పార్టీ మారేవాళ్లు అధినేతను ఎదో ఒకటి అనాలి కదా?: జేసీ దివాకర్‌రెడ్డి

పార్టీ మారేవాళ్లు అధినేతను ఎదో ఒకటి అనాలి కదా?: జేసీ దివాకర్‌రెడ్డి
విజయవాడ : జగన్ ప్రభుత్వంలో ప్రతీకార వాంఛ ఎక్కువైందని టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి విమర్శించారు. ప్రత్యర్థులను హింసించే సమయంలో అధికారం శాశ్వతం కాదని తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల వల్లే అధికారులు వేధిస్తున్నారన్నారు. బస్సు బిజినెస్‌ను కొంత కాలం మానేయాలి అనుకుంటున్నట్టు జేసీ వెల్లడించారు. పార్టీ మారేవాళ్లు అధినేతను ఏదో ఒకటి అనాలి కదా అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ సుజనాచౌదరి కూడా విమర్శలు చేశారని గుర్తు చేశారు. వేధింపులకు భయపడి పార్టీలు మారకూడదని హితవు పలికారు. పవన్ ఢిల్లీ పర్యటన ఎందుకో తెలీదని జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు.