంగా కృష్ణావరదజలాల పై ఆధారపడ్డ ప్రాజెక్టులు నిండాలి*
*ఆమేరకు ప్రణాళికలు సిద్ధం చేయండి*
*120 రోజుల వరద వస్తుందనే లెక్కలను సవరించండి:*
*ఇరిగేషన్‌ శాఖసమీక్షలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌*
*ఈ సీజన్‌లో వరద వచ్చినా... ప్రాజెక్టులను నింపడానికి చాలా సమయం పడుతోంది*
*అతితక్కువ సమయంలో భారీగా వరద వచ్చింది*
*శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నిండి వరదజలాలు సముద్రంలోకి వెళ్లాయి*
*దేవుడు దయవల్ల రెండోసారి వరద వచ్చింది*
*30 రోజులు మాత్రమే వరద వస్తుందని అంచనా వేసి ఆమేరకు ఆ నీటిని తరలించడానికి ఏంచేయాలో అది చేయండి*
*లేకపోతే కృష్ణా వరదజలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులు చిహ్నాలుగా మిగలిపోతాయి*
*ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నాకూడా సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నాం*
*ప్రతిరూపాయినికూడా సద్వినియోగం చేయాలి*
*సాగునీటి ప్రాజెక్టుల్లో స్కాంలు లేకుండా చూసుకోవాలి*
*ప్రస్తుతం ఏ వర్కు చూసుకున్నా స్కామే కనిపిస్తోంది*
*సాగునీటి ప్రాజెక్టు పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌ విధానం పాటించాలని సీఎం ఆదేశం*
*నాలుగేళ్లలో తప్పనిసరిగా ఇప్పుడున్న ప్రాజెక్టులు పూర్తికావాలన్న సీఎం*
*దీనికోసం జిల్లాల వారీగా ప్రణాళికలు సిద్ధంచేయాలని సీఎం ఆదేశం*
*ఒడిశాతో ఉన్న సమస్యల పరిష్కారానికి ఆరాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలకు సన్నాహం చేయాలన్న సీఎం
*పల్నాడును సస్యశ్యామలం చేయాలి, దీనికోసం పనులు వేగంగా మొదలుపెట్టాలన్న  సీఎం*


అమరావతి: ఇరిగేషన్‌పై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రాజెక్టుల వారీగా, జిల్లాల వారీగా సమీక్ష
ఇప్పటివరకూ జరిగిన పనులు, పెండింగ్‌లో ఉన్న పనులపై అధికారులనుంచి  అడిగితెలుసుకున్న సీఎం


ఈ ఏడాది కృష్ణా వరదజలాలు బాగా వచ్చాయి: సీఎం
ఈ స్థాయిలో నీళ్లు వచ్చినా రాయలసీమ ప్రాజెక్టులు నింపడానికి చాలా సమయం  పడుతోంది: సీఎం
లోపాలు ఎక్కడున్నాయన్నది గుర్తించాలి: సీఎం
నీళ్లు వచ్చినప్పుడే వాటిని ఆదాచేసుకునే పరిస్థితి ఉండాలి:
తక్కువ రోజుల్లో వరద ఉన్నప్పుడు కూడా నింపే పరిస్థితి ఉండాలి:
ఎక్కడెక్కడ ఇబ్బందులు వచ్చాయో వాటిని గుర్తించండి:
వరదజలాలు 30–40 రోజలకు మించి ఉండవన్నది అంచనాతో ప్రణాళిక సిద్దంచేయండి: సీఎం
ఈ తక్కువ సమయంలోనే ప్రాజెక్టులు నింపాలి: సీఎం
రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు ఎందుకు వేగంగా పోవడంలేదో, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించండి: 
దేవుడి ఆశీర్వాదం వల్ల ఇప్పుడు రెండోసారి నీళ్లు వచ్చాయి:
ప్రతి ఏడాది ఇలా జరుగుతుందని అనుకోలేం:
ప్రస్తుతం ఉన్న రాయలసీమ ప్రాజెక్టులు 120 రోజులపాటు వరదజలాలను మళ్లించడానికి ఉద్దేశించినవన్న అధికారులు
30 రోజుల్లో వాటిని నింపే పరిస్థితి రావాలన్న సీఎం
రాయలసీమ ప్రాజెక్టులు సహా వెలగొండ ప్రాజెక్టులు ఆమేరకు సన్నద్ధంకావాలన్న సీఎం
ఆమేరకు ఏం చేయాలో.. ప్రణాళిక సిద్ధంచేయాలన్న సీఎం
సాగునీటి ప్రాజెక్టుల్లో స్కాంలు లేకుండా చూసుకోవాలన్న సీఎం
ఏ వర్కు చూసుకున్నా స్కామే కనిపిస్తుందన్న సీఎం
ఒక్కరూపాయి కూడా దుర్వినియోగం కాకుండా చూడాలన్న సీఎం


