జగన్‌పై ద్వేషం లేదు: పవన్


విశాఖ : సీఎం జగన్‌పై తనకు ఎలాంటి ద్వేషం లేదని జనసేన అధినేత పవన్ తెలిపారు. ఇసుక కొరతపై లాంగ్ మార్చ్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం పవన్ మాట్లాడుతూ జగన్‌ గొప్ప నాయకుడైతే తన కంటే ఎవరూ ఎక్కువ సంతోషించరన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాను పార్టీ పెట్టలేదని చెప్పారు. తాను టీడీపీతో విభేదించిన మాట వాస్తవమేనని పవన్ స్పష్టం చేశారు.తాను కష్టాల్లో ఉన్న ప్రజలకు దత్తపుత్రుడినని చెప్పారు. తమ పాలసీలు సరిగా లేనప్పుడు ఎలా పరిపాలిస్తారని ఆయన ప్రశ్నించారు. అజయ్‌కల్లామ్‌ లాంటి ఆలోచనపరులు ఉండి కూడా ఎందుకిలా చేస్తున్నారని నిలదీశారు. వైసీపీలో ఏకస్వామ్యం మాత్రమే ఉందిని, ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు. ఒకడి ఇష్టానుసారం నడిస్తే ప్రభుత్వాలు కూలిపోతాయన్నారు. జగన్‌ ప్రభుత్వంలో డిబేట్లు లేవని, ఆలోచనలు పంచుకోవడం కూడా లేదని పవన్ వ్యాఖ్యానించారు.  జగన్ ఇష్టానుసారం చేసుకుంటూ పోతున్నారని, అందుకే ఇలా జరుగుతుందని పవన్ తెలిపారు. ఇప్పటి వరకు వర్షాలు పడలేదా?, వరదలు రాలేదా? అని ఆయన ప్రశ్నించారు. పవన్ ఇంకా మాట్లాడుతూ ''ఇప్పుడే ఇసుక కొరత ఎందుకు వచ్చింది?. దేశంలో ఎక్కడా లేనట్లుగా ఇక్కడే ఇసుక కొరత ఎందుకు ఉంది. కూలీలు ఎందుకు చనిపోతున్నారు?. జీవనాధారం పోయిందని ఆవేదన పడుతూ సెల్ఫీ వీడియోలు తీసి కూలీలు చనిపోతున్నారు. ఇంత కంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా?. ఇంతమంది జనం ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేబినెట్‌ మంత్రులకు జీతభత్యాలు తీసుకునే అర్హత లేదు. జనం కష్టాలు అర్థంకాని వారికి ప్రజాధనంతో విలాసాలు ఎందుకు?. అధికారంలోకి రాగానే రాజధాని కట్టం అని చెప్పారు. విజయసాయిరెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఫ్యాక్షన్‌ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదు. నా జీవితంలో చాలా చూసి వచ్చా, ఎన్నో దెబ్బలు తిన్నా. సూట్‌కేస్‌ కంపెనీలు పెట్టే విజయసాయిరెడ్డి రాజ్యసభకు వెళ్లారు. విజయసాయిరెడ్డి విమర్శలకు మేం సమాధానం చెప్పాలా?. విజయసాయిరెడ్డి సమాజసేవ చేసి జైలుకి వెళ్లారా?. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై వైసీపీకి రెండు వారాల గడువు ఇస్తున్నాం. ఒక్కో కార్మికుడికి రూ.50 వేలు ఇవ్వాలి. చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. రెండు వారాల్లో స్పందించకపోతే అమరావతి వీధుల్లో నడుస్తా. చంద్రబాబు మీద కోపంతో ఇంత మంది ప్రజల్ని శిక్షిస్తారా?. కూల్చివేతలతో మొదలుపెట్టిన ప్రభుత్వం కూలిపోతుంది. ఇది కర్మ సిద్ధాంతం కాదు..చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ప్రజల్ని మీరు ఎలా చూస్తారో.. వాళ్లు మిమ్మల్ని అలానే చూస్తారు. 151 సీట్లు వచ్చిన నాయకులు కూడా దీనికి అతీతులు కాదు. నేను ఆశయానికి కట్టుబడేవాడిని. ప్రత్యేక హోదా అనే ఆశయానికి కట్టుబడే నేను మోదీతో విభేదించా. నన్ను మోదీ చాలా ప్రేమగా పిలిచేవారు. ప్రతి శుక్రవారం కోర్టులకు వెళ్లే మీరు జనాలను పాలిస్తారా?. కులాలు, వర్గాలు అంటూ మాట్లాడుకోవడం ఏపీ దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్‌ కులాల మధ్య ఇరుక్కుపోయింది. ఆర్టీసీ కార్మికుల కోసం తెలంగాణలో పార్టీలు ఏకమయ్యాయి. ఏపీలో అలాంటి పరిస్థితి లేదు'' అని చెప్పారు.


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image