రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన జీవోను విమర్శించడం తగదు 

రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన జీవోను విమర్శించడం తగదు 
* రాష్ట్ర ప్రజా విధానాల ప్రభుత్వ సలహాదారు కె.రామచంద్రమూర్తి 
అమరావతి: రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 2430ని విమర్శించడం తగదని రాష్ట్ర ప్రజా విధానాల ప్రభుత్వ సలహాదారు డాక్ట‌ర్ కె.రామచంద్రమూర్తి హిత‌వు పలికారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డా.బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులకు  ఎవరైనా భంగం కల్పిస్తే నేరం అవుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు. గతంలో  సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కు పలు శాఖలపై పత్రికల్లో వచ్చిన తప్పుడు  కథనాలపై ఆయా శాఖల తరపున ఖండనతో పాటు చట్టపరంగా కోర్టుకు వెళ్లే అధికారం ఉండేదన్నారు. ప్రస్తుతం ఆ జీవోను మార్పు చేసి మంత్రివర్గ ఆమోదంతో సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ప్రత్యేక అధికారాలను బదలాయించడం జరిగిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పనులు సకాలంలో అందరికీ చేరాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఈ క్రమంలో ఎక్కడ తప్పులు జరిగితే పత్రికలు ఆధారాలు, వివరణలతో ప్రచురించవచ్చన్నారు. ఏ వ్యక్తి, సంస్థ, ప్రభుత్వానికైనా అన్యాయం జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చన్నారు. ఇటీవల అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ తప్పుడు కథనాలు రాస్తున్న పత్రికలపై చర్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం చేసే మంచి పనులను అభూత కల్పన చేసి ఆధారాలు లేకుండా పత్రికల్లో అసత్యాలు రాయడం వలన ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడం తగదని హితవు పలికారు. ఏ శాఖలో అయినా తప్పు జరిగితే సంబంధిత వార్త పత్రికల్లో ప్రచురితం అయినప్పుడు ఆయా శాఖ ఉన్నతాధికారులు బాధ్యత వహించి వివరణ ఇవ్వాలని, సంబంధిత ఖండనను పత్రికలు ప్రచురించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందన్నారు. అసత్య కథనాలు రాసిన పత్రికా యాజమాన్యాలకు నోటీసులు పంపడం, వివరణ కోరడం, న్యాయస్థానాల ద్వారా సమస్య పరిష్కరించుకోవడం జరుగుతుందన్నారు. 
                               గత ప్రభుత్వం తమపై కేసులు పెట్టడం మూలాన ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరగడం జరుగుతోందని కె.రామచంద్రమూర్తి  అన్నారు. ఎవరైనా తమ స్వేచ్ఛకు భంగం వాటిల్లినప్పుడు న్యాయస్థానాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వంపై కల్పిత కథనాలు రాయడం వలన  ప్రజలు గందరగోళానికి గురవ్వడం, అసమ్మతిని సృష్టించడం వలన వారిని తప్పుదోవ పట్టించడం నేరమే అవుతుందన్నారు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని ఆయన పేర్కొన్నారు. అధికారులు తప్పు చేస్తే ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలే ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలన్నారు. వార్తలు రాసే ముందు సంబంధిత వ్యక్తులను విచారించి ప్రచురించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఒకవేళ వారు స్పందించని పక్షంలో ఆ విషయాన్ని క్రోడీకరిస్తూ వార్తను ప్రచురించవచ్చన్నారు.


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image