*చిధ్రంగా మారిన గ్రామీణ అంతర్గత రోడ్లు* (పొంచి ఉన్న అంటువ్యాధులు)

చిధ్రంగా మారిన గ్రామీణ అంతర్గత రోడ్లు


 వింజమూరు: వింజమూరు మండలంలో గురువారం నాడు కురిసిన కొద్దిపాటి వర్షం, శుక్రవారం తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా పడుతున్న జల్లులతో గ్రామీణ ప్రాంతాలలోని అంతర్గత రోడ్లు చిత్తడి చిత్తడిగా చిధ్రంగా మారాయి. మండల కేంద్రమైన వింజమూరులోని బి.సి కాలనీ, లెక్కలవారిపాళెం, గంగమిట్ట, బొమ్మరాజు చెరువు ప్రాంతాలతో పాటు రావిపాడు, కాటేపల్లి, తమిదపాడు, వన్నూరప్పపాళెం, బత్తినవారిపల్లి, నందిగుంట, తక్కెళ్ళపాడు, చంద్రపడియ, బుక్కాపురం తదితర గ్రామాలలో అంతర్గత రోడ్లు బురదమయమయ్యాయి. మురికి కాలువలలో పూడికతీత చర్యలు చేపట్టక పోవడంతో వాటిలోని బురద వర్షపు నీటితో మిళితమై రోడ్లపైకి చేరుతుండటంతో భరించరాని దుర్వాసన వెదజల్లుతున్నదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కాలువల వద్ద బ్లీచింగ్ చల్లించిన దాఖలాలు లేవని వారంటున్నారు. ఇటీవల పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించినప్పటికీ మొక్కుబడి తంతుగా సాగించారని విమర్శలు చేస్తున్నారు. అసలే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో దారులు వెంబడి మురికి నీరు ప్రవహిస్తుండటంతో దోమలు అధికంగా వ్యాప్తి చెందుతున్నాయని, పగలు రాత్రి తేడా లేకుండా దోమల ధాటికి అల్లాడిపోతున్నామని పలు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్వచ్చ భారత్ లక్ష్యంగా పనిచేయాలని జిల్లా ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ వింజమూరు మండలంలోని పలు గ్రామాలలో ఆ దిశగా అడుగులు వేసిన సందర్భాలు అమావశ్యకో పున్నమికో అనే సామెతను గుర్తుకు తెస్తున్నాయి. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాలలో వర్షాకాల సమయాలలో అయినా పారిశుద్ధ్య పనులను చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు...


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు