స్వామి అయ్యప్ప ఐదు రాష్ట్రాలను  కలిపారు

స్వామి అయ్యప్ప ఐదు రాష్ట్రాలను  కలిపారు


శబరిమలై ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా  సౌకర్యంగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోండి...


తిరువనంతపురం సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి


*దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు కేరళ సీఎం ప్రత్యేక అభినందనలు *


తిరువనంతపురం :
05 -11-2019


స్వామి అయ్యప్ప ఐదు రాష్ట్రాలను కలిపారని, అయ్యప్ప భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టడం పై తిరువంతపురం సమావేశంలో చర్చించడం జరిగిందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు...


ముఖ్యంగా అయ్యప్ప భక్తులు ప్లాస్టిక్ సంచులు ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించాలని,  కేరళలో ప్లాస్టిక్ నిషేధం అమలు జరుగుతుందన్నారు...


ఈ సమావేశం ద్వారా కేరళ సీఎం ఐదు రాష్ట్రాల అయ్యప్ప భక్తులను ప్లాస్టిక్ నిషేధం కు సహకరించాలని కోరారు అని తెలిపారు...


కేరళ సీఎం ఆహ్వానం మేరకు  ఈరోజు తిరువనంతపురంలో జరిగే ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు దేవదాయ శాఖ మంత్రులు సమావేశానికి ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నట్లు తెలిపారు...


ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అయ్యప్ప స్వాములు కోసం శబరిమలైలో  కొండపైన, కొండ దిగువన అతిథి గృహం, వసతి నిర్మాణానికి కేరళ ప్రభుత్వాన్ని స్థలం కేటాయించమని కోరినట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. 


శబరిమలలోని శ్రీధర్మశాస్త దేవాలయంలో నవంబరు 17 నుంచి మండల, మకరవిల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన, ఇతర అంశాలపై చర్చించేందకు కేరళ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేవాదాయశాఖ మంత్రులతో సమావేశం నిర్వహించింది అన్నారు.


సమావేశంలో కేరళ సీఎం పినరయి విజయన్ మరియు కేరళ దేవాదాయ శాఖ మంత్రి కటకం సురేందర్ కు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు ప్రతిపాదించిన అంశాలు 


అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం పంబ సన్నిధిలో టోల్ ఫ్రీ సర్వీస్ ఏర్పాటు చెయ్యాలి.


రాష్ట్ర పోలీసులు మరియు అధికారులతో  కలిపి నీలకంఠ, పంబ బేస్ క్యాంప్ వద్ద శబరిమల సమాచార వ్యవస్థ తో  పాటు తెలుగు అయ్యప్పలు సమాచారం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలి...


పంబ మార్గములో ప్రయాణించే బస్సు బోర్డులపై పెద్దగా స్పష్టంగా తెలుగు భాషలో ఏర్పాటు చేయాలి...


నీలకంఠ, పంబ సన్నిధి వద్ద అయ్యప్ప భక్తులు కు తాగునీరు భోజన అల్పాహార కేంద్రాలను విశ్రాంతి తీసుకునే ఏర్పాటు చేయాలి.


అదనంగా ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలి కోరినట్లు తెలిపారు...


 సమావేశంలో కేరళ సీఎం స్పందిస్తూ ప్రతి రాష్ట్రంలోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల హెల్ప్ డెస్క్ కు అనుసంధానిస్తూ  కేరళ లో  జాయింట్ గా ఐదు రాష్ట్రాల తో కలిపి సెంట్రల్ హెల్ప్ సెంటర్ను  ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నార..


అనంతరం కేరళ సీఎం ను సమావేశానికి వచ్చిన వివిధ రాష్ట్రాల ప్రతినిధులను మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కనకదుర్గ అమ్మవారి ప్రసాదము అందజేసి వారిని సన్మానించిన ట్లు తెలిపారు ....


సమావేశం అనంతరం అనంత పద్మనాభ స్వామి వారిని దేవదాయ శాఖ మంత్రి దర్శించుకుని ఆశీర్వాదములు తీసుకున్నారు....


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image