మంత్రి వెల్లంపల్లి కి.మాట్లాడే అర్హత లేదు : పోతిన వెంకట మహేష్

విజయవాడలో :


 


 జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ  భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన లాంగ్ మార్చ్ లో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ప్రజలు జనసేన పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేసినందుకు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు ముచ్చెమటలు పడుతూ  మూర్చ రోగం వచ్చిందని అందుకనే పవన్ కళ్యాణ్ గారి పై అసత్య ప్రచారాలు చేస్తూ ఇసుక సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని ఇసుక సమస్యపై బలమైన గొంతుగా వినిపిస్తూ బలమైన ఉద్యమం చేసిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారేన  ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఓటమి చెందిన ముందుండి పోరాడుతున్నది పవన్ కళ్యాణ్ గారేన అందుకనే పవన్ కళ్యాణ్ గారి  నీతి నిజాయితీ సిద్ధాంతాలు భావజాలం అవినీతిపరులకు అర్థంకావని అందుకే  ఇష్టానుసారం అవాకులు, చవాకులు వైఎస్ఆర్సిపి నాయకులు పెలుతున్నారని, అవినీతి యూనివర్సిటీకి వైస్ ఛాన్స్లర్ అయిన విజయ్ సాయి రెడ్డి డైరెక్షన్ లో నడుస్తున్న C.M వైఎస్ జగన్ గారి పాలనలో ఎప్పటికీ పారదర్శకత నీతి ఉండదని ఇసుక విధానం పై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పై అనేక ఆరోపణలు చేస్తున్న ఎందుకు వైయస్సార్ సిపి నాయకులు స్పందించడం లేదని జగన్మోహన్ రెడ్డి గారి  కేసులు బయటికి తీసి జైల్లో కూర్చోబెడతారు అనే భయం  ఉండబట్టే వైయస్సార్ సిపి నాయకులు బిజెపి నాయకుల పై ధైర్యంగా స్పందించడం లేదని మీకు దమ్ముంటే బిజెపి నాయకుల పై విమర్శలు చేయాలని మహేష్ చాలెంజ్ విసిరారు. సిమెంట్ కంపెనీల వద్ద నుండి ఒక్కొక్క సిమెంట్ బ్యాగ్ కు 5 రూపాయల కమిషన్ సెటిల్మెంట్ అయ్యేంతవరకు రాష్ట్రంలో ఇసుక కొరత తీరదని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఓటు వేసినందుకు రాష్ట్ర ప్రజల పశ్చాత్తాప పడుతున్నారని ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తనకే తెలియని రాజకీయ ఊసరవెల్లి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నీతి నిజాయితీ లపై ప్రయాణం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడే స్థాయి అర్హత లేదన్నారు నిజంగా మంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే దేవాలయాల్లో అవినీతి అరికట్టాలని అదేవిధంగా కృష్ణా జిల్లాల నుంచి తరలిపోతున్న ఇసుక అక్రమ రవాణా ఇసుక మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలని తద్వారా ప్రజలకు మేలు చేయాలన్నారు.


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image