సముద్ర స్నానాలు, పాండురంగ స్వామి ఉత్సవాలపై సమీక్షా సమావేశం

కృష్ణా జిల్లా, మచిలీపట్నం ...
* కార్తీకమాసం సముద్ర స్నానాలు, పాండురంగ స్వామి ఉత్సవాలపై సమీక్షా సమావేశం...
* మచిలీపట్నం, ఆర్ అండ్ బి అతిధి గృహంలో రాష్ట్ర మంత్రి పేర్ని నానితో సమీక్షా సమావేశంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు ...


మంత్రి పేర్ని నాని కామెంట్స్ ...
* మచిలీపట్నంకు మరో పేరు పండరీపురం ...
* పాండురంగస్వామి గుడి ప్రతిష్ఠతోనే మచిలీపట్నంను పండరీపురం అని పిలుస్తున్నాం ...
* కార్తీక పౌర్ణమి సందర్బంగా పాండురంగ ఉత్సవాలు జరుపుకోవటం విధితమే ...
* 9వ తేదీ స్వామి వారి రధోత్సవం నిర్వహిస్తాం...
* 11, 12వ తేదీ కార్తీక పౌర్ణమి సముద్రస్నానాలు ఆచరించటానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది ...
* జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు ...
* మంగినపూడి బీచ్ కు వెళ్ళే-వచ్చే ప్రధాన రహదారిని 'వన్ వే ' కేవలం వెళ్లటానికి మాత్రమే ఉపయోగించేట్లు  ఏర్పాట్లు ...
* బీచ్ వద్ద నుండి తిరుగు ప్రయాణం నిమిత్తం నందమూరు, పెడన మీదుగా ట్రాఫిక్ మళ్లించడం జరుగుతుంది...
* బంటుమిల్లి వైవు నుండి వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ మళ్లించి  పెద్దపట్నం బీచ్ వద్ద స్నానాలకు ఏర్పాట్లు చేయటం జరిగింది 
* సౌకర్యవంతంగా స్నానం ముగించుకుని క్షేమంగా ఇంటికి రావటానికి అవకాశం కల్పిస్తాం ...
* ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కొన్ని రహదారుల ఏర్పాట్లు చేశాం పోలీసులకు, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని ప్రజలను కోరుతున్నాం


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image