గుంటూరు జిల్లా...
పొన్నూరు లో నారా లోకేష్
టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక 1400 రూపాయలకే వచ్చింది.
అవినీతి లేని కొత్త విధానం అని ప్రకటించి జగన్ గారు
ట్రాక్టర్ ఇసుక ఆరు వేలకు పెంచేసారు.లారీ ఇసుక 40 వేల నుండి 70 వేలకు అమ్ముకుంటున్నారు
వైకాపా ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ ఇసుక కొరత వలన 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు
భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంది
ఆత్మహత్యలను అపహాస్యం చేస్తూ మంత్రులు మాట్లాడుతున్నారు
ఒక మంత్రి అయితే ఏకంగా పోలీసులే అక్రమ ఇసుక రవాణా ప్రోత్సహిస్తున్నారు అని మాట్లాడుతున్నారు
భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం దేశంలొనే ఇదే ప్రధమం..
వైకాపా నాయకులు ప్రయోజనాల కోసమే ఇసుక కొరత సృష్టించారు.
వరదలున్న ఇతర రాష్ట్రాల్లో లేని ఇసుక కొరత మన రాష్ట్రంలోనే ఎందుకుంది.
ప్రభుత్వ చేతగాని తనం వల్లే ఇసుక కొరత.
వరద వలన ఇసుక లేదు అని చెబుతూ బెంగుళూరు,చెన్నై,హైదరాబాద్ కి ఇసుక తరలించి బ్లాక్ లో అమ్ముకుంటున్నారు
ఆధారాలతో సహా వైకాపా ఇసుక మాఫియా గుట్టు రట్టు చేసాం
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు అంటున్న ప్రభుత్వం ముందు వారి నాయకులు చేస్తున్న అక్రమ రవాణా ని అడ్డుకోవాలి
ఇసుక కోసం వైసిపి నేతల మధ్య నెలకొన్న వివాదాలను ముఖ్యమంత్రే పరిష్కరిస్తున్నారు..
నేను దీక్ష చేస్తే డైటింగ్ దీక్ష అని విమర్శించారు..
ఇసుక కొరత లేదని చేప్తూనే ఇసుక వారోత్సవాలు అంటున్నారు.
ఉపాధి కోల్పోయిన కార్మికులకు పదివేలు ఇవ్వాలి.
చనిపోయిన కుటుంబానికి పాతిక లక్షలు పరిహారం ఇవ్వాలి.
ఉచిత ఇసుక పాలసీని తిరిగి తీసుకురావాలి.
కార్మికుల ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలే