వైయస్సార్‌సీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన సీఎం శ్రీ వైయస్. జగన్*


*అమరావతి*


*ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్ తో సమావేశం అనంతరం వైయస్సార్సీపీ ఎంపీలు మీడియా సమావేశం వివరాలు*


*పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహం, సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై వైయస్సార్‌సీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన సీఎం శ్రీ వైయస్. జగన్*


*ప్రత్యేక హోదాతో పాటు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సమావేశాల్లో మా గళం గట్టిగా వినిపించమని సీఎం చెప్పారు: ఎంపీ పి.మిథున్‌ రెడ్డి*


*పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తాం*
 
*ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతూ తీసుకున్న నిర్ణయంపై మేము ముఖ్యమంత్రికి ఏకగ్రీవంగా ధన్యవాదాలు తెలిపాం*


*రామాయపట్నం పోర్టు, వైద్య కళాశాలల ఏర్పాటు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల విడుదల కోసం పార్లమెంటులో ప్రశ్నిస్తాం: మిథున్‌రెడ్డి*


అమరావతి : త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ఎలా వ్యవహరించాలనే దానిపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలందరికీ దిశా, నిర్దేశం చేశారని వైయస్సార్‌సీపీ ఎంపీ శ్రీ మిథున్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ శ్రీ మిథున్‌రెడ్డి, సీఎం అదేశాల ప్రకారం  రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని వైయస్సార్‌సీపీ తరపున గట్టిగా ప్రశ్నిస్తామని వెల్లడించారు. ప్రత్యేక హోదాతో పాటు, రాష్ట్ర సమస్యలపై పార్లమెంటు గత సమావేశాల్లో కూడా అవకాశం వచ్చినప్పుడల్లా గళం వినిపించామని, రాబోయే సమావేశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. ఈ సమావేశాల్లో  ప్రత్యేక హోదా మొదటి ప్రాధాన్యాంశంగా పోరాడాలని సీఎం సూచించారన్నారు.
 దీంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధుల కోసం కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలవాలని సీఎం కోరారని ఎంపీ శ్రీ మిథున్‌రెడ్డి తెలిపారు. పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చిన నేపధ్యంలో ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులు పూర్తిగా విడుదల చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, అందుకే దీనిపై గట్టిగా పట్టుబట్టాలని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశించారని చెప్పారు. ఆ దిశలో తామంతా కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి చేసి పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల మొదటి ప్రాధాన్యతగా ప్రయత్నిస్తామని వెల్లడించారు.  రాబోయే రోజుల్లో కాఫర్‌ డ్యాం పూర్తైతే తక్షణమే భూసేకరణ కోసం దాదాపు రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయని, అందువల్ల ఆ నిధుల కోసం కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని ఎంపీ శ్రీ మిథున్‌రెడ్డి తెలిపారు.
 మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విధానాన్ని ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి  తీసుకున్న నిర్ణయాన్ని ముక్తకంఠంతో సమర్ధిస్తున్నామని వెల్లడించారు. దీనిపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ను అభినందిస్తూ ఏకగ్రీవంగా ధన్యవాదములు తెలియజేస్తున్నామని ప్రకటించారు. అదే విధంగా రామాయపట్నం పోర్టు, రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటుతో పాటు, విభజన చట్టంలో హామీల అమలుపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు రెండేళ్లుగా విడుదల చేయడం లేదని, వాటి కోసం పార్లమెంటు సమావేశాల్లో పోరాడుతామని చెప్పారు. 
 ఇంకా రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ లోటు భర్తీ, విభజన చట్టంలోని అన్ని అంశాలపై పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని ప్రశ్నిస్తామని ఎంపీ శ్రీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ లోటుపై గతంలో కేంద్రం పేచీ పెట్టిందని, అందువల్ల దాన్ని కూడా ప్రశ్నిస్తామని తెలిపారు. నిజానికి 'కాగ్‌' కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సర్టిఫై చేసిందని, అందువల్ల మన వాదనకు మరింత బలం చేకూరుతుందని చెప్పారు. 
 రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జరగాల్సిన మేలుపై సమావేశంలో సీఎంకు వివరించామని తెలిపారు. ఎంపీల పని తీరు ఏ విధంగా ఉండాలన్న దానితో పాటు, కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలో సీఎం దిశా, నిర్దేశం చేశారని, రాష్ట్రానికి ఉపయుక్తం అయ్యే ప్రతి అంశాన్ని బాగా అధ్యయనం చేసి, వాటిపై పోరాడాలన్న సీఎం సూచనలను అక్షరాలా పాటిస్తామని చెప్పారు. 
 ఈరోజు వైయస్సార్‌సీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారని అందువల్ల బీజేపీ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తామని, సభలో మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతీసారి ప్రత్యేక హోదా గురించి ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటామని ఎంపీ శ్రీ పి.మిధున్‌రెడ్డి స్పష్టం చేశారు.
 అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ సత్యవతి మాట్లాడుతూ, వైయస్సార్‌సీపీకి చెందిన 22 మంది లోక్‌సభ సభ్యులు, మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఈనెల 18 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఎలా ఉండాలనే దానిపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారని చెప్పారు. వైయస్సార్సీపీ లోక్ సభ ఫ్లోర్‌ లీడర్‌ శ్రీ పి.మిధున్‌రెడ్డి చెప్పినట్లు విభజన సమయంలో పార్లమెంటులో ఇచ్చిన మాటపై, ఏ సందర్భంలో ఎక్కడ అవకాశం వచ్చినా ప్రస్తావిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిధులు తక్షణమే విడుదల చేయాలని, పార్లమెంటులో మాట్లాడేటప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించాలని సీఎం సూచించారని చెప్పారు. ఇతర రాష్ట్రాలలో మాదిరిగా ఏపీకి కూడా కొత్తగా వైద్య కళాశాలలు మంజూరు చేయాలని, ఆ విషయం కూడా సభలో ప్రస్తావిస్తామని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలకిచ్చే స్పెషల్‌ ఫండ్‌ మన రాష్ట్రానికి రావాల్సి ఉందని, దాని గురించి కూడా సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పార్లమెంటులో లేవనెత్తుతామన్నారు.
 నవంబరు 14న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా  ప్రారంభించిన 'మనబడి:నాడు–నేడు' కార్యక్రమాన్ని ఎంపీ డాక్టర్‌ సత్యవతి ప్రశంసించారు. పేద పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదువుకుంటే వారికి చక్కగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను సరస్వతీ నిలయాలుగా మారుస్తున్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌కు సమావేశంలో ఎంపీలందరూ ధన్యవాదాలు చెప్పారని డాక్టర్‌ సత్యవతి వివరించారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
కరోనా నియంత్రణలో విజయవాడ నగరాన్ని రాష్టానికే  ఆదర్శంగా ఉండేలా చేయాలి: సిఎస్ నీలం సాహ్ని
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image