రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా మిత్రులకు మనవి..*

 



*రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా మిత్రులకు మనవి..*


పగలు రాత్రి తేడా లేకుండా అలుపెరగని సైనికుల్లా వార్తల సేకరణలో నిత్యం బిజీగా ఉండే జర్నలిస్టులకు మరోసారి ఆటవిడుపు


 కాస్త రిలాక్సేషన్, రిఫ్రెష్ మెంట్ కోసం రాజధాని లో రెండో విడత  క్రికెట్ టోర్నమెంట్ పెట్టాలని నిర్ణయించాం. 


*జనవరి 10, 11, 12 తేదీలలో ఎపి 'జర్నలిస్ట్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ లీగ్'* తరఫున  ACA క్రికెట్ మైదానంలో రెండవ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ కు మా నిర్వాహక టీం‌ సిద్దమైంది. 


మరి ఆడేందుకు మీ క్రీడా టీం లు కూడా ప్రణాళిక సిద్దం చేసుకోండి..


 క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జట్లను ఆహ్వానిస్తున్నాం.


టీం సభ్యుల వివరాలను .. ప్రతి జిల్లాలో ఉన్న ప్రెస్ క్లబ్ నుంచి..‌ వారి లెటర్ హెడ్  ద్వారా, ఫోన్ ద్వారా నిర్వాహకులకు పంపిన టీం నే ఆడేందుకు అనుమతి ఉంటుంది. 


ఈ‌ టీం సభ్యులకు గత మూడేళ్లల్లో ఉన్న అక్రిడేషన్ నెంబరు ఆడే సమయంలో చూపించాలి


వ్యక్తిగతంగా వచ్చి టీం లు ఆడే అవకాశం లేదు.. మీ మీ జిల్లాల్లో ప్రెస్ క్లబ్ నుంచి టీం జాబితా తెచ్చుకోవాలి


 *డిసెంబరు 10 2019 లోపు తమ పేర్లు నమోదు చేసుకోగలరు*.


 పేర్లు నమోదు చేసిన జట్లు క్రికెట్ కిట్లు తెచ్చుకోవలెను. బాల్స్ మాత్రమే నిర్వాహకులు అందజేస్తారు. 


టోర్నీలో పాల్గొనే జట్టులో 16 మంది ఆటగాళ్ల ఉండాలి. జట్లకు సంబంధించిన డ్రెస్ నిర్వాహకులు అందిస్తారు.


 నిత్యం పని ఒత్తిళ్ల నుంచి సేదతీరేందుకు ఈ టోర్నీ నిర్వహిస్తున్నాం. 


స్నేహ పూరిత వాతావరణంలో పోటీలు జరిగేలా సహకరించగలరని కోరుతున్నాం.
 
*నోట్:*


*టోర్నీలో పాల్గొనేందుకు కేవలం అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులు మాత్రమే అర్హులు*


*టోర్నమెంట్ కు సంబంధించి ఏ విషయమైనా తుది నిర్ణయం నిర్వాహకులదే*


మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి, పేర్లు నమోదు చేసుకోవడానికి ఈ కింది నంబర్లలో సంప్రదించగలరు.


కాంటాక్ట్:


క్రాంతి: 9010678678,
పూర్ణ.. 9393403999, ప్రసాద్ : 8333933318


శ్రీనివాస్ : 9848888284, జగదీష్ :- 9908020454


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image