శ్రీసిటీలో పాత తరం కార్ల ప్రేమికులకు కనువిందు

 





 

శ్రీసిటీ - అంతిమతీర్పు. 8-12- 2019


శ్రీసిటీలో ఫియట్ వింటేజ్ కార్ల ర్యాలీ, ప్రదర్శన  


-   పాత తరం కార్ల ప్రేమికులకు కనువిందు 


 


శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద ఆదివారం ఉదయం క్లాసిక్ ఫియట్ కార్ల పరిశీలన పరిసర ప్రాంత ప్రజలను ఎంతగానో అలరించింది. దశాబ్దాల పాటు వాహన  రంగంలో తిరుగులేని  బ్రాండుగా  వెలుగొందిన ప్రీమియర్ పద్మినితో సహా,   1952-1990 సంవత్సరాల మధ్య తయారైన  ఫియట్ యొక్క వివిధ మోడళ్ళకు చెందిన 13 కార్లు శ్రీసిటీ సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ వేలో క్యూకట్టి చూపరులకు చూసే అవకాశం కల్పించింది. ఫియట్ క్లాసిక్ కార్ క్లబ్-చెన్నై (ఎఫ్‌సి 4) సభ్యులు వార్షిక డ్రైవ్‌లో భాగంగా తమ క్లాసిక్ ఫియట్స్‌లో చెన్నై నుండి శ్రీసిటీకి వచ్చి మెగా ర్యాలీ నిర్వహించారు. 



ఆదివారం ఉదయం 11.30 గంటలకు శ్రీసిటీ ప్రవేశద్వారం నుండి 
కార్ల ర్యాలీ
ప్రారంభమైంది. జీరో పాయింట్ నుంచి  సెంట్రల్ ఎక్స్‌ప్రెస్‌వేలోని మామిడి రిసార్ట్‌లోకి వెళ్లి, వెనక్కి తిరిగి, శ్రీసిటీలోని ప్రధాన రహదారుల గుండా ప్రయాణించింది. మధ్యాహ్నం 1.30 గంటలకు బిజినెస్ సెంటర్‌కు చేరుకోవడంతో ర్యాలీ ముగిసింది. 



క్లబ్ వ్యవస్థాపకుడు సుంజీత్ సుధీర్ నేతృత్వంలో 
సహ వ్యవస్థాపకుడు మిస్టర్ మను ప్రసాద్, మోడరేటర్లు వినోత్ రాగం, కోశాధికారి కళ్యాణ్ కిషన్ సింగ్ సహా 25 మంది సభ్యుల బృందం ర్యాలీలో పాల్గొన్నారు. వీరంతా చెన్నైలోని  పలు  ప్రఖ్యాత వ్యాపార సంస్థల అధినేతలు. శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ రమేష్ కుమార్ వారికి సాదర స్వాగతం పలికి, ర్యాలీలో పాల్గొన్నారు. బిజినెస్ సెంటర్ వద్ద శ్రీసిటీ మౌళిక వసతులు, ప్రత్యేకతలు గురించి వారికి వివరించారు.



సుంజీత్ సుధీర్ మాట్లాడుతూ, చెన్నైలోని  ఔత్సాహిక ఫియట్ ప్రేమికులందరినీ ఒకచోట చేర్చి, వారిలో స్నేహాన్ని పెంచుకోవడమే క్లబ్ యొక్క ఉద్దేశ్యంగా తెలిపారు. సంవత్సరానికి ఒకసారి క్లబ్ సభ్యులు లాంగ్ డ్రైవ్‌కి వెళతారన్నారు. ఈ సంవత్సరానికి శ్రీసిటీని ఎంచుకున్నామన్నారు. తమ ప్రతిపాదనను అంగీకరించి, గొప్ప ఆతిథ్యంతో సందర్శనను నిర్వహించినందుకు మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీసిటీ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల పట్ల ముగ్దులైన వారంతా  ఈ పర్యటన  తమందరికీ మరచిపోలేని  ఒక మధురానుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. శ్రీసిటీలో 185 కి పైగా కంపెనీలు, 50 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించబడ్డాయని తమకు ఇప్పటివరకు తెలియదన్నారు. ఉద్యోగుల్లో సగానికి పైగా మహిళలు వుండడం చాలా ప్రత్యేకతమన్నారు. 

కాగా, వింటేజ్ కార్ ర్యాలీ, ప్రదర్శనను ఫియట్ క్లాసిక్ కార్ క్లబ్-చెన్నై (ఎఫ్‌సి 4) మరియు శ్రీసిటీ సంయుక్తంగా నిర్వహించాయి.  చెన్నైలో క్లాసిక్ ఫియట్స్ కోసం ఏర్పాటైన ఈ  ప్రత్యేకమైన క్లబ్ సభ్యుల వద్ద, 1952-1990 సంవత్సరాల మధ్య తయారైన  ప్రీమియర్  పద్మినీతో సహా ఫియట్ యొక్క వివిధ మోడల్ కార్లు ఉన్నాయి. 








 

Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image