మద్య నియంత్రణ దిశగా మరో కీలక అడుగు

మద్య నియంత్రణ దిశగా మరో కీలక అడుగు
*ఇప్పుడున్న బార్లను 40 శాతం తగ్గించాలని నిర్ణయం
*ఇప్పటికే 20 శాతం మద్యం దుకాణాల తగ్గింపు
*బార్లు, స్టార్‌ హోటళ్లలో మద్యం వేళలు 2 గంటలు కుదింపు
*మద్యాన్ని స్మగ్లింగ్‌ చేసినా, కల్తీచేసినా, తయారుచేసినా కఠిన చర్యలు
*నాన్‌బెయిల్‌ బుల్‌ కేసులు, 6 నెలల జైలుశిక్ష
*ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టానికి పదును
*ఇసుక అక్రమాలపై కూడా కఠినచర్యల కోసం చట్టం
*సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ నిర్ణయం
అమరావతి: అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడిచే కార్యక్రమంలో భాగంగా, కుటుంబాల్లో ఆప్యాయతలను పెంచడానికి మద్యపాన నియంత్రణ, నిషేధ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్య నిషేధం కోసం దశలవారీగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి ఇప్పుడున్న బార్ల సంఖ్యలో 40 శాతం తగ్గించాలని నిశ్చయించారు. 
మద్యం పాలసీ తదుపరి చర్యల్లో ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు తీసుకుంటున్న చర్యలను, ఇకపై తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో సమగ్రంగా చర్చించారు. బార్ల సంఖ్యను కుదించడంపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో 38 స్టార్‌ హోటళ్లలో, 4 పబ్బుల సహా మొత్తం 839 మంది బార్ల నిర్వహణకు లైసెన్స్‌లు తీసుకున్నారని వివరించారు. ఆతిథ్యరంగానికి సంబంధించిన స్టార్‌ హోటళ్లు, పబ్బులు మినహాయిస్తే 797 చోట్ల బార్లు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. వీటిలో సగానికిపైగా బార్లు తగ్గించాలని సీఎం సూచించారు. దీనిపై అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. మద్యంపాలసీలో భాగంగా ఇప్పటికే 20శాతం దుకాణాలను తగ్గించామని, 4380 దుకాణాలను, 3500కు కుదించామన్నారు. మద్య నియంత్రణ కార్యక్రమాన్ని దశలవారీగా చేపడుతున్నందున బార్ల సంఖ్యను కూడా దశలవారీగా కుదించుకుంటూ వద్దామంటూ ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై సమీక్షా సమావేశంలో చాలాసేపు చర్చ జరిగింది. చివరకు 797 బార్లలో 40 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. వీటికి కొత్తగా లైసెన్స్‌లు జారీచేయడంతోపాటు, లాటరీ పద్ధతిలో బార్లను కేటాయించాలని నిశ్చయించారు. మద్యం ముట్టుకుంటే షాక్‌ కొడుతుందన్న భావన ఉండాలని, అప్పుడే చాలామంది దానికి దూరం అవుతారని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆ మేరకు అప్లికేషన్‌ ఫీజులు, లైసెన్స్‌ ఫీజులు ఉండాలని అధికారులను ఆదేశించారు. అంతిమంగా మద్య నిషేధం దిశగా అడుగులు వేయాలన్న మౌలిక లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని  తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని సీఎం ఆదేశించారు. 
*బార్లలో మద్యం సరఫరా వేళల కుదింపు:
బార్ల సంఖ్యను కుదించడంతోపాటు మద్యం సరఫరా వేళలను కూడా కుదించాలని సమావేశంలో నిర్ణయించారు. గత సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని బార్లలో ఉదయం 11 నుంచి రాత్రి 10వరకూ మద్యం సరఫరాను అనుమతిస్తామని, రాత్రి 11 గంటల వరకూ ఆహారాన్ని అనుమతిస్తామని అధికారులు స్పష్టంచేశారు. స్టార్‌ హోటళ్లలో ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకూ మద్యాన్ని విక్రయించడానికి అనుమతి ఉంటుందని వెల్లడించారు. అలాగే బార్లలో అమ్మే మద్యం ధరలను పెంచడంపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఇందులో భాగంగా «బార్లలో అమ్మే మద్యం ధరలను పెంచాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 
*వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టానికి పదును:
నాటు సారా తయారుచేసినా, మద్యాన్ని స్మగ్లింగ్‌ చేసినా, కల్తీచేసినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే నాన్‌బెయిల్‌బుల్‌ కేసులు పెట్టాలన్నారు. ఆరు నెలల జైలు శిక్ష విధించేలా చట్టంలో సవరణలు తీసుకురావాలన్నారు. బార్‌ యజమానులు నియమాలను ఉల్లఘిస్తే లైసెన్స్‌ ఫీజుకు 5 రెట్లు జరిమానా విధించాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించి బిల్లును తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమాలకు పాల్పడితే రూ.2 లక్షల జరిమానా తోపాటు 2ఏళ్ల జైలు శిక్ష విధించే నిర్ణయంపై చట్ట సవరణకు బిల్లు తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఈ అసెంబ్లీలో సమావేశాల్లోనే మద్యం, ఇసుక అక్రమాల నిరోధాలకు సంబంధించిన రెండు బిల్లులనూ ప్రవేశపెట్టి సంబంధిత చట్టాలకు సవరణ చేయాలని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ అ«ధికారులకు స్పస్టంచేశారు. 
వీటితోపాటు మద్యం, ఇసుక స్మగ్లింగ్‌లను అరికట్టడానికి చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘాను ఏర్పాటుచేయాలన్నారు. నైట్‌విజన్‌ సీసీ కెమెరాలను ఏర్పాటుచేయాలని, అలాగే ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల వద్దకూడా సీసీ కెమెరాలు ఉండాలని సీఎం ఆదేశించారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన వైయస్ఆర్ కాంగ్రెెస్ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి. విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేత శ్రీ మిథున్ రెడ్డి, ఎంపీలు శ్రీ నందిగం సురేష్, శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీ మార్గాని భరత్..
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ నంబర్లు 18001804200 మరియు 14488
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image