చెరుకు రైతుల బకాయిల చెల్లింపునకు సీఎం ఆదేశం

19–11–2019
అమరావతి


*
*నడుస్తున్న 4 సహకార సుగర్‌ ఫ్యాక్టరీలకు మహర్దశ* 
*మరో 3 ఫ్యాక్టరీలు పునఃప్రారంభం*
*కడపలో చెన్నూరు, చిత్తూరులో గాజులమాండ్యం, విశాఖలో అనకాపల్లి కర్మాగారాల పునఃప్రారంభం*
*అత్యాధునిక సాంకేతికతో సహకార చక్కెర కర్మాగారాలు*
*సహకార చక్కెర ఫ్యాక్టరీల స్వావలంబనం, రైతులకు లబ్ధే ప్రధాన ధ్యేయం*
*2–3 ఏళ్లలో సమగ్ర ప్రణాళిక అమలు* 
*సహకార డెయిరీల బలోపేతంపైనా దృష్టి*
*ప్రముఖ బ్రాండ్ల భాగస్వామ్యంపై ఆలోచనలు*
*సహకార డెయిరీకి పాలుపోస్తే లీటర్‌కు రూ.4ల బోనస్‌ అమలుకు ఆదేశం*
*సహకార సుగర్‌ ఫ్యాక్టరీలు, డెయిరీలపై సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*


అమరావతి: రాష్ట్రంలో సహకార చక్కెర కర్మాగారాల పునర్‌ వైభవానికి  సమగ్రప్రణాళిక తయారుచేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం పనిచేస్తున్న కర్మాగారాలు, తిరిగి తెరవాల్సిన కర్మాగారాల విషయంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇప్పుడున్న పోటీని తట్టుకోవడానికి, లాభదాయకంగా నడపడానికి అవసరమైన  చర్యలను అందులో పొందుపరచాలన్నారు. కర్మాగారాలను తాజా సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిచేయడంతోపాటు ఉప ఉత్పత్తులు ద్వారా అవి సొంతకాళ్లమీద నిలబడ్డానికి అవసరమైన అన్ని ఆలోచనలు చేయాలని నిర్దేశించారు. చక్కెర సరఫరా చేసినందుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వీలైనంత త్వరలో చెల్లించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రణాళికలో నిర్దేశించిన విధంగా సహకార డెయిరీలకు పాలుపోస్తున్నందుకు ప్రతిలీటరుకూ రూ.4ల బోనస్‌ అమలుపైనా ప్రతిపాదనలు సిద్ధంచేయాలన్నారు. సహకార డెయిరీల బలోపేతం, రైతులకు మరింత లబ్ధి చేకూర్చే అన్నిరకాల చర్యలపైనా వీలైనంత త్వరగా ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు. 


సహకార చక్కెర కర్మాగారాలు, సహకార డెయిరీలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, పశుసంవర్థకం, మత్స్య, మార్కెటింగ్‌  శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆయా శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.


రాష్ట్రంలో చెరుకుపంట సాగు, సహకార చక్కెర కర్మాగారాలు, మూతపడ్డ సుగర్‌ ఫ్యాక్టరీలపై అధికారులు సీఎంకు వివరాలు అందించారు. చక్కెర పరిశ్రమల పరంగా దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపైనా ప్రజంటేషన్‌ ఇచ్చారు.  
1.  దేశంలో 330.7లక్షల మెట్రిక్‌ టన్నుల పంచదార ఉత్పత్తి ఉంటే
యూపీలో అత్యధికంగా 116.7 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు.  107.2 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తితో రెండోస్థానంలో మహారాష్ట్ర నిలవగా, 
పదోస్థానంలో ఏపీ ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తి 5.02 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే. 


2. ఒక్కో హెక్టారుకు చెరుకు ఉత్పత్తిలో 105 మెట్రిక్‌ టన్నులతో తమిళనాడు ప్రథమ స్థానంలో ఉండగా, 95 మెట్రిక్‌ టన్నులతో కర్ణాటక ఉంది. 78 మెట్రిక్‌ టన్నులతో ఏపీ దేశంలో ఏడో స్థానంలో ఉంది. 


3. సగటున చక్కెర రికవరీ శాతం యూపీలో 11.5 శాతం, మహారాష్ట్ర 11.3 శాతం, ఏపీ 9.3 శాతంతో దేశంలో 11వ స్థానంలో ఉంది. 


