సుప్రీంకోర్టు తీర్పుపై బీజేపీ స్పందన..

అయోధ్య రామ జన్మ భూమి పై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పుపై బీజేపీ స్పందన.."


విజయవాడ.,నవంబర్ 9,(అంతిమతీర్పు):


సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన అమూల్యమైన '' శ్రీరామ జన్మభూమి అంతిమ తీర్పును'' భారతీయ జనతా పార్టీ సగౌరవంగా స్వాగతిస్తోంది అని జాతీయ కార్మిక సంస్థ చైర్మన్,భాజపా రాష్ట్ర కార్యదర్శి శ్రీ జయప్రకాష్ నారాయణ వల్లూరు తెలిపారు.
 భారత దేశ చరిత్రలో నిలిచిపోయే ఈ తీర్పు అన్ని సమస్యలను పరిష్కరించడమే కాకుండా శాంతి, ఐక్యత, సామరస్యం యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పింది అని మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు శ్రీరామ జన్మభూమిపై తుది తీర్పు వెలువరించడానికి ముందు
భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం గౌరవాన్ని కాపాడుతూ సమాజంలో అన్ని వైపులనుంచి శాంతి కాంక్షించారు..  సామాజిక, సంసృతిక  సంస్థలు మరియు ఈ వ్యాజ్యనికి సంభందించిన అన్ని పార్టీల వారు శాంతి స్థాపనకు సహృద వాతావరణ కల్పనకు కృషి చేసిన వారిని ఆయన అభినందించారు..  తీర్పు వెలువరించిన అనంతరం కూడా అవే శాంతియుత కొనసాగాలని విజ్ఞప్తి చేశారు.ఇదే భారతదేశ ఔనిత్యానికి ప్రతీక అని జె. పి కొనియాడారు.
నిర్దేశించిన సమయానికి నిర్ణయాత్మకమైన తీర్పు అందించిన గౌరవ సుప్రిం ధర్మాసనానికి, ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని న్యాయమూర్తుల ధర్మాసనానికి భారతీయ జనతా పార్టీ కృతజ్ఞతలు తెలియచేస్తోంది అని రోజువారీ విచారణలు చేపడుతూనే అనేక సంవత్సరాలుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమస్యకు సుప్రిం ధర్మాసనం నేడు పరిష్కారం చూపింది అని జెపి తెలిపారు
దేశ సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక భావాలను ఐక్యంగా ఉంచిన దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ నమస్కరిస్తోంది..
ఈ నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతించాలని, పుకార్లపై శ్రద్ధ చూపకుండా సమానత్వం, సామాజిక సామరస్యం మరియు శాంతితో ఉండాలని అమూల్యమైన వారసత్వాన్ని కాపాడాలని, భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. ఈ నిర్ణయం భారతీయులం ఐక్యంగా ఉన్నామని, భారతదేశంలో ప్రజాస్వామ్యం యొక్క మూలాలు చాలా బలంగా ఉన్నాయని స్పష్టమైన సందేశం ఇచ్చింది.భారతీయ జనతా పార్టీ రామ మందిర నిర్మాణానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. పాలంపూర్ ఆదివేషన్ నుండి ఈ రోజు వరకు కూడా బిజెపి ఈ అంశంపై సానుకూల పాత్ర పోషించింది మరియు ప్రతీ బాధ్యతను నిర్వర్తించింది. దేశ చరిత్రను తిరిగి వ్రాసినప్పుడల్లా, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పదవీకాలం బంగారు అక్షరాలతో వ్రాయబడుతుంది అని జయ ప్రకాష్ నారాయణ హర్షం వ్యక్తం చేశారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image