శ్రీశైలంలో 854 అడుగుల వద్ద పోతిరెడ్డిపాడు నుంచి కేవలం 6–8వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలమన్న అధికారులు: సీఎం
ఈసారి వరద కారణంగా జలయజ్ఞం తొలి ఫలితాలను అందుకున్నామన్న అధికారులు: సీఎం
పోతిరెడ్డిపాడు నుంచి తొలిసారిగా 44వేల క్యూసెక్కులకుపైగా వరదజలాలను తరలించామన్న అధికారులు
వెలుగోడు నుంచి కడపకు పోయే కాల్వ లైనింగ్‌ పూర్తికాలేదని, అందువల్ల రాయలసీమ ప్రాజెక్టులకు ఆశించినంత నీటిని తీసుకెళ్లలేకపోయామన్న అధికారులు
వెలిగొండ  ప్రాజెక్టు పనులను అడిగితెలుసుకున్న సీఎం
టన్నెల్‌ –1 ఇంకా 1.56 కిలోమీటర్ల పనిచేయాల్సి ఉంది
టన్నెల్‌ –2 పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి 
హెడ్‌ రెగ్యులేటర్‌ పనులుకూడా వేగవంతం చేయాలన్న సీఎం
వరద వచ్చినప్పుడు వీలైనన్ని జలాలు తరలించే అవకాశం లేకపోతే వాటి ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులు చిహ్నాలుగా మిగిలిపోతాయన్న సీఎం


గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతం సస్యశ్యామలం కావాలి: సీఎం
ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించాలి:సీఎం
వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తిచేయాలి: సీఎం
వరికపూడిశెల ప్రాజెక్టులో అన్ని విడతలూ ఒకేసారి పూర్తిచేయడానికి ప్రయత్నాలు చేయాలన్న సీఎం
ఇప్పటికి వచ్చి ఏప్రభుత్వమూ పల్నాడు ప్రాంతాన్ని పట్టించుకోలేదు:సీఎం
ఆ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది: సీఎం
గుంటూరు ఛానల్‌ పొడిగింపుపైనా సీఎం రివ్యూ
ఈ విషయంలో ముందుకు అడుగు వేయాలన్న సీఎం


పోలవరం ప్రాజెక్టు సహాయ పునరావాస పనులపై సీఎం సమీక్ష
దీనికోసమే ప్రత్యేక అధికారిని నియమించామన్న సీఎం
మొన్నటి వరదల్లో మునిగిన ప్రాంతాల ప్రజలకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం
వచ్చే సీజన్‌నాటికి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాలన్న సీఎం
ముంపు బాధితుల పట్ల ఉదారంగా ఉండాలన్న సీఎం
మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు సూచన


చింతలపూడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌పైనా సీఎం రివ్యూ
భూసేకరణలో సమస్య ఉందని నివేదించిన అధికారులు
600 ఎకరాలకుపైగా భూమిని సేకరించాలన్న అధికారులు
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష


ఒడిశాతో అభ్యంతరాలున్న ప్రాజెక్టులపై నోట్‌ ప్రిపేర్‌ చేయాలన్న సీఎం
ఒడిశా సీఎంతో చర్చలకు సన్నాహకాలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
అన్ని అభ్యంతరాలపై ఒక నోట్‌ ప్రిపేర్‌ చేయాలని అ«ధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం


తోటపల్లి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ను పూర్తిచేయాలని సీఎం ఆదేశం
తారకరామ సాగర్‌ ప్రాజెక్టు పనులు ముందుకుసాగడంలేదన్న అధికారులు
జంఝావతి ప్రాజెక్టుపైనా ఒడిశా అభ్యంతరాలు కారణంగా పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వలేకపోతున్నామన్న అధికారులు
దీనిపై నోట్‌ ప్రిపేర్‌ చేయాలన్న సీఎం


వంశధార ప్రాజెక్టుపైన సీఎం సమీక్ష
ముంపు ప్రాంతాలపై సంయుక్త సర్వేకు ఒడిశా ముందుకురాలేదన్న సీఎం
రక్షణగోడ, ఆర్‌ అండ్‌ ఆర్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందన్న అధికారులు
దీనిపై ఒక నోట్‌ సిద్ధం చేయాలన్న సీఎం
వంశధార కెనాల్‌ లైనింగ్‌ పెండింగులో ఉందన్న అధికారులు
డిస్ట్రిబ్యూటరీ నెట్‌ వర్క్‌ ఏర్పాటు చేయాల్సి ఉందన్న అధికారులు
ఈ సీజన్‌నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు
హిరమండలం నుంచి హైలెవల్‌ కెనాల్‌ పనులు చేయాల్సి ఉందన్న అధికారులు
నేరడి బ్యారేజీ  నిర్మాణానికి అన్ని ప్రయత్నాలూ చేద్దామన్న సీఎం
ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? అన్నదానిపై పరిశీలన చేయాలన్న సీఎం
మహేంద్ర తనయ చాలా ముఖ్యమైన ప్రాజెక్టు: సీఎం
ఉద్దానం ప్రాంతంలో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు అత్యంత కీలకం: సీఎం
మహేంద్రతనయను కూడా అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టుగా పెట్టుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం


జిల్లాల వారీగా ప్రాజెక్టులపై నివేదికలు సిద్ధంచేయండి: సీఎం
ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టడానికి ప్రణాళిక వేయండి: సీఎం
నాలుగేళ్లలో వాటిని పూర్తి చేయడంపై దృష్టిపెట్టండి: సీఎం
సహాయపునరావాస పనుల్లో ఉదారంగా ఉండండి: సీఎం
ముంపు ప్రాంతాల బాధితుల పట్ల మానవతా దృక్పథంలో వ్యవహరించండి: అధికారులకు సీఎం ఆదేశం


జిల్లాల మధ్య నీళ్లకోసం కొట్లాటలు ఉండకూడదన్న సీఎం
ఆప్యాయతలు పంచుకునే వాతావరణం ఉండాలన్న సీఎం
ఎక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి.. ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధంచేయాలన్న సీఎం
మూడు నాలుగేళ్లలో ప్రాధాన్యతా ప్రాజెక్టులన్నీ పూర్తికావాలని సీఎం ఆదేశం


ఆక్వా కారణంగా మంచినీటి కాల్వలు కలుషితం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది: సీఎం
ఎక్కడ మురుగునీటిశుద్ధి ప్లాంట్లు కావాలో అక్కడ ఏర్పాటు చేయాల్సి అవసరం ఉంది: సీఎం
ఈ కలుషిత నీటినే తాగి.. ప్రజలు తీవ్ర రోగాల బారిన పడుతున్నారు: సీఎం
ఇంతకుముందు అరుదుగా కనిపించే క్యాన్సర్‌ వ్యాధి ఇప్పుడు పరిపాటిగామారింది: సీఎం
ప్రతీదీ కలుషితం అవుతోంది: సీఎం


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image