4. రాష్ట్రంలో చక్కెర డిమాండు 10.23 లక్షల మెట్రిక్‌ టన్నులు అయితే ఉత్పత్తి  5.02 మెట్రిక్‌ టన్నులు మాత్రమే.


5. రాష్ట్రంలో 29 చక్కెర కర్మాగారాలు ఉంటే అందులో 18 మాత్రమే పనిచేస్తున్నాయి. మహారాష్ట్రలో 264 ఉంటే 195 పనిచేస్తున్నాయి, 
యూపీలో 158 ఉంటే 119 మాత్రమే పనిచేస్తున్నాయి. 


6. 
2006–07 నాటికి రాష్ట్రంలో 102.3 లక్షల టన్నుల చెరుకు ఉత్పత్తి ఉంటే 100.91 లక్షల మెట్రిక్‌ టన్నులు క్రషింగ్‌ అయ్యేది. 
2018–19 నాటికి 58.04 లక్షల మెట్రిక్‌ టన్నులకు పడిపోగా, ఇందులో 54.05 లక్షల టన్నులు క్రషింగ్‌కు వస్తోంది. 


7. 
రాష్ట్రంలో మొత్తం సహకార చక్కెర కర్మాగారాలు 10 ఉండగా అందులో 6 మూతబడ్డాయి. 
విజయనగరం జిల్లా భీమసింగిలో ఉన్న విజయరామగజపతి, విశాఖపట్నం జిల్లా చోడవరం , ఏటికొప్పాక, తాండవ సహకార చక్కెర కర్మాగారాలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. 
మూతపడ్డవాటిలో అనకాపల్లి, గుంటూరు జిల్లా జంపని, నెల్లూరు జిల్లా కోవూరు, చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర, చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ, కడప సమీపంలోని చెన్నూరు సగర్‌ ఫ్యాక్టరీ ఉన్నాయి. 
ఎన్నికలకు ముందు అనకాపల్లి సుగర్‌ ఫ్యాక్టరీ ప్రారంభం అయినా ఆ తర్వాత కొద్దికాలానికే నిలిచిపోయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. 
ఫ్యాక్టరీల వారీగా ఉన్న పరిస్థితులనుకూడా సీఎం తెలుసుకున్నారు. రైతుల బకాయిలు, ఫ్యాక్టరీల వారీగా ఉన్న రుణాలు తదితర అంశాలపై క్షుణ్నంగా అధికారులతో చర్చించారు. 
పేరుకుపోయిన పంచదార నిల్వలతో కలుపుకుని ఇప్పటివరకూ 10 సహకార సుగర్‌ ఫ్యాక్టరీలపై భారం రూ. 891.13 కోట్ల రూపాయలు ఉందని అధికారులకు నివేదించారు. 
ప్రజంటేషన్‌ పూర్తయ్యాక సీఎం అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. సహకార ఫ్యాక్టరీల నుంచి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించడానికి తగిన చర్యలు తీసుకోమని చెప్పారు. వీలైనంత త్వరలో వీటిని విడుదల చేయలాని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 
వీటితోపాటు ప్రస్తుతం నడుస్తున్న 4 సహకార చక్కెర కర్మారాగారాలను పూర్తిస్థాయిలో ఆధునీకరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తగిన కార్యాచరణ ప్రణాళికను తయారుచేయాలన్నారు. 
వీటిపై పెట్టే ప్రతి పైసా సద్వినియోగం కావాలని, ఫ్యాక్టరీ తన సొంత కాళ్లమీద నిలబడ్డమే కాకుండా, రైతులు ఆనందంగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. అప్పుడు కొంత, ఇప్పుడు కొంత ఇచ్చి.. అటూఇటూ కాకుండా ఫ్యాక్టరీని, రైతులను ఇబ్బంది పెట్టే పద్ధతులు వద్దని, వచ్చే 2 –3 సంవత్సరాల్లో ఆ ఫ్యాక్టరీలను అత్యంత ఆధునిక పరిశ్రమలుగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. మొలాసిస్‌ లాంటి ఉప ఉత్పత్తుల వల్ల ఆర్థిక ప్రయోజనం సమకూరే మార్గాలపైనా దృష్టిపెట్టాలని ఆదేశించారు. 


