తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ పాల్గొన్న కృష్ణా,గుంటూరు జిల్లాల టిడిపి నాయకులు ‘‘ ఇసుక కృత్రిమ కొరత-వైసిపి ప్రభుత్వ హత్యలకు’’ నిరసనగా ఈ నెల 14న విజయవాడలో 12గంటల దీక్ష. 35లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సమస్యపై వైసిపి నేతల నిర్లక్ష్యం. ఇంత పెద్ద ఎత్తున ఆత్మహత్యలు గతంలో రాష్ట్ర చరిత్రలో లేవు. ఇన్ని ఆత్మహత్యాయత్నాలు రాష్ట్రంలో మున్నెన్నడూ జరగలేదు. స్పందనలో వినతులు ఇచ్చిన చేతులతోనే పురుగుమందు తాగుతున్నారు. ఎమ్మార్వో,ఎండివో కార్యాలయాలకు పెట్రోల్ సీసాలతో వెళ్తున్నారు. వైసిపి వేధింపులు భరించలేకే ఆవేదనతో జనం ఈ పనులకు పాల్పడుతున్నారు. ఈ పెడ ధోరణులకు వైసిపి నేతల అరాచకాలే కారణం. నిన్న పెద్దడోర్నాలలో ఇద్దరు మహిళా ఉద్యోగుల ఆత్మహత్యాయత్నాలు బాధాకరం. ఉద్యోగాలు తొలగిస్తామన్న వేధింపులే దీనికి కారణం. పేదల కడుపుకొట్టి వైసిపి కార్యకర్తల పొట్టలు నింపుతున్నారు. వీవోఏల జీతాలు ఒక చేత్తో పెంచారు, మరో చేత్తో వారిని ఉద్యోగాలనుంచి తీసేస్తున్నారు. వైసిపి కార్యకర్తలకు ఉద్యోగాల కోసం మరొకరి పొట్ట కొట్టడం అమానుషం. డ్వాక్రా సంఘాలను స్వతంత్రంగా పనిచేసేలా టిడిపి ప్రభుత్వం చేసింది. ఎన్టీఆర్ హయాంలోనే మ్యాక్స్ చట్టం తెచ్చాం. దీని ప్రకారం ఆయా సంఘాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదు. నిర్ణయాలను ఆయా సంఘాలే స్వతంత్రంగా తీసుకోవాలి. 20ఏళ్లుగా పనిచేస్తున్నవాళ్లను తొలగించడం అన్యాయం. 6,400మంది పశుసఖిలను రోడ్డుమీదకు నెట్టారు. 27వేల సంఘమిత్రల జీవితాలతో ఆడుకుంటున్నారు. వారం రోజులుగా పశుసఖిలు నిరాహార దీక్షలు చేస్తున్నా స్పందన లేదు. మహిళా సాధికారత కోసం టిడిపి చేసిన కృషిని నీరుగార్చారు. ఇసుక కొరత అనేది గతంలో ఏపి చరిత్రలోనే లేదు. ఆహార కొరత, విద్యుత్ కొరత, గ్యాస్ కొరత, నీటి కొరత విన్నాం కానీ, ఇసుక కొరత ఇప్పుడే చూస్తున్నాం. లేని ఇసుక కొరత సమస్యను వైసిపి నేతలే సృష్టించారు. తమ అక్రమార్జనలకు ఇసుకను ఆదాయ వనరుగా చేశారు. ఎరువులు, పురుగు మందుల బ్లాక్ మార్కెటింగ్ గురించి గతంలో విన్నాం. ఇసుక బ్లాక్ మార్కెటింగ్ గురించి ఇప్పుడే చూస్తున్నాం. 5రెట్ల అధిక ధరలకు ఇసుక విక్రయాలు చేస్తున్నారు. తీయాల్సిన దానికన్నా 5రెట్లు తక్కువ తీస్తున్నారు. కృత్రిమ కొరతను ,బ్లాక్ లో విక్రయాలను ప్రోత్సహించారు. విజయవాడ దీక్ష ప్రకటన చేశాక ఇసుక అందుబాటు స్వల్పంగా పెంచారు. 14నుంచి ఇసుక వారోత్సవాల ప్రకటన అందులో భాగమే. వైసిపి నేతలే చెన్నై,బెంగళూరు,హైదరాబాద్ కు ఇసుక అక్రమ రవాణా. లారీ ఇసుక రూ.80వేల నుంచి రూ.లక్షకు అమ్మడం చరిత్రలో ఉందా...? వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై టిడిపి రాజీలేని పోరాటం. భవన నిర్మాణ కార్మికులకు అండగా టిడిపి ఉంటుంది. వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై టిడిపి పోరాట కమిటి ఏర్పాటు. ఇసుక కొరతపై బొండా ఉమామహేశ్వర రావు నేతృత్వంలో టిడిపి పోరాట కమిటి ఏర్పాటు. సభ్యులుగా అచ్చెన్నాయడు, రామానాయుడు,వర్ల రామయ్య,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అఖిలప్రియ,ఆలపాటి రాజేంద్ర ప్రసాద్,బండారు సత్యనారాయణ మూర్తి. ఈ నెల 14న ఇసుక దీక్షతో అయినా వైసిపి ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. మొద్దునిద్ర నుంచి వైసిపి నేతలు మేల్కొనాలి.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
పాల్గొన్న కృష్ణా,గుంటూరు జిల్లాల టిడిపి నాయకులు
'' ఇసుక కృత్రిమ కొరత-వైసిపి ప్రభుత్వ హత్యలకు'' నిరసనగా ఈ నెల 14న విజయవాడలో 12గంటల దీక్ష. 
35లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సమస్యపై వైసిపి నేతల నిర్లక్ష్యం.
ఇంత పెద్ద ఎత్తున ఆత్మహత్యలు గతంలో రాష్ట్ర చరిత్రలో లేవు. ఇన్ని ఆత్మహత్యాయత్నాలు రాష్ట్రంలో మున్నెన్నడూ జరగలేదు. 
స్పందనలో వినతులు ఇచ్చిన చేతులతోనే పురుగుమందు తాగుతున్నారు. ఎమ్మార్వో,ఎండివో కార్యాలయాలకు పెట్రోల్ సీసాలతో వెళ్తున్నారు. వైసిపి వేధింపులు భరించలేకే ఆవేదనతో జనం ఈ పనులకు పాల్పడుతున్నారు. ఈ పెడ ధోరణులకు వైసిపి నేతల అరాచకాలే కారణం.
నిన్న పెద్దడోర్నాలలో ఇద్దరు మహిళా ఉద్యోగుల ఆత్మహత్యాయత్నాలు బాధాకరం. ఉద్యోగాలు తొలగిస్తామన్న వేధింపులే దీనికి కారణం.
పేదల కడుపుకొట్టి వైసిపి కార్యకర్తల పొట్టలు నింపుతున్నారు.
వీవోఏల జీతాలు ఒక చేత్తో పెంచారు, మరో చేత్తో వారిని ఉద్యోగాలనుంచి తీసేస్తున్నారు. 
వైసిపి కార్యకర్తలకు ఉద్యోగాల కోసం మరొకరి పొట్ట కొట్టడం అమానుషం.
డ్వాక్రా సంఘాలను స్వతంత్రంగా పనిచేసేలా టిడిపి ప్రభుత్వం  చేసింది. ఎన్టీఆర్ హయాంలోనే మ్యాక్స్ చట్టం తెచ్చాం. దీని ప్రకారం ఆయా సంఘాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదు.  
నిర్ణయాలను ఆయా సంఘాలే స్వతంత్రంగా తీసుకోవాలి. 20ఏళ్లుగా పనిచేస్తున్నవాళ్లను తొలగించడం అన్యాయం.
6,400మంది పశుసఖిలను రోడ్డుమీదకు నెట్టారు. 27వేల సంఘమిత్రల జీవితాలతో ఆడుకుంటున్నారు. వారం రోజులుగా పశుసఖిలు నిరాహార దీక్షలు చేస్తున్నా స్పందన లేదు. మహిళా సాధికారత కోసం టిడిపి చేసిన కృషిని నీరుగార్చారు.
ఇసుక కొరత అనేది గతంలో ఏపి చరిత్రలోనే లేదు. ఆహార కొరత, విద్యుత్ కొరత, గ్యాస్ కొరత, నీటి కొరత విన్నాం కానీ, ఇసుక కొరత ఇప్పుడే చూస్తున్నాం. లేని ఇసుక కొరత సమస్యను వైసిపి నేతలే సృష్టించారు. తమ అక్రమార్జనలకు ఇసుకను ఆదాయ వనరుగా చేశారు.
 ఎరువులు, పురుగు మందుల బ్లాక్ మార్కెటింగ్ గురించి గతంలో విన్నాం. ఇసుక బ్లాక్ మార్కెటింగ్ గురించి ఇప్పుడే చూస్తున్నాం. 5రెట్ల అధిక ధరలకు ఇసుక విక్రయాలు చేస్తున్నారు. తీయాల్సిన దానికన్నా 5రెట్లు తక్కువ తీస్తున్నారు. కృత్రిమ కొరతను ,బ్లాక్ లో విక్రయాలను ప్రోత్సహించారు. 
విజయవాడ దీక్ష ప్రకటన చేశాక ఇసుక అందుబాటు స్వల్పంగా పెంచారు. 14నుంచి ఇసుక వారోత్సవాల ప్రకటన అందులో భాగమే.
వైసిపి నేతలే చెన్నై,బెంగళూరు,హైదరాబాద్ కు ఇసుక అక్రమ రవాణా. లారీ ఇసుక రూ.80వేల నుంచి రూ.లక్షకు అమ్మడం చరిత్రలో ఉందా...?
వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై టిడిపి రాజీలేని పోరాటం. భవన నిర్మాణ కార్మికులకు అండగా టిడిపి ఉంటుంది.
వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై టిడిపి పోరాట కమిటి ఏర్పాటు. 
ఇసుక కొరతపై బొండా ఉమామహేశ్వర రావు నేతృత్వంలో టిడిపి పోరాట కమిటి ఏర్పాటు. సభ్యులుగా అచ్చెన్నాయడు, రామానాయుడు,వర్ల రామయ్య,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అఖిలప్రియ,ఆలపాటి రాజేంద్ర ప్రసాద్,బండారు సత్యనారాయణ మూర్తి.
ఈ నెల 14న ఇసుక దీక్షతో అయినా వైసిపి ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. 
మొద్దునిద్ర నుంచి వైసిపి నేతలు మేల్కొనాలి.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
కరోనా నియంత్రణలో విజయవాడ నగరాన్ని రాష్టానికే  ఆదర్శంగా ఉండేలా చేయాలి: సిఎస్ నీలం సాహ్ని
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image