వైసీపీ కార్యకర్తలకు తప్ప మిగతా ఎవరికీ రక్షణ లేకుండా పోయింది.

*నెల్లూరులో మీడియాతో మాజీ మంత్రి సోమిరెడ్డి కామెంట్స్*


🔸రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలకు తప్ప మిగతా ఎవరికీ రక్షణ లేకుండా పోయింది..


🔸చంద్రబాబు నాయుడి అమరావతి పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం కనీస భద్రత కల్పించలేకపోయింది..


🔸దాడులు చేస్తామని వైసీపీ నాయకులు ముందే ప్రకటించినప్పటికీ అదుపు చేయలేకపోయారు..


🔸అదుపు చేయలేకపోగా రాళ్లు, లాఠీలు, చెప్పులతో కాన్వాయ్ పై దాడి చేస్తే.. నష్టపోయిన వారు చేశారని, వారికి ఆ హక్కు ఉందని డీజీపీ వ్యాఖ్యానించడం దురదృష్టకరం..


🔸ప్రజాస్వామ్యంలో ఎవరైనా ముందుగా చెప్పి మరీ రాళ్లు, చెప్పులతో దాడులు చేయవచ్చని డీజీపీని రాష్ట్రంలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలందరికీ ఆదేశాలిచ్చేయమనండి. అందరికీ స్వాతంత్ర్యం వస్తుంది..


🔸మాజీ సీఎం కాన్వాయ్ పై దాడి చేసిన వారిని సాయంత్రానికి బెయిలిచ్చి వదిలేశారు..ఇక సామాన్యుడికి రక్షణ ఎవరు కల్పిస్తారు..


🔸వైసీపీ ప్రభుత్వం వచ్చాక 13 జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది.. నిర్మాణ రంగం దెబ్బతింది. వారంతా ఎవరిపై దాడి చేయాలి..


🔸చంద్రబాబు నాయుడుపై దాడి చేయడమేంటి..అమరావతిలో రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు నష్టపోవడానికి కారణమెవరు..


🔸నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంది..కానీ రాళ్లు, చెప్పులు వేసి కాదు..


🔸రాజధాని ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసి అక్కడి వారి ఆస్తుల విలువ పెంచారు..


🔸వైసీపీ అధికారంలోకి వచ్చాకే రాజధాని ప్రాంతంలో ఆస్తుల విలువల అమాంతంగా పడిపోయింది..అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడుపై దాడి చేస్తారా..


🔸నేదురుమల్లి, వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల హయాంలో మేం కూడా నిరసనలు తెలిపి ఉద్యమాలు చేశాం..ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదు..


🔸టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాను. కానీ చెప్పులు, రాళ్లు విసిరి కాదు..


🔸ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపి ఉద్యమాలు నడిపాం..


🔸రాష్ట్రంలో శాంతిభద్రతలు మరింత దిగజారకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం, హోం మంత్రి, డీజీపీపై ఉంది..


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image