వీటితోపాటు అనకాపల్లి, కడపలోని చెన్నూరు, చిత్తూరు జిల్లాలోని రేణిగుంట వద్దనున్న గాజుల మాండ్యం సుగర్‌ ఫ్యాక్టరీలను తిరిగి తెరవాలంటూ రైతులనుంచి, ప్రజా ప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చిన విషయాన్ని సీఎం అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయాలన్నారు. 
ఆయా ప్రాంతాల్లో చెరుకు ఉత్పత్తి తగ్గుతున్నందున వాటిని పరిమిత స్థాయిలో నడుపుకుని అదనపు విలువ జోడించి చక్కెరను ఉత్పతి ్తచేయాలన్నదానిపై అధికారులు కొన్ని ప్రతిపాదనలు ఉంచగా, అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సహకార చక్కెర కర్మాగారా రివైవల్‌ ప్లాన్‌ భాగంగానే ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఇతరత్రా అంశాలపై దృష్టిసారించాలని సీఎం అధికారులకు చెప్పారు. 


ఇక తెరవడానికి అవకాశం లేని సహకార చక్కెర కర్మాగారాల విషయంలో ఉన్న బకాయిలను తీర్చడానికి ఏం చేయాలన్నదానిపై ఒక ప్రణాళిక సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు. 


ఫ్యాక్టరీలు నడుస్తున్న చోట ప్రస్తుతం ఉన్న చెరుకు సాగుకోసం టన్నుకు రూ.800 నుంచి రూ.1200లు, కటింగ్‌ సమయంలో రూ.250 నుంచి 300లు ఖర్చు అవుతున్న విషయాన్ని అధికారులు నివేదించారు. ఈ ప్రాంతాల్లో సాగు తగ్గకుండా మరింత పెరిగేలా, దిగబడులు గణనీయంగా ఉండేలా వ్యవసాయశాఖ కూడా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. చెరుకు నాటడానికి, కటింగ్‌కూ ఫ్యాక్టరీ ద్వారా అత్యాధునిక పరికరాలను రైతులకు అందించడంపై దృష్టిపెట్టాలన్నారు. తమిళనాడు రాష్ట్రంలో అధిక దిగుబడులకు అనుసరిస్తున్న విధానాలపై దృష్టిపెట్టాలన్నారు. 


సహకార డెయిరీలపై సీఎం సమీక్ష:


రాష్ట్రంలో సహకార డెయిరీల స్థితిగతులపైనా సీఎం సమీక్ష చేశారు. సహకార రంగంలోని డెయిరీలకు పాలుపోసే ప్రతి రైతుకూ లీటరుకు రూ.4లు బోనస్‌ కింద ఇస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సహకార డెయిరీలను మరింత బలోపేతం చేయడంతోపాటు, తద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వ ఉద్దేశమని ఆమేరకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం వివరించారు. రైతులకు మేలు చేకూర్చేలా ప్రముఖ బాండ్లతో భాగస్వామ్యంపైకూడా ఆలోచనలు చేస్తున్నట్టు చెప్పారు. సహకార రంగంలో ప్రస్తుతం డెయిరీలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్ల స్థితిగతులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వీటిని పటిష్టం చేయడం ద్వారా రైతులకు అందుబాటులోకి తీసుకు రావచ్చని తెలిపారు. ఈమేరకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్మాణాత్మక ఆలోచనలు చేయాలని సీఎం సూచించారు. ఇప్పుడున్న సహకార డెయిరీలు తమ సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు, మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా కొత్త వ్యూహాలు దిశగా అడుగులు వేయాలని, అందుకనే పెద్దబ్రాండ్ల భాగస్వామ్యం దిశగా ఆలోచన చేస్తున్నామని సీఎం చెప్పారు. చేయూత ద్వారా మహిళలకు  ఆర్ధిక సహాయం చేస్తామని,  వచ్చే నాలుగేళ్లలో పెద్ద ఎత్తున ఆర్థిక లబ్ధి 
చేకూరుస్తున్నామని, డెయిరీ కార్యక్రమాల ద్వారా వారి ఆదాయాలు పెంచే ఆలోచనలు కూడా చేస్తున్నామస సీఎం చెప్పారు. రానున్న రోజుల్లో సహకార డెయిరీల బలోపేతం, డెయిరీ రంగంలో మహిళల భాగస్వామ్యం, పాడి పశువులను గణనీయంగా పెంచడమనే మూడే కోణాల్లో కార్యక్రమాలు విస్తృతం చేస్తామని సీఎం చెప్పారు.


Popular posts
శ్రామిక జాతికి  మే డే దినోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మి చారిటబుల్.ట్రస్ట్, మే డే.శుభాకాంక్షలు
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
అంబెడ్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ysrcp నేత దేవినేని ఆవినాష్
Image
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image