మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతోంటే జీర్ణించుకోలేని పరిస్థితి

డిసెంబరు 2, 2019
గుంటూరు


గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 'వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా' ప్రారంభం అనంతరం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగంలో ముఖ్యాంశాలు:


– ఇవాళ రకరకాల ఆరోపణల మధ్య రాష్ట్రంలో పరిపాలన చూస్తున్నాం. మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతోంటే జీర్ణించుకోలేని పరిస్థితి.
– ఈ మధ్య కాలంలో నా మతం, కులం గురించి మాట్లాడుతున్నారు.
– కానీ 'నా మతం మానవత్వం. నా కులం మాట నిలబెట్టుకోవడం' అని ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను.
– ఆపరేషన్‌ తర్వాత విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చినా, పొట్ట కూటి కోసం పనులకు వెళ్లే అవసరం లేకుండా ఈ పథకం ప్రవేశపెట్టాము. 
– రోగి విశ్రాంతి తీసుకునే సమయంలో రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేలు ఇస్తాము. అది ఎన్ని నెలలైనా ఇస్తాము. వైద్యులు ఎన్నాళ్లు సూచిస్తే అన్ని రోజులు ఈ సహాయం చేస్తాము. 
– అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాం. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారికి కూడా పెంచాము.
– ఆ మేరకు జనవరి 1 నుంచి కొత్త కార్డులు జారీ చేయబోతున్నాము. వాటికి క్యూఆర్‌ కోడ్‌ కూడా ఇస్తాము. అందులో ఆ వ్యక్తి మెడికల్‌ రికార్డుకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి.
–  ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, 1200 రోగాలకు పథకం విస్తరిస్తూ, జనవరి 1 నుంచి మార్పు చేయబోతున్నాం. 
– వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ లో చేరుస్తాము. పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరి 1 నుంచి 3 నెలల పాటు అమలు చేస్తాము.
– ఆ తర్వాత ఏప్రిల్‌ నుంచి నెలకు ఒక జిల్లా చొప్పున విస్తరిస్తాము. 
– ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2 వేల రోగాలను తీసుకువస్తాము.
– రూ.1000 దాటిన ప్రతి వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేరుస్తాము
– 108, 104 సర్వీసులను మెరుగుపరుస్తూ 1060 అంబులెన్సులు కొనుగోలు చేస్తాము. ఏప్రిల్‌ 1 నాటికి అవి అందుబాటులోకి వస్తాయి.
– ఆరోగ్యశ్రీలో పెను మార్పులు చేస్తూ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో 150కి పైగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాము.
– డిసెంబరు 15 నాటికి 510 రకాల మందులు ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులోకి వస్తాయి.
– ఇవే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏప్రిల్‌ నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో కూడిన ఔషధాలు అందుబాటులో ఉంటాయి
– డిసెంబరు 26 నుంచి ఆస్పత్రుల్లో పరిస్థితుల మార్పు. నాడు–నేడు. మూడేళ్లలో ఆస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నాము.
– జనవరి 1 నుంచి పింఛన్లు. తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల పింఛను
– పక్షవాతం, ఇతర జబ్బులతో వీల్‌ చైర్, మంచానికే పరిమితమైన వారికి రూ.5 వేలు పింఛను ఇస్తాము
– ఇంకా బోదకాలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు (స్టేజ్‌ 3, 4, 5)  రూ.5 వేలు ఇస్తాము. అదే విధంగా కుష్టు వ్యాధిగ్రస్తులను రూ.3 వేల కేటగిరీలోకి తీసుకువస్తాము
– మే నెల నాటికి ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టులు, నర్సులు, సిబ్బంది పోస్టులన్నీ భర్తీ చేస్తాము.
– జనవరి 1 నుంచి క్యాన్సర్‌ రోగులకు మెరుగైన చికిత్స. వారిని ఆరోగ్యశ్రీలో చేర్చాము. కానీ రేడియేషన్‌కు చాలా ఖర్చవుతోంది.
– అందుకే జనవరి 1 నుంచి ప్రతి క్యాన్సర్‌ రోగికి ఎన్ని సైకిల్స్‌ అవసరమైనా, అన్నింటి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది.
– నెట్‌వర్క్‌ ఆస్పత్రులను గ్రేడ్‌–ఏ, గ్రేడ్‌–ఏ ప్లస్‌గా మార్కింగ్‌ చేయమని నిర్దేశించాము.
– ఏ ఆస్పత్రి కూడా గ్రేడ్‌–ఏ కేటగిరీలో లేకపోతే ఆరోగ్యశ్రీ వర్తింపచేయలేము. 
– ఆరు నెలల్లో గ్రేడ్‌–ఏ ఆస్పత్రులు కచ్చితంగా గ్రేడ్‌–ఏ ప్లస్‌గా మారాలి
– విజయనగరం, పాడేరు, ఏలూరు, గురజాల, మచిలీపట్నం, మార్కాపురం, పులివెందులలో కొత్త ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాము
– వైద్యం అన్నది ఒక పర్వం. దీంతో పాటు ప్రజల అలవాట్లు మారాలి. సమాజం కూడా మారాలి. అప్పుడే వైద్యం ఖర్చు తగ్గుతుంది.
– అందుకే మద్యం షాపులు క్రమంగా తగ్గిస్తున్నాం. 20 శాతం మద్యం షాపులు తగ్గించాము. 43వేల బెల్టుషాపులు మూసివేయించాము. 
– ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్‌ మీడియమ్‌గా మారుస్తున్నాము. 
– ఎవరు, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా గట్టిగా నిలబడతాను. మీ అందరి దీవెనలు, దేవుడి ఆశీస్సులతో గట్టిగా నిలబడతానని నమ్ముతున్నాను.