స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు

స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు
హైదరాబాద్ : హైదరాబాద్, అమరావతి, విజయవాడ సహా దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం పెట్రోల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. డీజిల్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పూ లేదు. పెట్రోల్ ధరల్లో 18 పైసల నుంచి 20 పైసల వరకు పెరుగుదల నమోదైంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 20 పైసలు పెరిగి రూ. 78.36 కి చేరగా లీటర్ డీజిల్ ధర రూ. 71.80 వద్ద కొనసాగుతోంది. అమరావతిలోనూ ఇదే పరిస్థితే ఉంది. అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర 18 పైసలు పెరిగి రూ. 77.95 కు చేరింది. ఇక డీజిల్ ధర రూ. 71.10 వద్ద స్థిరంగా ఉంది. ఏపీ వాణిజ్య రాజధాని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధరలు 19 పైసలు పెరిగి రూ.77.59 కి చేరగా లీటర్ డీజిల్ ధర రూ. 70.76 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 18 పైసలు పెరిగి రూ.73.63 మార్కును తాకింది.ఇక డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా రూ.65.79 వద్ద కొనసాగుతోంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోనూ పరిస్థితి అలాగే ఉంది. లీటర్ పెట్రోల్ ధర 18 పైసలు పెరిగి రూ.79.30 లకు చేరగా లీటర్ డీజిల్ ధర రూ.69.01 వద్ద స్థిరంగా ఉంది.