డిసెంబర్ 28, 29 తేదీలలో విశాఖ ఉత్సవ్ 

డిసెంబర్ 28, 29 తేదీలలో విశాఖ ఉత్సవ్ 


రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక  శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాస రావు



వచ్చేనెల   28, 29 తేదీలలో విశాఖ ఉత్సవ్ని ర్వహిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక  శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాస రావు తెలిపారు.
సోమవారం నాడు  స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఆయన విశాఖ ఉత్సవ్ పోస్టర్ ను  విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఉత్సవ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు.
 విశాఖ నగరానికి, జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని, భారతదేశానికి ముంబై నగరం ఎలాగో, ఆంధ్ర ప్రదేశ్ కు వైజాగ్ అలాంటిదని ఆయన తెలిపారు.
విశాఖ ఉత్సవ్ ను ప్రతిరోజు లక్షమంది పర్యాటకులు సందర్శించే లా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.


  భీమిలి  ఉత్సవాన్ని ప్రతిరోజు దాదాపు  30 వేల మంది  సందర్శించారని తెలిపారు.
ఉత్సవానికి ప్రధాన వేదికగా ఆర్కే బీచ్ ఉంటుందని తెలిపారు.
సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఆర్కే బీచ్ లో ప్రధాన వేదిక,  నోవాటెల్ హోటల్ ఎదురుగా జాతర వేదికను, స్థానిక కళాకారుల కోసం ప్రత్యేకంగా వైయస్సార్  సిటీ సెంట్రల్ పార్క్ లో మరొక వేదికను  ఏర్పాటు చేసినట్టు  తెలిపారు.
స్థానికుల మనోభావాలు గౌరవించేలా, గుర్తించేలా ఉత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.


వైయస్సార్ సిటీ సెంట్రల్ పార్క్ లో ఫ్లవర్ షో  ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
కార్నివాల్లో 10 వేల మంది విద్యార్థులు, 500 మంది జానపద కళాకారులు, వివిధ ప్రభుత్వ శాఖల శకటాలను ప్రదర్శిస్తామని తెలిపారు.
ఆర్కే బీచ్ ప్రధాన వేదిక వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు పర్యాటకులు చూసేందుకు ఎగ్జిబిషన్ స్టాల్స్ ను,  ఫుడ్ కోర్టులను, ఇంకా అమ్యూజ్మెంట్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
జిల్లాలోని యువత వేడుకల్లో పాల్గొనేలా బాక్సింగ్, బాడీ  బిల్డింగ్,
కబాడీ, బీచ్ వాలీబాల్ క్రీడలలో పోటీలను నిర్వహించి, విజేతలకు  బహుమతులు ఇస్తామని తెలిపారు.
ఆధ్యాత్మిక  పర్యాటకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల నమూనాలను పర్యాటకుల కోసం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఎకో  టూరిజం ప్రోత్సహించడానికి గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా  స్టాళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఏటికొప్పాక బొమ్మలు, అరకు కాఫీ,  అనకాపల్లి బెల్లం, మాడుగుల హల్వా, చింతపల్లి చింతపండు    స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు


పర్యాటకుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ,  టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ప్రైవేటు  టూరు ఆపరేటర్ల  సహకారంతో ప్రత్యేక సిటీ టూర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
నగరంలోని అన్ని పర్యాటక స్థలాలను సందర్శించడానికి ప్రజలకు ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు.
బీచ్ రోడ్డులో లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్టు  తెలిపారు.
ఇతర జిల్లాలు, రాష్ట్రాలలో, విదేశాలలో ఉన్న విశాఖ వాసులు  ఈ ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతున్నామని తెలిపారు.


 వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పండుగ వాతావరణంలో ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.


జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు.


నగర పోలీస్ కమిషనర్ ఆర్ కె మీనా మాట్లాడుతూ ఉత్సవాలను సందర్శించడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.


ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబురావు,  యు వి రమణ మూర్తి రాజు, కరణం ధర్మశ్రీ, కె. భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.


పర్యాటక శాఖ ప్రాంతీయ  సంచాలకులు రాధాకృష్ణమూర్తి, జిల్లా పర్యాటక అధికారి పూర్ణిమా దేవి ఇతర అధికారులు పాల్గొన్నార


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image