ఆంగ్లంలో విద్యాబోధనతో పాటు మాతృభాషకూ సముచిత ప్రాధాన్యం

ఆంగ్లంలో విద్యాబోధనతో పాటు మాతృభాషకూ సముచిత ప్రాధాన్యం


అమరావతి.:.
* తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
* ఉపాధ్యాయులను ఆంగ్లంలో బోధించేలా శిక్షణ ఇస్తాం
* సార్వత్రిక అవసరాలకు ధీటైన నైపుణ్యాలను పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యం 
* రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
అమరావతి: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆంగ్ల భాష నైపుణ్యాలను విద్యార్థులకు అందించి వారిని ప్రపంచస్థాయిలో పోటీకి తట్టుకునేలా తీర్చిదిద్దడం ప్రభుత్వం ఉద్దేశమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  2020-21వ విద్యా సంవత్సరం  నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఆంగ్ల బోధనను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ప్రకటించారు. విద్యా సంస్కరణల్లో భాగంగా 1 నుంచి 5వ తరగతి వరకు ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా పాఠ్యాంశాలను మార్పుచేయడం, ఆంగ్లంలో విద్యార్థులకు బోధనను అందించి సార్వత్రిక అవసరాలకు ధీటైన నైపుణ్యాలను పెంపొందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఆంగ్ల బోధనకు సంబంధించి 98 వేల మంది ఉపాధ్యాయులు అవసరమని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులకు  వచ్చే జనవరి నుంచి మే నెల వరకు వివిధ దశల్లో  ఆంగ్లంలో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఇఫ్లూ (ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ)  సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని వారితో కలిసి ఆంగ్లంలో శిక్షణ అందిస్తామన్నారు. ఆంగ్లం సార్వత్రిక భాష కావడంతో ఆ భాషా నైపుణ్యాలను విద్యార్థులలో పెంపొందించడంతో పాటు అన్ని విషయాలను ఆంగ్ల మాద్యమంలో పరిచయం చేయడం చారిత్రక అవసరంగా మారిందని మంత్రి  తెలిపారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను పొందడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర విద్యార్థులు రాణించేలా తీర్చిదిద్దేందుకు ఆంగ్ల మాద్యమంలో బోధన తప్పనిసరి అని పేర్కొన్నారు.
విద్యార్థులకు ఆంగ్లంలో విద్యాబోధనతో పాటు మాతృభాషకు కూడా సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ మాతృభాషను విద్యాబోధనలో తప్పనిసరి పాఠ్యంశంగా చేర్చామన్నారు. విద్యార్థుల నైపుణ్యాలను బోధనా మాద్యమాల వారీగా సమానంగా పెంపొందించడం సవాలుగా మారిందన్నారు. తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.  అన్ని సబ్జెక్టులు బోధిస్తూనే తెలుగును కూడా విద్యార్థులకు బోధిస్తామన్నారు. అందుకు గానూ తెలుగును ఒక సబ్జెక్టుగా ఉండేలా  కార్యచరణను రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. 
                             ప్రస్తుత విద్యాసంవత్సరంలో అక్టోబర్ నాటికి 70,90,217 మంది విద్యార్థులు చేరగా అందులో 44,21,529 (62.36 శాతం) మంది విద్యార్ధులు ఆంగ్ల మాద్యమంలో అభ్యసిస్తున్నారని వివరించారు. ఎస్సీలో 49.61 శాతం, ఎస్టీలలో 33.23 శాతం, బీసీల్లో 62.5 శాతం, ఓసీలు 82.6  శాతం ఆంగ్లంలో చదువుతున్నారని వెల్లడించారు. పేదలకు దూరంగా ఉన్నత వర్గాలవారికే ఆంగ్ల మాద్యమం పరిమితమైనట్లుగా ప్రస్ఫుటమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 45వేల స్కూళ్లలో నవంబర్‌ 14 వ తేదీ నుంచి నాడు-నేడు కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా నాడు - నేడు కార్యక్రమం ప్రకాశం జిల్లాలో  ఈనెల 14వ తేదీన ప్రారంభిస్తున్నారని తెలిపారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో  పాఠశాలల్లో మౌలికసదుపాయాల కల్పన ఉంటుందని వివరించారు. అందులో భాగంగా తొమ్మిది రకాల పనులను చేపడతామని, ప్రతి పాఠశాలలోనూ మరుగుదొడ్లు, కాంపౌండ్‌వాల్స్, తాగునీరు, నీటి పారుదల, ఫర్నిచర్‌, ఫ్యాన్లు, బ్లాక్‌ బోర్డులు, లైటింగ్‌, పెయింటింగ్‌.. తదితర సౌకర్యాల ఏర్పాటును పరిశీలించి ఇప్పటి వరకు ఎలా ఉన్నాయి.. ఇకపై ఎలా ఉండాలి.. అనే విషయంపై దృష్టి పెట్టి చేపడతామన్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image