ఏపీ ఎఫ్డీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయ్ చందర్

ఏపీ ఎఫ్డీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయ్ చందర్
* వైఎస్సార్ ఆత్మే.. జగన్: విజయ చందర్
* 3, 4 దశాబ్దాల క్రితమే బయోపిక్స్ చేసిన వ్యక్తి: జీవీడీ కృష్ణమోహన్
* ఏపీలో సినీరంగం సుస్థిరతకు కృషి: టి.విజయ్‌కుమార్ రెడ్డి
విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ (ఏపీ ఎఫ్డీసీ) చైర్మన్గా ప్రముఖ సినీ నటులు టి.యస్. విజయ్ చందర్ గురువారం నాడు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న సినీ ప్రముఖులు, ఆంధ్ర రాష్ట్ర ప్రముఖులు మాతృభూమి అభివృద్ధికి తోడ్పాటును అందించాలని.. కన్న గడ్డ పిలుస్తోందని విజయ చందర్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనపై పెట్టిన బాధ్యతను చేసి చూపెడతానని ధీమా వ్యక్తం చేశారు.  
విజయవాడలోని ఆర్టీసీ ఆడ్మినిస్ట్రేటివ్ భవన్ లో గల ఎఫ్డీసీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు అనంతరం విజయ్ చందర్ బాధ్యతలను స్వీకరించారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ ఎండీ, సమాచార-పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ కుమార్ రెడ్డి, ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ లు పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియాసమావేశంలో విజయ్ చందర్ మాట్లాడుతూ... స్వాతంత్ర్యం రాకముందే నుంచి చదువుకునే రోజుల్లోనే కాంగ్రెస్ జెండా పట్టుకుని తిరిగానన్నారు.  దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. వైఎస్ఆర్ ని కలిసిన ప్రతిసారి ఆప్యాయతగా పిలిచేవారని, యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారని తెలిపారు. ఎప్పుడు, ఎక్కడ కలిసినా.. ఏం పని మీద వచ్చావని వైఎస్ అడిగేవారని.. మీ నవ్వు చూసి వెళ్లిపోవాలని వచ్చానని చెప్పేవాడనని అన్నారు. అలాగే విమానంలో ప్రయాణంలో ఒక్కసారిగా నా వెనక నుండి భుజం తట్టేసరికి.. వైఎస్ఆర్ ని చూసి ఆనందంతో తేలానని చెప్పారు. 20 సంవత్సరాల క్రితమే మీరు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని ఆయనతో చెప్పాను. నీ కోరిక ఏంటని వైఎఎస్సా్ర్ అడిగితే... 20 సంవత్సరాల క్రితమే ఎఫ్డీసీ ఛైర్మన్ కావాలని అడిగాను. మొదటిసారి సీఎం అయినప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పదవి ఇవ్వలేకపోయారు. రెండో సారి సీఎం అయినప్పుడు.. నీ మాట నేను మర్చిపోలేదని 3 నెలల్లో నీవు కోరుకున్న పదవి ఇస్తానని వైఎస్సార్ చెప్పారు. రాజశేఖర్ రెడ్డికి మరణం లేదు. ఆయన ఆత్మ ఎప్పుడూ మన చుట్టూనే తిరుగుతుంది. అటువంటి మహానాయకుడి తనయుడిగా.. మడమ తిప్పని నాయకుడుగా జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో 151 సీట్లతో ప్రభంజనం సృష్టించారు. వైఎస్సార్ ఆత్మే జగన్ గారి ద్వారా నా కల నేరవేరింది. పేదలపాలిట వరంగా జగన్ వచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్.. జగన్.. అంటూ ఆయన పేరు మారుమ్రోగుతుందని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి, విజయమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం విడిపోయి తర్వాత 5 సంవత్సరాలలో  అవతరణ దినోత్సవం చేయలేదని... జగన్ సీఎం అయ్యాక తొలిటిసారిగా రాష్ట్ర అవతరణ దినోత్సవం చేయడం అభినందనీయం అన్నారు. రాష్ట్రం రకరకాలుగా మోసపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వీఆర్, నాగయ్య, కన్నాంబ, సావిత్ర, శారద వంటి వారు ఎంతో గొప్ప కళాకారులు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగు వారి ఖ్యాతిని ఇనుమడింపజేశారని కొనియాడారు. నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రవారికి తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. మాతృభూమి రుణం తీర్చుకోవడానికి తెలుగు వారు సహాయ పడాలని, కన్నగడ్డ పిలుస్తోందని పిలుపునిచ్చారు. త్వరలోనే హైదరబాద్ వచ్చి ప్రముఖులను కలుస్తానని  తెలిపారు. అలాగేఏపీ ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని, 4 సంవత్సరాలలో విజయం సాధించి తీరుతారని విజయ్ చందర్ చెప్పారు. 
                        ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ మాట్లాడుతూ.. సినీరంగంలో విజయ చందర్ గురించి ప్రత్యేక చెప్పాల్సిన  పనిలేదని.. 3, 4 దశాబ్ధాల క్రితమే బయోపిక్స్ లో నటించిన వ్యక్తి అని కొనయాడారు. ఆయన చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతారన్నారు. ఏపీ, మద్రాసు రాష్ట్రాలు విడిపోయినప్పుడు అనేక ఆలోచనలు చేశారని గుర్తుచేశారు. ముక్కుసూటికి వెళ్లే మనస్తత్వం అని.. ముందు ఒక మాట మాట్లాడి, వెనక ఒక మాట మాట్లాడే వ్యక్తిత్వం లేని వ్యక్తి విజయ్ చందర్ అని చెప్పారు. ఎఫ్డీసీ ఎండీ, సమాచార-పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కరుణామయుడుగా, షిర్డీ సాయిబాబాగా పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్న విజయ చందర్ తెలుగు ప్రజలందరికీ సుపరిచితమేనని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేయడానికి సినిమా రంగం దోహదపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సినీరంగం సుస్థిరం పర్చడానికి, మౌలిక సదుపాయాలు అభివృద్ధిచేయడానికి, సినిమా అవార్డులు, మంచి సినిమాలను నిర్మిస్తే ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి అంశాలతో సినిమా పాలసీ తయారుచేసే విధంగా ఎఫ్డీసీ ముందుకెళ్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ జనరల్ మేనేజర్ శేష సాయి, సినియర్ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రముఖలు, సినీ రంగ ప్రముఖులు తదితరులు ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపారు.


Popular posts
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
సిమెంట్ ధరల వ్యత్యాసం నియంత్రణ కు "వైయస్ఆర్ నిర్మాణ్” ప్రారంభం
Image
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image