స్కూళ్ల అభివృద్ధి పై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష

11–09–2019
అమరావతి


అమరావతి: స్కూళ్లను అభివృద్ధి చేయడంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
ప్రతి మండలానికీ జూనియర్‌ కాలేజీ ఉండాలి: సీఎం
ఆమేరకు భవిష్యత్‌ కార్యాచరణ సిద్ధంచేయండి: సీఎం
ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లను క్రమపద్ధతిలో ప్లస్‌ టూ వరకూ పెంచాలన్న సీఎం
జూనియర్‌ కాలేజీ స్థాయికి వీటిని తీసుకు వెళ్లాలన్న సీఎం
ఎక్కడెక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి, ఏ ప్రాంతాల్లో చేయాలన్నదానిపై ఒక ప్లాన్‌ సిద్ధం చేయాలన్న సీఎం
ప్రస్తుతం ప్రతి నియోజకవర్గానికి ఒక కాలేజీ చొప్పున బాగుచేయడంపై ప్రణాళిక వేయాలన్న సీఎం
స్కూళ్ల తరహాలోనే కార్యాచరణ ప్రణాళిక తీసుకోవాలన్న సీఎం


నాడు– నేడు కింద 44,512 పాఠశాలలను బాగుచేయనున్న ప్రభుత్వం
మొదటి విడతలో 15410 స్కూళ్లలో నాడు – నేడు కార్యక్రమం
9 రకాల కనీస వసతులను కల్పించనున్న ప్రభుత్వం 
పంచాయతీరాజ్, మున్సిపల్, ట్రైబల్, సోషల్, బీసీ వెల్ఫేర్‌ ఇలా అన్ని శాఖలకు చెందిన స్కూళ్లు కూడా ప్రతి దశలో ఉండేలా చూసుకోవాలన్న సీఎం
తొలిదశలో టార్గెట్‌ పెరిగినా పర్వాలేదన్న సీఎం
ఏ స్కూల్‌ తీసుకున్నా 9 రకాల పనులు తప్పనిసరిగా పూర్తికావాలన్న సీఎం
చేపట్టే పనుల్లో నాణ్యత ఉండాలని, దాంట్లో రాజీపడవద్దని స్పష్టంచేసిన సీఎం


మార్చి 14, 2020 నాటికి నాడు–నేడు కింద తొలిదశ స్కూళ్లలో చేపట్టిన పనులు పూర్తిచేస్తామన్న అధికారులు
స్కూళ్లలో చేపడుతున్న పనులకు విద్యా కమిటీల రాటిఫికేషన్‌ ఉండేలా చూడాలన్న సీఎం
విద్యా కమిటీలు సామాజిక తనిఖీ చేయాలన్న సీఎం


స్కూళ్ల బాగుకోసం ప్రభుత్వం తీసుకుంటున్న  చర్యలను తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారంటూ సీఎం దృష్టికి తీసుకు వచ్చిన అధికారులు
బడుల బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులదే అన్న భావన కలిగించాలన్న సీఎం
స్కూళ్లను అభివృద్ధిచేయడంలో పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలన్న సీఎం
స్కూళ్ల బాగుకోసం క్యాంపెయిన్‌ చేయనున్న ప్రభుత్వం
విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చూడనున్న ప్రభుత్వం


వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 8 వ తరగతి వరకూ ఇంగ్లిషు మాధ్యమంలో బోధన
దాని తర్వాత 9, 10 తరగతులకూ ఇంగ్లిషు మాధ్యమంలో బోధన
70వేలమంది టీచర్లకు ఇంగ్లిషు బోధనలో శిక్షణ
డైట్స్‌లో ఇంగ్లిషు బోధనపై శిక్షణ ఇచ్చేలా, డైట్స్‌ను బలోపేతం చేసేలా ఒక ఆలోచన చేయాలన్న సీఎం
టీచర్లకు ఇచ్చిన శిక్షణపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం


విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడానికి కసరత్తు చేస్తున్నామన్న అధికారులు
ఖాళీల భర్తీ పక్రియను ప్రతి ఏడాది జనవరిలో పూర్తిచేయాలన్న సీఎం
ఏ శాఖ ఏ పరీక్షలు పెట్టాలన్నా జనవరిలో పెట్టాలని సీఎం సూచన
పర్యావరణం, క్లైమేట్‌ ఛేంజ్, రహదారి భద్రతపై పాఠ్యాంశాలు ఉంచాలన్న సీఎం
పుస్తకాలు, యూనిఫారమ్స్, షూ, స్కూలు బ్యాగు ఇవన్నీకూడా వచ్చే ఏడాది స్కూల్లో చేరిన రోజే ఇవ్వాలన్న సీఎం
ఎక్కడా ఆలస్యం కాకుండా ప్రణాళిక ఉండాలన్న సీఎం


ప్రయివేటు కాలేజీలకు అనుమతి ఇవ్వడం లేదన్నది అవాస్తవం: సీఎం
కాకపోతే అక్కడ  సరైన మౌలిక సదుపాయాలు, ఉన్నాయా? లేదా? అన్నది చూస్తున్నాం
ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నప్పుడు ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లలో కూడా సరైన సదుపాయాలు ఉండాలి: సీఎం
అలా ఉన్నప్పుడు ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు: సీఎం
కనీస ప్రమాణాలు, వసతులు లేకుండా ఏ విద్యా  సంస్థ అయినా ఉండడం సరికాదు: సీఎం
ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది, ప్రయివేటు సంస్థలు చేయాల్సిన పనులు వాళ్లు చేయాలి: సీఎం


మధ్యాహ్న భోజనం కింద ఇస్తున్న కోడిగుడ్ల నుంచి గతంలో బాగా నెగెటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ వచ్చిందన్న అధికారులు
అందుకే ప్రభుత్వం వచ్చాక గుడ్ల పంపిణీని వికేంద్రీకరించామన్న సీఎం
నాణ్యమైన గుడ్లు విద్యార్థులకు అందేలా ఇంకా ఎలాంటి విధానాలు అనుసరించాలన్నదానిపై మరిన్ని ఆలోచనలు చేయాలన్న సీఎం
అన్‌ ఇన్‌కంబర్డ్‌ బ్యాంకు ఖాతాలను తెరిచే బాధ్యత గ్రామ వాలంటీర్లదే : సీఎం


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు