వింజమూరు :
. 3 నెలల క్రితం హాస్టల్ నుండి మనస్థాపంతో అలిగి వెళ్ళిపోయిన వింజమూరు బి.సి కాలనీకి చెందిన కార్తీక్ అనే విధ్యార్ధిని వింజమూరు పోలీసులు ఎట్టకేలకు వింజమూరుకు తీసుకువచ్చారు. విధ్యార్ధి కార్తీక్ తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ దాఖలు చేసి ఉన్నందున న్యాయస్థానం ద్వారా అతనిని వారి తల్లిదండ్రులకు అప్పగించనున్నామని ఎస్.ఐ బాజిరెడ్డి తెలిపారు.