అమరావతిలో అభివృద్ధి ఎక్కడ జరిగింది?

అమరావతిలో అభివృద్ధి ఎక్కడ జరిగింది?
అమరావతి :  గత ఐదేళ్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో గ్రాఫిక్స్‌తో కాలం గడిపారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఏపీ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని సూటిగా ప్రశ్నించారు. నేడు రాజధాని రైతలు చంద్రబాబును ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పలేదని తెలిపారు. గత ఐదేళ్లు హాలీవుడ్‌ సినిమాల్ని తలదన్నేలా గ్రాఫిక్స్‌ చూపించారని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పిన దానికి, చేసిన దానికి పొంతన లేదని ఆరోపించారు. అమరావతిపై మాట్లాడుతున్న చంద్రబాబు.. రాజధాని ప్రకటనపై నోటిఫికేషన్‌ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ప్రపంచంలో ఎక్కడైనా కేంద్రీకరణ ఉందా అని బుగ్గన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రపంచమంతా వికేంద్రీకరణ విధానాలను అమలు చేస్తున్నారని చెప్పారు. 40 ఏళ్ల అనుభవం అంటే ఇదేనా అని చంద్రబాబును ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో రాజధాని టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయని చెప్పారు. రూ. 5వేల కోట్లు ఖర్చు పెట్టి రూ. 52 కోట్లకు టెండర్లు పిలుస్తారా అని ప్రశ్నించారు. రూ. 5వేల కోట్లు కూడా బ్యాంక్‌ల నుంచి అప్పుగా తెచ్చారని మండిపడ్డారు. కి.మీ రోడ్డుకు రూ. 46 కోట్లకు టెండర్‌ ఇచ్చారని.. ఏమైనా స్వర్గానికి రోడ్డు వేస్తున్నారా అని నిలదీశారు. అడుగు నిర్మాణానికి రూ. 6,999కు టెండర్‌ ఇచ్చారని మండిపడ్డారు. కేవలం రూ. 277 కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు అమరావతి గురించి మాట్లాడతారా అని  ప్రశ్నించారు. ఆస్తులన్నీ అమ్ముకుంటామని చంద్రబాబే చెప్పారని.. అదేమైనా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమా అని​ నిలదీశారు. ఎల్లో మీడియా ఉందని ఇష్టమొచ్చినట్టు చెప్పుకుంటూ పోతున్నారని విమర్శించారు. 
చంద్రబాబు అవినీతిని బయటపెడతాం : చంద్రబాబు అవినీతికి సంబంధించిన ఆధారాలు త్వరలోనే బయటపెడతామని అన్నారు. ప్రపంచబ్యాంకు, ఏఐఐబీలకు అప్పు అడగడానికి వెళ్తే.. టెండర్లలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలను వారు ప్రశ్నించలేదా అని నిలిదీశారు. 3 ప్యాకేజీల కోసం 4 కంపెనీలు టెండర్లు వేస్తే.. అన్నింటిలో ఒకేలా బిడ్‌లు వేశారని తెలిపారు. చంద్రబాబు వల్లే హైదరబాద్‌లో ఐటీ పరిశ్రమ అబివృద్ధి చెందలేదన్నారు. హైటిక్‌ సిటీ బిల్డింగ్‌ కడితే హైదరాబాద్‌ను కట్టినట్టా అని ఎద్దేవా చేశారు. 
విశాఖపై చంద్రబాబుకు ఎందుకంత కోపం? : విశాఖపట్నంపై చంద్రబాబుకు ఎందుకంత కోపమని బుగ్గన నిలదీశారు. విశాఖను ఎందుకు అభివృద్ధి చేయలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. గతంలో రాజధాని వచ్చిన మేధాపాట్కర్‌ను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఎన్నికలకు మూడేళ్ల ముందే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడ ఇళ్లు కట్టుకున్నారని గుర్తుచేశారు. చంద్రబాబు ఎందుకు ఇళ్లు కట్టుకోలేదో చెప్పాలన్నారు. రాజధానికి, సింగపూర్‌ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. సింగపూర్‌లోని వ్యాపార సంస్థ మాత్రమే ఇక్కడకు వచ్చిందని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాల ద్వారా మానవ అభివృద్ధికి పాటుపడుతున్నారని.. మానవ అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు.


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image