హాకీ పూర్వ వైభవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అత్యావశ్యకం

హాకీ పూర్వ వైభవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అత్యావశ్యకం
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్
నాగార్జున విశ్వవిద్యాలయంలో ఘనంగా హాకీ ఆంధ్రప్రదేశ్ ఐదవ వార్షికోత్సవం
హాకీ అభివృద్దికి కృషి చేసిన క్రీడాకారులు, నిర్వాహకులను సత్కరించిన గవర్నర్
అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలను తెచ్చి పెట్టిన హకీ అభివృద్దికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సహకారాన్ని అందించాలని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ అన్నారు. హాకీలో ఆసియా ఛాంపియన్‌షిప్ నుండి ఒలింపిక్స్ వరకు గర్వించదగిన విజయాలు మన సొంతమని ఈ నేపధ్యంలో ప్రభుత్వాలు హాకీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించిన హాకీ ఆంధ్రప్రదేశ్ ఐదవ వార్షికోత్సవం, రాష్ట్ర స్ధాయి హాకీ అవార్డుల వేడుకలో గౌరవ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925 లో ఇండియాలోని గ్వాలియర్లో బ్రిటిష్ ప్రభుత్వం ఇండియన్ హాకీ ఫెడరేషన్ స్థాపించిన తరువాత 1928 నుండి ప్రపంచ హాకీ చిత్రపటంలో మనమే అధిపత్యం చెలాయిస్తూ వచ్చామని మాన్యశ్రీ గవర్నర్ గుర్తు చేసారు.  ఆమ్ స్టర్ డామ్, లాస్ ఏంజిల్స్, బెర్లిన్, లండన్, హెల్సింకి, మెల్బోర్న్ ఇలా వరుస విజయవాలు మనవేనని, 1980 లో మాస్కో ఒలింపిక్స్ లో  భారత్ మళ్లీ బంగారు పతకం సాధించగా, ఆసియా, కామన్వెల్త్,  ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో ఇలాంటి విజయాలు మనకు ఎన్నో లభించాయన్నారు.  హాకీని డి-ఫాక్టో నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం గుర్తించటమే కాక,  హాకీ దిగ్గజంగా పిలవబడే మేజర్ ధ్యాన్ చంద్ కు భారత ప్రభుత్వం "పద్మ విభూషణ్" గౌరవాన్ని ఇచ్చిందని,  ధ్యాన్ చంద్ భారత జట్టుకు నాయకత్వం వహించి 1936 బెర్లిన్ ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించి, భారత దేశ గౌరవాన్ని ఇనుమడింప చేసాడని బిశ్వభూషన్ వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో క్రమపద్ధతిలో, క్రమం తప్పకుండా, టోర్నమెంట్లు నిర్వహించడం ద్వారా హాకీ ఆంధ్రప్రదేశ్, హాకీ యొక్క ప్రమాణాలను మెరుగుపరచడానికి కృషి చేయటం ముధావహమన్నారు. మొత్తం ఆరు రాష్ట్ర హాకీ జట్లకు స్టేట్ రెసిడెన్షియల్ కోచింగ్ క్యాంప్‌లను నిర్వహించిన హాకీ ఆంధ్రప్రదేశ్ పలువురు ఆటగాళ్ళు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటేందుకు దోహదం చేసిందన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు ఆస్ట్రో టర్ఫ్, ఆధునిక క్రీడా ప్రాంగణాలు,  సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ తరహా హాకీ అకాడమీలు,  అత్యాధునిక మోళిక సదుపాయాల అవసరం ఉందని క్రీడాకారులు ప్రాక్టీస్ చేయడానికి రాష్ట్రం మొత్తం లో ఒక్క ఆస్ట్రో టర్ఫ్ కూడా కనిపించక పోవటం ఆందోళన కలిగిస్తుందన్నారు. పొరుగు రాష్ట్రం ఒడిశాలో ఎనిమిది మోడరన్ టర్ఫ్ హాకీ పిచ్‌లు, పది హాకీ అకాడమీలను ఉన్నాయని, అవి అక్కడ హాకీ ప్రోత్సహానికి ఉపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు.  ఈ రాష్ట్ర గవర్నర్‌గా తాను హాకీ క్రీడాకారులు, తమ ఆటను మెరుగుపరుచుకోవటానికి , జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడడటానికి వీలుగా రాష్ట్రంలో తగిన మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వానికి సూచిస్తానన్నారు. హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం హాకీ క్రీడాభివృద్దికి సంబంధించి పలు సమస్యలు చుట్టు ముట్టాయని వాటిని అధికమించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వనరుల కొరత మొదలు మోళిక వసతులతో సహా పలు అంశాలలో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. రాష్ట్ర గవర్నర్ , ముఖ్యమంత్రి ఆశీస్సులతో రాష్ట్రం నుండి దేశ భవిష్యత్తు అవసరాలకు ఉపకరించే క్రీడాకారులను తయారు చేస్తామని ఈ సందర్భంగా మీనా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ కుమార్, అచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఉప కులపతి అచార్య రామ్ జీ, రిజిస్ట్రార్ రోశయ్య, హాకీ ఆంధ్రప్రదేశ్ సంచాలకులు ఎం. నిరంజన్ రెడ్డి, ఒలంపిక్ పతక విజేత సత్తి గీత తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా హకీ క్రీడాభివృద్దికి విశేష కృషి చేసిన క్రీడాకారులు, నిర్వాహకులను గౌరవ గవర్నర్ శాలువా, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు.


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image